అన్వేషించండి

Jagananna Thodu: ‘జగనన్న తోడు’ డబ్బు రాకపోతే ఇలా చేయండి, నిధుల విడుదల సందర్భంగా సీఎం జగన్ వెల్లడి

CM Jagan: ఈ రుణాల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నిధులు విడుదల చేసి ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడారు.

‘జగనన్న తోడు’ (Jagananna Thodu) పథకం కింద ఏపీ సీఎం వైస్ జగన్ (YS Jagan) నిధులను విడుదల చేశారు. రోడ్ల పక్కన లేదా తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే వారు వంటి చిరు వ్యాపారులను ఆదుకునే ఉద్దేశంతో జగనన్న తోడు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా చిరు వ్యాపారులు మొత్తం 5,10,462 మందికి ప్రభుత్వం రూ.510.46 కోట్లను విడుదల చేసింది. వీరికి ఇచ్చే రూ.10 వేల రుణాలను వడ్డీ లేకుండా పంపిణీ చేస్తున్నారు. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు 2020 నవంబర్‌ 25న ప్రభుత్వం ప్రత్యేకంగా ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఇప్పటికే తొలి విడతలో 5,35,112 మందికి, రెండో విడతలో 3,70,517 మందికి, రెండు విడతల్లో కలిపి మొత్తం 9,05,629 మందికి రుణాలను అందజేసింది.

మూడో విడతలో భాగంగా జరిగిన ఈ రుణాల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నిధులు విడుదల చేసి ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ (CM Jagan) మాట్లాడారు. చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు పథకం లక్ష్యం అని తెలిపారు. చిరు వ్యాపారులు తమకు తాము ఉపాధి కల్పించుకోవడం గొప్ప విషయమని, లక్షల మంది చిరు వ్యాపారులు స్వయంగా ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు.

వారి కాళ్ల మీద వారు నిలబడడానికి ఎంతగానో ఈ పథకం ఉపయోగపడుతుందని సీఎం జగన్ వెల్లడించారు. తాను చేసిన పాదయాత్రలో చిరు వ్యాపారులు పడుతున్న కష్టాలు చూశానని జగన్‌ తెలిపారు. చిరు వ్యాపారులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకం తీసుకొచ్చామని అన్నారు. వడ్డీ లేని రుణాలు తీసుకున్నవారికి క్రమం తప్పకుండా మళ్లీ లోన్లు ఇస్తామని అన్నారు. ఇప్పటి వరకూ 14 లక్షల మందికి లబ్ధి కలిగేలా చేయగలిగామని వెల్లడించారు. మూడో విడత కింద 5,10,462 మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనున్నట్లు వెల్లడించారు.

ఈ జగనన్న తోడు (Jagananna Thodu) పథకానికి అర్హులై ఉండి ఒకవేళ రుణం కనుక రాకపోతే, గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు. లబ్ధి దారులకు ఈ పథకం గురించి సందేహాలు ఉంటే 08912890525 అనే నెంబరుకు కాల్‌ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. ఎలాంటి అవినీతికి, అక్రమాలకు చోటు లేకుండా లబ్ధిదారులకు రుణాలు అందిస్తున్నామని వివరించారు. ఎవరికైనా డబ్బులు రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget