అన్వేషించండి

Chandra Babu: అమరావతిపై కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం- కళకళలాడుతున్న రాజధాని

Amaravati News: కొత్త ప్రభుత్వం కొలువుదీరక ముందే అమరావతిలో యాక్టివిటీస్ మొదలయ్యాయి. ఐదేళ్లు పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్న అధికారులు. 12 నాటికి పూర్వవైభం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు

Andhra Pradesh News: వంద పొక్లయిన్‌లు, వందల మంది కార్మికులు, రాత్రి పగలు సాగుతున్న పనులు. ఇప్పుడు అమరావతికి పునర్వైభవం వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం రావడంతో రాజధాని అమరావతి కళకళలాడుతోంది. ఐదేళ్లుగా పేరుకుపోయిన చెత్తను అధికారులు తొలగిస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం రెండు రోజుల్లో కొలువు దీరనుంది. ఈ లోపు అక్కడ ఉన్న పరిస్థితిపై నివేదిక ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 

మూడు రాజధానులతో అమరావతి ప్రాంతాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. దీంతో కంప చెట్లు పేరుకుపోయాయి. ఆ ప్రాంతమంతా అడవిని తలపించింది. ఇప్పుడు ప్రభుతవం మారడంతో అక్కడ మళ్లీ యాక్టివిటీస్‌ మొదలయ్యాయి. సీఎస్‌గా నీరబ్‌కుమార్ పగ్గాలు చెపట్టిన తర్వాత అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయి. 

మూడు నాలుగు రోజుల నుంచి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్‌ చేస్తున్నారు. దీని కోసం దాదాపు వంద పొక్లెయిన్లను ఏర్పాటు చేశారు. 25 ప్రాంతాల్లో వందకుపైగా కిలోమీటర్ల పరిధిలో పనులు చేపట్టారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం నాటికి అమరావతిలో పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ పనులను నీరబ్‌ కుమార్ స్వయంగా ఆదివారం పరిశీలించారు. 

అమరావతిలో పనులు జరుగుతున్న ప్రాంతంలో పర్యటించిన సీఎస్ నీరబ్ కుమార్... అక్కడ అధికారులతో మాట్లాడారు. సుమారు రెండు మూడు గంటలు ఆ ప్రాంతంలో గడిపిన ఆయన.. జరుగుతున్న పనులు పరిశీలించారు. రోడ్లను కూడా పరిశీలించారు. రాజధాని కోసం శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని కూడా చూశారు. అక్కడి నుంచి మొదలైన ఆయన పర్యటన సీఆర్‌డీఏ ఆఫీస్‌, తర్వాత వివిధ అధికారిక భవనాలను కూడా గమనించారు. అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

చాలా రోజుల తర్వాత ఉన్నతాధికారులు తమ ప్రాంతానికి రావడంపై రాజధాని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. నీరబ్‌కుమార్‌ను సన్మానించారు అదే టైంలో సీఆర్డీఏ కమిషనర్‌గా ఉన్న వివేక్ యాదవ్‌ పని తీరుపై ఫిర్యాదు చేశారు. సమస్యల గురించి ఎన్నిసార్లు చెప్పుకున్న పట్టించుకోవడం లేదని కలిసేందుకు కూడా సరిగా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని వాపోయారు. 

అనంతరం మీడియాతో మాట్లాడిన నీరబ్ కుమార్... చంద్రబాబు ఆదేశాలతో అమరావతిలో పనులు చేపట్టామన్నారు. మొదటి దశలో పిచ్చిమొక్కులు తొలగిస్తున్నామని తర్వాత సమీక్షించి అక్కడ పనులు పురోగతిపై నివేదిక ఇస్తామన్నారు. అమరావతి ప్రాంతంలో జరిగిన చోరీలపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల కౌలు అంశంపై కూడా త్వరగానే గుడ్ న్యూస్ చెబుతామన్నారు. 
మరోవైపు 12న ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబుకు అమరావతిపై సమగ్రమైన నివేదిక ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న కట్టడాల పటిష్టతపై ఆరా తీయనున్నారు. దీని కోసం ఓ కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం అందుతోంది. వీలైనంత త్వరగా కమిటీ రిపోర్టు ఇచ్చేలా చేసి రాజధాని పనులు త్వరితగతిన చేపట్టాలని భావిస్తున్నారు. 
ఇప్పటి వరకు వేసిన రహదారులు పూర్తిగా పాడైపోయాయి. విద్యుత్ దీపాలు వెలగడం లేదు. వాటిని పునరుద్ధరించారు. రహదారులను కూడా మరోసారి సరిచేయాలి. వీటన్నింటికి చాలా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. రాత్రి పగలు పనులు చేపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులతో రాజధాని ప్రాంతంలో జనాల రాకపోకలు కనిపిస్తున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran War Effect AP Hotels: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
YS Jagan: ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
CM Chandrababu: ఈ 23న ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.. గేమ్ ఛేంజర్‌గా P4 మోడల్: సీఎం చంద్రబాబు
ఈ 23న ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.. గేమ్ ఛేంజర్‌గా P4 మోడల్: సీఎం చంద్రబాబు
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం

వీడియోలు

ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CEC Gyanesh Kumar : సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
Ustaad Bhagat Singh : సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
LPG Delivery Delay : గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
Harish Shankar: హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
Affordable Mileage Bikes: హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Viral Girl Love Jihad Controversy: వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
Lok Sabha Rahul Gandhi: భారత సార్వభౌమత్యాన్ని అమెరికాకు లొంగిపోయేలా చేశారు - లోక్‌సభలో రాహుల్ గాంధీ విమర్శలు
భారత సార్వభౌమత్యాన్ని అమెరికాకు లొంగిపోయేలా చేశారు - లోక్‌సభలో రాహుల్ గాంధీ విమర్శలు
Embed widget