అన్వేషించండి

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఫోన్ ట్యాపింగ్ దుమారం- నేతల్లో విస్తృతంగా చర్చ!

ఏపీలోని అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అంశం తీవ్ర కలకలం రేపింది.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతొంది. కోటం రెడ్డి శ్రీదర్ రెడ్డి చేసిన ప్రకటన తరువాత మంత్రి కాకాణి దానికి కౌంటర్ ఇవ్వటం, ఆ తరువాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ వ్యవహరంలో కామెంట్స్ చేశారు. దీనిపై ఘాటుగా రియాక్ట్ అయిన కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి నేరుగా ఆధారాలు ఇవిగో అంటూ ఇంటలిజెన్స్ చీఫ్‌ నెంబరే మీడియాకు చూపించారు. ఆయనతో జరిగిన సంభాషణను మీడియాకు వినించారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫోన్ ట్యాపింగ్...

ఏపీలోని అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అంశం తీవ్ర కలకలం రేపింది. పార్టీకి మొదటి నుంచి నమ్మిన బంటుగా ఉన్న కోటం రెడ్డి నుంచే ఇలాంటి కామెంట్స్ రావటంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే అవి కాస్త ఇప్పుడు అధికార పార్టీలో మరింత ముసలాన్ని రాజేసేలా కనిపిస్తున్నాయి. తాను చేసిన కామెంట్స్‌కు కట్టుబడి ఉన్నానని, ఆధారాలుకూడా కోటం రెడ్డి బయటపెట్టారు. 

ట్యాప్ చేసేందుకు ఏకంగా అధినాయకత్వమే ప్రయత్నించిందని ఆరోపించారు. కోటం రెడ్డి వ్యాఖ్యల్లో వాస్తవం లేదంటూ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి లైట్ తీసుకునే ప్రయత్నం చేసి, వాటిని డైవర్ట్ చేయటానికి చేసిన ప్రయత్నం కూడ కోటం రెడ్డి అంతే స్పీడ్ గా కౌంట్ ఇచ్చారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సైతం ఈ ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు యత్నించినా కోటం రెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. నమ్మకం లేని చోట ఉండలేమంటూ కోటం రెడ్డి చేసిన కామెంట్స్‌ వైరల్ కావటంతో, రాజకీయంగా ఈ వ్యవహరం మరింత హీట్ ను రాజేసింది.

అప్పుడు ...ఇప్పుడు....

ఫోన్ ట్యాపింగ్‌ల వ్యవహరం రాజకీయాల్లో కోత్తేమి కాదు. అయితే అధికార పార్టీలో అందులోనూ వైసీపీకి చెందిన నేతలు తమ సొంత పార్టీకి చెందిన నేతలు, ప్రభుత్వంలోని అధికారులపై విమర్శలు గుప్పించటం హాట్ టాపిక్ గా మారుతోంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రఘురామ రాజు కూడా ఇదే తరహాలో ఆరోపణలు చేశారు. ఆయన ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెబల్ ఎంపీగానే కొనసాగుతున్నారు. దీంతో ఈ వ్యవహరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరకాటంగానే మారింది. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు ఆనం రాంనారాయణ రెడ్డి కూడా మద్దతు పలికారు. తన ఫోన్ కూడా ట్యాప్ అయిందన్నారు. 

పార్టీ నేతల్లో చర్చ...

తాజా రాజకీయ పరిణామాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫోన్ ట్యాపింగ్ కు సంబందించిన అంశంపై దుమారం రేగిన తరువాత, నాయకులు సైతం కొంత అసహనానికి గురవుతున్నారు. ఎవరెవరు ఎవరితో ఫోన్ లో మాట్లాడారు అనే విషయాలు బయటకు వస్తాయనే సందేహాలు, అనుమాలు పార్టీ నేతల్లో సైతం చర్చ జరుగుతుంది. పార్టీకి చెందిన నేతలు ఎవరు కలుసుకున్నా, నవ్వుతూనే, సెటైర్లు వేసుకుంటున్నారు. ఇంతకీ అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అంటూ, చివరల్లో ఒకరిని ఒకరు ప్రశ్నించుకుంటున్నారు. ఒక వేళ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే, తాము ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి భయం ఏంటని కొందరు నేతలు అంటుంటే, అసలు అలాంటి పరిస్థితి రాదని ఇంకొందరు నేతలు కొట్టిపారేస్తున్నారు. అయితే ఎన్నికల సమయం కావటంతో ఇలాంటి పరిస్థితులు పార్టీ నేతలకు ఇరకాటమేనని మరి కొందలు వాదిస్తున్నారు.

టీడీపీ హయాంలో కూడా....

టీడీపీ హాయాంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని వైసీపీ నేతలు తెరమీదకు తెస్తున్నారు. పెగాసెస్ వంటి సాఫ్ట్ వేర్ కొనుగోలుపై ఇప్పటికే హౌస్ కమిటి వేయటం, ఆ కమిటి నివేదికను కూడా సమర్పించిన విషయాలను ప్రస్తావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ నిజంగా జరిగి ఉంటే అదంతా కేంద్రం పరిధిలో ఉండే వ్యవస్ద కాబట్టి, పార్టీకి ఏం సంబంధం ఉంటుందని కూడా నేతలు తమ అభిప్రాయపడుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
AP CM Chandrababu: బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం.. ఘాటుగా స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
బెంగాల్‌లో రాష్ట్రపతికి చేదు అనుభవం.. ఘాటుగా స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Vijayawada Firing Case: విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
T20 World Cup Winner: అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Alcohol Banned Countries : ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
Embed widget