అన్వేషించండి

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఫోన్ ట్యాపింగ్ దుమారం- నేతల్లో విస్తృతంగా చర్చ!

ఏపీలోని అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అంశం తీవ్ర కలకలం రేపింది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతొంది. కోటం రెడ్డి శ్రీదర్ రెడ్డి చేసిన ప్రకటన తరువాత మంత్రి కాకాణి దానికి కౌంటర్ ఇవ్వటం, ఆ తరువాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ వ్యవహరంలో కామెంట్స్ చేశారు. దీనిపై ఘాటుగా రియాక్ట్ అయిన కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి నేరుగా ఆధారాలు ఇవిగో అంటూ ఇంటలిజెన్స్ చీఫ్‌ నెంబరే మీడియాకు చూపించారు. ఆయనతో జరిగిన సంభాషణను మీడియాకు వినించారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫోన్ ట్యాపింగ్...

ఏపీలోని అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అంశం తీవ్ర కలకలం రేపింది. పార్టీకి మొదటి నుంచి నమ్మిన బంటుగా ఉన్న కోటం రెడ్డి నుంచే ఇలాంటి కామెంట్స్ రావటంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే అవి కాస్త ఇప్పుడు అధికార పార్టీలో మరింత ముసలాన్ని రాజేసేలా కనిపిస్తున్నాయి. తాను చేసిన కామెంట్స్‌కు కట్టుబడి ఉన్నానని, ఆధారాలుకూడా కోటం రెడ్డి బయటపెట్టారు. 

ట్యాప్ చేసేందుకు ఏకంగా అధినాయకత్వమే ప్రయత్నించిందని ఆరోపించారు. కోటం రెడ్డి వ్యాఖ్యల్లో వాస్తవం లేదంటూ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి లైట్ తీసుకునే ప్రయత్నం చేసి, వాటిని డైవర్ట్ చేయటానికి చేసిన ప్రయత్నం కూడ కోటం రెడ్డి అంతే స్పీడ్ గా కౌంట్ ఇచ్చారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం ఈ ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు యత్నించినా కోటం రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. నమ్మకం లేని చోట ఉండలేమంటూ కోటం రెడ్డి చేసిన కామెంట్స్‌ వైరల్ కావటంతో, రాజకీయంగా ఈ వ్యవహరం మరింత హీట్ ను రాజేసింది.

అప్పుడు ...ఇప్పుడు....

ఫోన్ ట్యాపింగ్‌ల వ్యవహరం రాజకీయాల్లో కోత్తేమి కాదు. అయితే అధికార పార్టీలో అందులోనూ వైసీపీకి చెందిన నేతలు తమ సొంత పార్టీకి చెందిన నేతలు, ప్రభుత్వంలోని అధికారులపై విమర్శలు గుప్పించటం హాట్ టాపిక్ గా మారుతోంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రఘురామ రాజు కూడా ఇదే తరహాలో ఆరోపణలు చేశారు. ఆయన ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెబల్ ఎంపీగానే కొనసాగుతున్నారు. దీంతో ఈ వ్యవహరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరకాటంగానే మారింది. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు ఆనం రాంనారాయణ రెడ్డి కూడా మద్దతు పలికారు. తన ఫోన్ కూడా ట్యాప్ అయిందన్నారు. 

పార్టీ నేతల్లో చర్చ...

తాజా రాజకీయ పరిణామాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫోన్ ట్యాపింగ్ కు సంబందించిన అంశంపై దుమారం రేగిన తరువాత, నాయకులు సైతం కొంత అసహనానికి గురవుతున్నారు. ఎవరెవరు ఎవరితో ఫోన్ లో మాట్లాడారు అనే విషయాలు బయటకు వస్తాయనే సందేహాలు, అనుమాలు పార్టీ నేతల్లో సైతం చర్చ జరుగుతుంది. పార్టీకి చెందిన నేతలు ఎవరు కలుసుకున్నా, నవ్వుతూనే, సెటైర్లు వేసుకుంటున్నారు. ఇంతకీ అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అంటూ, చివరల్లో ఒకరిని ఒకరు ప్రశ్నించుకుంటున్నారు. ఒక వేళ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే, తాము ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి భయం ఏంటని కొందరు నేతలు అంటుంటే, అసలు అలాంటి పరిస్థితి రాదని ఇంకొందరు నేతలు కొట్టిపారేస్తున్నారు. అయితే ఎన్నికల సమయం కావటంతో ఇలాంటి పరిస్థితులు పార్టీ నేతలకు ఇరకాటమేనని మరి కొందలు వాదిస్తున్నారు.

టీడీపీ హయాంలో కూడా....

టీడీపీ హాయాంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని వైసీపీ నేతలు తెరమీదకు తెస్తున్నారు. పెగాసెస్ వంటి సాఫ్ట్ వేర్ కొనుగోలుపై ఇప్పటికే హౌస్ కమిటి వేయటం, ఆ కమిటి నివేదికను కూడా సమర్పించిన విషయాలను ప్రస్తావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ నిజంగా జరిగి ఉంటే అదంతా కేంద్రం పరిధిలో ఉండే వ్యవస్ద కాబట్టి, పార్టీకి ఏం సంబంధం ఉంటుందని కూడా నేతలు తమ అభిప్రాయపడుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP and Telangana: నేడు ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం, 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
నేడు ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం, 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Embed widget