అన్వేషించండి

Chandra Babu: అమరావతిపై కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం- కళకళలాడుతున్న రాజధాని

Amaravati News: కొత్త ప్రభుత్వం కొలువుదీరక ముందే అమరావతిలో యాక్టివిటీస్ మొదలయ్యాయి. ఐదేళ్లు పేరుకుపోయిన చెత్తను తొలగిస్తున్న అధికారులు. 12 నాటికి పూర్వవైభం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు

Andhra Pradesh News: వంద పొక్లయిన్‌లు, వందల మంది కార్మికులు, రాత్రి పగలు సాగుతున్న పనులు. ఇప్పుడు అమరావతికి పునర్వైభవం వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం రావడంతో రాజధాని అమరావతి కళకళలాడుతోంది. ఐదేళ్లుగా పేరుకుపోయిన చెత్తను అధికారులు తొలగిస్తున్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం రెండు రోజుల్లో కొలువు దీరనుంది. ఈ లోపు అక్కడ ఉన్న పరిస్థితిపై నివేదిక ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 

మూడు రాజధానులతో అమరావతి ప్రాంతాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. దీంతో కంప చెట్లు పేరుకుపోయాయి. ఆ ప్రాంతమంతా అడవిని తలపించింది. ఇప్పుడు ప్రభుతవం మారడంతో అక్కడ మళ్లీ యాక్టివిటీస్‌ మొదలయ్యాయి. సీఎస్‌గా నీరబ్‌కుమార్ పగ్గాలు చెపట్టిన తర్వాత అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయి. 

మూడు నాలుగు రోజుల నుంచి అమరావతిలో జంగిల్ క్లియరెన్స్‌ చేస్తున్నారు. దీని కోసం దాదాపు వంద పొక్లెయిన్లను ఏర్పాటు చేశారు. 25 ప్రాంతాల్లో వందకుపైగా కిలోమీటర్ల పరిధిలో పనులు చేపట్టారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం నాటికి అమరావతిలో పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ పనులను నీరబ్‌ కుమార్ స్వయంగా ఆదివారం పరిశీలించారు. 

అమరావతిలో పనులు జరుగుతున్న ప్రాంతంలో పర్యటించిన సీఎస్ నీరబ్ కుమార్... అక్కడ అధికారులతో మాట్లాడారు. సుమారు రెండు మూడు గంటలు ఆ ప్రాంతంలో గడిపిన ఆయన.. జరుగుతున్న పనులు పరిశీలించారు. రోడ్లను కూడా పరిశీలించారు. రాజధాని కోసం శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని కూడా చూశారు. అక్కడి నుంచి మొదలైన ఆయన పర్యటన సీఆర్‌డీఏ ఆఫీస్‌, తర్వాత వివిధ అధికారిక భవనాలను కూడా గమనించారు. అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

చాలా రోజుల తర్వాత ఉన్నతాధికారులు తమ ప్రాంతానికి రావడంపై రాజధాని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. నీరబ్‌కుమార్‌ను సన్మానించారు అదే టైంలో సీఆర్డీఏ కమిషనర్‌గా ఉన్న వివేక్ యాదవ్‌ పని తీరుపై ఫిర్యాదు చేశారు. సమస్యల గురించి ఎన్నిసార్లు చెప్పుకున్న పట్టించుకోవడం లేదని కలిసేందుకు కూడా సరిగా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని వాపోయారు. 

అనంతరం మీడియాతో మాట్లాడిన నీరబ్ కుమార్... చంద్రబాబు ఆదేశాలతో అమరావతిలో పనులు చేపట్టామన్నారు. మొదటి దశలో పిచ్చిమొక్కులు తొలగిస్తున్నామని తర్వాత సమీక్షించి అక్కడ పనులు పురోగతిపై నివేదిక ఇస్తామన్నారు. అమరావతి ప్రాంతంలో జరిగిన చోరీలపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల కౌలు అంశంపై కూడా త్వరగానే గుడ్ న్యూస్ చెబుతామన్నారు. 
మరోవైపు 12న ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబుకు అమరావతిపై సమగ్రమైన నివేదిక ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న కట్టడాల పటిష్టతపై ఆరా తీయనున్నారు. దీని కోసం ఓ కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం అందుతోంది. వీలైనంత త్వరగా కమిటీ రిపోర్టు ఇచ్చేలా చేసి రాజధాని పనులు త్వరితగతిన చేపట్టాలని భావిస్తున్నారు. 
ఇప్పటి వరకు వేసిన రహదారులు పూర్తిగా పాడైపోయాయి. విద్యుత్ దీపాలు వెలగడం లేదు. వాటిని పునరుద్ధరించారు. రహదారులను కూడా మరోసారి సరిచేయాలి. వీటన్నింటికి చాలా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. రాత్రి పగలు పనులు చేపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులతో రాజధాని ప్రాంతంలో జనాల రాకపోకలు కనిపిస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Man Buys Bike With 10 Rupee Coins: చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
US Iran News: ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
Pawan Kalyan : నీ చిరునవ్వు ధైర్యం ప్రేమ నా హృదయంలో నిలిచిపోతాయి - నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్
నీ చిరునవ్వు ధైర్యం ప్రేమ నా హృదయంలో నిలిచిపోతాయి - నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Gambhir Silence Broken: సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget