అన్వేషించండి

Tirumala Laddu Row: అయోధ్య ఆలయ ప్రారంభోత్సవంలో తిరుమల లడ్డూల పంపిణీ, అందులోనూ కొవ్వు నెయ్యినే వాడారా?

Tirumala Laddu row : జనవరి 22 నాటి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో 300 కేజీల తిరుమల లడ్డు ప్రసాదం పంపిణీ.. విచారణ చేపట్టాలన్న ఆలయ ప్రధాన పూజారి

Tirumala Laddu Row: అయోధ్యలోని భవ్య రామ మందిరాన్ని ఈ ఏడాది జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ క్రతువుకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది వైష్ణవ భక్తులు సహా ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. వారందరికీ తిరుమల నుంచి తెప్పించిన పరప పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని పంచారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దాదాపు 300 కిలోల లడ్డూని ఈ వేడుకకు పంపించగా.. ఆ మొత్తం ప్రసాదాన్ని భక్తులకు పంచారు. ఇప్పుడు తిరుమల లడ్డులో వాడే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్‌ ఉందని తేలడంతో.. ఆ నాటి లడ్డుల పరిస్థితి ఏందన్న ఆందోళనలు వైష్ణవ సంఘాల్లో నెలకొన్నాయి.

లడ్డూల్లో యానిఫల్‌ ఫ్యాట్స్‌ అవశేషాలు ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కోరిన అయోధ్య ఆలయ పూజారి:

            జనవరి 22 నాటి ఆలయ ప్రారంభోత్సవంలో పంచిన లడ్డూల్లో కూడా యానిమల్ ఫ్యాట్ అవశేషాలు ఉంటే ఏంటి పరిస్థితి అని అయోధ్య రామమందిర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ప్రశ్నించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ అవసరం అని ఆయన డిమాండ్ చేశారు. నాడు 300 కిలోల లడ్డూలను ప్రసాదంగా పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేసిన సత్యేంద్ర దాస్‌.. వైష్ణవులు సాదారణంగా వెల్లుల్లి, అల్లం ఉన్న వాటినే తీసుకోరని అలాంటిది యానిమల్ ఫ్యాట్ ఉన్న లడ్డులను వారికి ప్రసాదంగా ఇవ్వడమంటే అది మహా తప్పిదమే అవుతుందని, క్షమించరాని నేరమన్నారు. ఇది పూర్తి హిందూ వ్యవస్థనే అవమానించడంగా పరిగణిస్తామన్న ఆయన.. పూర్తి స్థాయి విచారణకు డిమాండ్ చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో వాడే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్‌ ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చ మొదలవగా.. మరుసటి రోజే తెలుగుదేశం పార్టీ.. గుజరాత్‌ NDDC ఇచ్చిన నివేదికను బయట పెట్టడంతో పెను దుమారమే రేగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర ఆరా తీసిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా.. నివేదిక కోరారు. అధికారుల నుంచి కూడా నివేదిక తెప్పించుకొని దానిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన వంద రోజుల్లో పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఈ నాటకానికి తెర తీశారంటూ వైకాపా విమర్శిస్తోంది.

నెయ్యిలో జంతునూనెల అవశేషాలు గుర్తించామన్న టీటీడీ ఈఓ:

 కొద్ది నెలల క్రితమే లడ్డు నాణ్యతపై భక్తులు చేస్తున్న విమర్శల మీద నలుగురు సభ్యుల కమిటీ వేసి వారు చేసిన సూచనల మేరకు తమిళనాడుకు చెందిన ఒక నెయ్యి సరఫరా సంస్థపై చర్యలు తీసుకున్నట్లు ఈఓ శ్యామలారావు తెలిపారు. ఆ సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టినట్లసు తెలిపారు. నెయ్యిలో యానిమల్ ప్యాట్స్‌ ఉన్న విషయం నిజమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో తదుపరి చర్యలకు ఉపక్రమించే ముందు ఈఓను ముఖ్యమంత్రి కార్యాలయంకి రావాల్సిందిగా అధికారులు సమాచారం ఇచ్చారు. అటు.. ఈ ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి ఆధారాలతో బయట పెట్టారని.. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి శోభ కరంద్లాజే నాటి ముఖ్యమంత్రిగా జగన్ తీరుపై తీవ్రమైన విమర్శలు కూడా గుప్పించారు. జగన్ మాత్రం.. ప్రధాని నరేంద్రమోదీ సహా కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబును ఈ ఘటనలో బాధ్యుడ్ని చేస్తూ తిట్టిపోయాలని శుక్రవారం నాటి ప్రెస్‌ మీట్‌లో కోరారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
భారత్‌లో కొత్త Skoda Kushaq Facelift లాంచింగ్.. క్రెటా, డస్టర్‌లకు గట్టి పోటీ తప్పదు
భారత్‌లో కొత్త Skoda Kushaq Facelift లాంచింగ్.. క్రెటా, డస్టర్‌లకు గట్టి పోటీ తప్పదు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Embed widget