అన్వేషించండి

Amaravati Central Secretariat: అమరావతిలో మినీ ఢిల్లీ - కేంద్ర సచివాలయ నిర్మాణానికి రంగం సిద్ధం

Amaravati: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఢిల్లీలోని సెంట్రల్ వెస్టా తరహాలో నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు.

Mini Delhi in Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. దీని కోసం రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేది తుది దశకు చేరుకుంది. ఢిల్లీలోని  సెంట్రల్ వెస్టా  తరహాలో, సుమారు  20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక సచివాలయ సముదాయాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్న సుమారు 50కి పైగా కేంద్ర ప్రభుత్వ విభాగాలు, అనుబంధ సంస్థలు ఈ నూతన భవనంలోకి మారనున్నాయి.

అత్యాధునిక డిజైన్ - గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్                                    

ఈ ప్రాజెక్టును కేవలం కార్యాలయ భవనంగానే కాకుండా, పర్యావరణ హితమైన గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఐకానిక్ డిజైన్‌తో కూడిన ఈ భవన సముదాయంలో సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్, అత్యాధునిక ఐటీ మౌలిక సదుపాయాలు, కాన్ఫరెన్స్ హాల్స్ , విశాలమైన పార్కింగ్ సౌకర్యాలు ఉండనున్నాయి. సుమారు 10 నుంచి 12 అంతస్తుల ఎత్తుతో నిర్మించనున్న ఈ భవనం, అమరావతి నగరానికే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీని ద్వారా పాలనలో వేగం పెరగడంతో పాటు, ప్రజలకు అన్ని కేంద్ర సేవలు ఒకే చోట లభించే వెసులుబాటు కలుగుతుంది.

 నిధులు ,  నిర్మాణ బాధ్యతలు                                 

ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రజా పనుల శాఖ  పర్యవేక్షించనుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ సముదాయం నిర్మాణానికి సుమారు రూ. మూడు వేల కోట్ల వరకు వ్యయం కావచ్చని భావిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూములను దీని కోసం వినియోగించుకోనున్నారు. కేంద్ర కేబినెట్ నుంచి తుది ఆమోదం లభించిన వెంటనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించి, రాబోయే రెండేళ్లలోపు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.                             

కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలన్నీ పాలనా నగరంలోనే !                               
 
కేంద్ర సచివాలయ నిర్మాణం వల్ల అమరావతి ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత పుంజుకోనున్నాయి. వేలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒకే ప్రాంతానికి రావడం వల్ల స్థిరాస్తి రంగానికి ఊతం లభించడమే కాకుండా, స్థానికంగా సేవా రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అమరావతిని కేవలం ఒక పరిపాలనా కేంద్రంగానే కాకుండా, జాతీయ స్థాయిలో ఒక కీలకమైన నగరంగా తీర్చిదిద్దడంలో ఈ ప్రాజెక్టు మైలురాయిగా నిలవనుంది.                               

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Central Secretariat: అమరావతిలో మినీ ఢిల్లీ - కేంద్ర సచివాలయ నిర్మాణానికి రంగం సిద్ధం
అమరావతిలో మినీ ఢిల్లీ - కేంద్ర సచివాలయ నిర్మాణానికి రంగం సిద్ధం
Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
Amaravati Gazette: అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
Advertisement

వీడియోలు

Delhi Capitals Mitchell Starc IPL 2026 | మరికొన్ని మ్యాచ్‌లకు స్టార్క్ దూరం | ABP Desam
Vaibhav Suryavamshi MI vs RR IPL 2026 | బుమ్రా బౌలింగ్ లో వైభవ్ మెరుపులు | ABP Desam
IPL 2026 Shubman Gill Back in Nets | గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎంట్రీ | ABP Desam
IPL 2026 RR VS MI Result | రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్ విజయం | ABP Desam
Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Asia War Effect on Mango Exports: పశ్చిమాసియా యుద్దంతో మామిడి ఎగుమతిదారులకు కష్టం!కంటైనర్ల కొరతతో భారీగా పెరిగిన రవాణా ఛార్జీలు!
పశ్చిమాసియా యుద్దంతో మామిడి ఎగుమతిదారులకు కష్టం!కంటైనర్ల కొరతతో భారీగా పెరిగిన రవాణా ఛార్జీలు!
Constable Revathi: కానిస్టేబుల్ రేవతి సాహసంతోనే సాతంకుళం తీర్పు! ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గని పోలీసు కథ!
కానిస్టేబుల్ రేవతి సాహసంతోనే సాతంకుళం తీర్పు! ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గని పోలీసు కథ!
Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
Share Market: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
Amaravati Gazette: అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
Naga Vamsi : మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
Congress guarantees: కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
Toll Tax New Rule: టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
Embed widget