News
News
X

స్కూల్‌ ఫంక్షన్‌లో డ్యాన్స్ చేస్తున్న బాలుడిని తీసుకెళ్లిన ఖాకీలు- ఆరా తీస్తే రెండు రాష్ట్రాల పోలీసులు షేక్‌ అయ్యారు!

ఎన్టీఆర్‌ జిల్లాలో ఓ బాలుడిని స్కూల్‌ నుంచే పోలీసులు తీసుకెళ్లడం కలకలం రేగింది. ఈ కేసు రెండు రాష్ట్రాల పోలీసులను షేక్ చేసింది.

FOLLOW US: 
Share:

ఏడాది క్రితం మహారాష్ట్రలో కిడ్నాప్‌నకు గురైన బాలుడు, జగ్గయ్యపేటలో పోలీసులకు చిక్కాడు. పాఠశాల వార్షికొత్సవంలో పాల్గోంటున్న ఆ బాలుడిని మహారాష్ట్ర పోలీసులు, స్దానిక పోలీసులు సహకారంతో తీసుకువెళ్లారు. 

ముంబయిలో కిడ్నాప్ అయిన బాలుడు ఏడాది తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జగ్గయ్యపేట ప్రాంతంలోని దేవుపాలెం గ్రామంలో ప్రత్యక్షమయ్యాడు. జగ్గయ్యపేటలోని ఒక ప్రైవేట్ స్కూలులో ప్రస్తుతం ఆ బాలుడు చదువుతున్నాడు. ముంబయిలో 2022లో బాలుడు కిడ్నాప్‌కు గురైనట్లుగా కుటుంబ సభ్యులు అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అక్కడ పోలీసులకు విజయవాడకు చెందిన మహిళ బాలుడిని తీసుకువెళ్లినట్లుగా గుర్తించారు. ఆమె బాలుడిని జగయ్యపేటలోని ఓ మహిళకు 2లక్ష్లల రూపాయలకు అమ్మేసింది. ఆమె దేవుపాలెంలోని తమ బంధువులకు మూడు లక్షల రూపాయలకు బాలుడిని ఇచ్చేసింది. 

అప్పటి నుంచి అదే కుటుంబంలో పెరుగుతున్న ఆ బాలుడు జగ్గయ్యపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. అంతా వారి పిల్లాడే అనుకుంటున్న టైంలో పోలీసులు వచ్చి ఆ బాలుడిని తీసుకెళ్లిపోయారు. మహారాష్ట్రకు చెందిన ఫ్యామిలీ బిడ్డగా చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. 

పాఠశాల వార్షికోత్సవంలో సందడి చేస్తున్న సదరు బాలుడిని పోలీసులు గుర్తించి తీసుకెళ్లారు. ఆధారాలతో పోల్చి చూశారు. మహారాష్ట్ర పోలీసులు, స్థానిక పోలీసులు మాట్లాడుకొని గతంలో కిడ్నాప్ అయిన బాలుడు ఈ బాలుడు ఒక్కడే అని నిర్దారణకు వచ్చారు.  దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలుడిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఎస్ఐ రామారావు సహకారంతో మహారాష్ట్ర పోలీసులు కేసు పత్రాలు చూపించి, బాలుడిని తీసుకెళ్లిపోయారు. 

పెంచుకున్న తల్లి ఆవేదన...

ఏడాదిగా పెంచుకుంటున్న బాలుడిని హఠాత్తుగా పోలీసులు తీసుకువెళ్ళిపోవటంతో పెంచుకున్న తల్లి, కుటుంబ సభ్యులు బోరుమంటున్నారు. ఈ వ్యవహరం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో కిడ్నాప్ చేసిన విజయవాడకు చెందిన మహిళ శ్రావణి, మధ్యవర్తిగా వ్యవహరించిన జగ్గయ్యపేటకు చెందిన మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్లను విచారించడంతో బాలుడి ఆచూకీ లభించిందని, పూర్తి సమాచారం సేకరించి, కేసుకు సంబందించిన ఎఫ్ఐఆర్ పత్రాలు, ఇతర వివరాలు తెలుసుకొన్న తరువాతే బాలుడిని మహారాష్ట్ర పోలీసులకు అప్పగించారు. 

మహారాష్ట్ర పోలీసుల ఇచ్చిన సమాచారంతో...

ఈ కేసు వ్యవహరం తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఏడాది క్రితం మహారాష్ట్రలో బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకువచ్చి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విక్రయించటం సంచలనంగా మారింది. ఈ కేసు ఆధారంగా అక్కడ పోలీసులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అంతా మహిళల పేర్లు మాత్రమే ఈ కేసులో వినిపించటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు రెడీ అవుతున్నారు. 

తెర వెనుక ఉన్న వారి వివరాలు ఏంటి, కేవలం మహిళలే ఈ దందా అంతా నడిపించలేరని భావిస్తున్నారు పోలీసులు. ఏడాది కాలంలో ముగ్గురు మహిళలు దాదాపుగా 5లక్షల రూపాయలు చేతులు మార్చి, బాలుడిని వేరొకరికి అప్పగించటం వెనుక అసలు సూత్రధారులు ఎవరన్నది విచారణ చేస్తున్నారు. కేవలం ఈ బాలుడు మాత్రమే ఇలా దొరికాడా... లేక ఇంకెవరయినా పిలల్లలు వీరి చేతికి చిక్కారా అన్న అంశం పై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. తెర వెనుక ఉన్న చేతులు ఎవరివి అన్నదాని పై పోలీసులు వివరాలను సేకరించి, సెల్ ఫోన్ ఆధారంగా కేసుకు సంబందించిన పూర్తి వివరాల కూపీ లాగుతున్నారు. 

ఎన్టీఆర్ జిల్లా పోలీసులతోపాటుగా, ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన పోలీసు అధికారులు ఈ విచారణలో పాలుపంచుకుంటున్నారు. ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి బాలుడి కిడ్నాప్ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.  వెలుగులోకి వచ్చిన ఘటన తరువాత, అంతకు ముందు ఉన్న పరిణామాలపై విచారణ చేపట్టారు.

Published at : 06 Mar 2023 01:01 PM (IST) Tags: ANDHRA PRADESH AP Crime Boy Kidnap Jaggaiahpeta Krishna District Maharashtra Boy

సంబంధిత కథనాలు

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

Pawan Kalyan Comments: అసెంబ్లీలో గోరంట్లపై వైసీపీ నేతల దాడి, ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని పవన్ పిలుపు

Pawan Kalyan Comments: అసెంబ్లీలో గోరంట్లపై వైసీపీ నేతల దాడి, ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని పవన్ పిలుపు

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

CPI Narayana : ఏపీ అసెంబ్లీ అరాచకానికి నిలయంలా మారింది, ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిని తట్టుకోలేకే దాడులు- సీపీఐ నారాయణ

CPI Narayana : ఏపీ అసెంబ్లీ అరాచకానికి నిలయంలా మారింది, ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిని తట్టుకోలేకే దాడులు- సీపీఐ నారాయణ

AP Speaker: పోడియం వద్దకు వస్తే ఇక ఆటోమేటిక్ సస్పెండ్, స్పీకర్ తమ్మినేని రూలింగ్

AP Speaker: పోడియం వద్దకు వస్తే ఇక ఆటోమేటిక్ సస్పెండ్, స్పీకర్ తమ్మినేని రూలింగ్

టాప్ స్టోరీస్

Breaking News Live Telugu Updates: విచారణ ముగిసినా ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాని ఎమ్మెల్సీ కవిత

Breaking News Live Telugu Updates: విచారణ ముగిసినా ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాని ఎమ్మెల్సీ కవిత

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌