అన్వేషించండి

Tirumala Laddu Row: అయోధ్య ఆలయ ప్రారంభోత్సవంలో తిరుమల లడ్డూల పంపిణీ, అందులోనూ కొవ్వు నెయ్యినే వాడారా?

Tirumala Laddu row : జనవరి 22 నాటి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో 300 కేజీల తిరుమల లడ్డు ప్రసాదం పంపిణీ.. విచారణ చేపట్టాలన్న ఆలయ ప్రధాన పూజారి

Tirumala Laddu Row: అయోధ్యలోని భవ్య రామ మందిరాన్ని ఈ ఏడాది జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ క్రతువుకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది వైష్ణవ భక్తులు సహా ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. వారందరికీ తిరుమల నుంచి తెప్పించిన పరప పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని పంచారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దాదాపు 300 కిలోల లడ్డూని ఈ వేడుకకు పంపించగా.. ఆ మొత్తం ప్రసాదాన్ని భక్తులకు పంచారు. ఇప్పుడు తిరుమల లడ్డులో వాడే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్‌ ఉందని తేలడంతో.. ఆ నాటి లడ్డుల పరిస్థితి ఏందన్న ఆందోళనలు వైష్ణవ సంఘాల్లో నెలకొన్నాయి.

లడ్డూల్లో యానిఫల్‌ ఫ్యాట్స్‌ అవశేషాలు ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కోరిన అయోధ్య ఆలయ పూజారి:

            జనవరి 22 నాటి ఆలయ ప్రారంభోత్సవంలో పంచిన లడ్డూల్లో కూడా యానిమల్ ఫ్యాట్ అవశేషాలు ఉంటే ఏంటి పరిస్థితి అని అయోధ్య రామమందిర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ప్రశ్నించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ అవసరం అని ఆయన డిమాండ్ చేశారు. నాడు 300 కిలోల లడ్డూలను ప్రసాదంగా పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేసిన సత్యేంద్ర దాస్‌.. వైష్ణవులు సాదారణంగా వెల్లుల్లి, అల్లం ఉన్న వాటినే తీసుకోరని అలాంటిది యానిమల్ ఫ్యాట్ ఉన్న లడ్డులను వారికి ప్రసాదంగా ఇవ్వడమంటే అది మహా తప్పిదమే అవుతుందని, క్షమించరాని నేరమన్నారు. ఇది పూర్తి హిందూ వ్యవస్థనే అవమానించడంగా పరిగణిస్తామన్న ఆయన.. పూర్తి స్థాయి విచారణకు డిమాండ్ చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో వాడే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్‌ ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చ మొదలవగా.. మరుసటి రోజే తెలుగుదేశం పార్టీ.. గుజరాత్‌ NDDC ఇచ్చిన నివేదికను బయట పెట్టడంతో పెను దుమారమే రేగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర ఆరా తీసిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా.. నివేదిక కోరారు. అధికారుల నుంచి కూడా నివేదిక తెప్పించుకొని దానిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన వంద రోజుల్లో పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఈ నాటకానికి తెర తీశారంటూ వైకాపా విమర్శిస్తోంది.

నెయ్యిలో జంతునూనెల అవశేషాలు గుర్తించామన్న టీటీడీ ఈఓ:

 కొద్ది నెలల క్రితమే లడ్డు నాణ్యతపై భక్తులు చేస్తున్న విమర్శల మీద నలుగురు సభ్యుల కమిటీ వేసి వారు చేసిన సూచనల మేరకు తమిళనాడుకు చెందిన ఒక నెయ్యి సరఫరా సంస్థపై చర్యలు తీసుకున్నట్లు ఈఓ శ్యామలారావు తెలిపారు. ఆ సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టినట్లసు తెలిపారు. నెయ్యిలో యానిమల్ ప్యాట్స్‌ ఉన్న విషయం నిజమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో తదుపరి చర్యలకు ఉపక్రమించే ముందు ఈఓను ముఖ్యమంత్రి కార్యాలయంకి రావాల్సిందిగా అధికారులు సమాచారం ఇచ్చారు. అటు.. ఈ ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి ఆధారాలతో బయట పెట్టారని.. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి శోభ కరంద్లాజే నాటి ముఖ్యమంత్రిగా జగన్ తీరుపై తీవ్రమైన విమర్శలు కూడా గుప్పించారు. జగన్ మాత్రం.. ప్రధాని నరేంద్రమోదీ సహా కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబును ఈ ఘటనలో బాధ్యుడ్ని చేస్తూ తిట్టిపోయాలని శుక్రవారం నాటి ప్రెస్‌ మీట్‌లో కోరారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
IPL 2025 SRH VS DC Result Update: స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
Andhra Pradesh: గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP DesamHardik Pandya captaincy IPL 2025 | టీమ్ సెలక్షన్ లోనూ పాండ్యా తప్పిదాలు | ABP DesamGT vs MI 197 Target Match Highlights IPL 2025 | మొన్న చెన్నై, నిన్న ముంబై సరిగ్గా అలాగే ఓడిపోయాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
IPL 2025 SRH VS DC Result Update: స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
Andhra Pradesh: గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Puri Jagannadh Vijay Sethupathi: పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
SRH VS DC IPL 2025:  స‌న్ రైజ‌ర్స్ న‌యా సంచ‌ల‌నం అనికేత్ వర్మ.. విధ్వంస‌క ఇన్నింగ్స్‌లతో ప‌వ‌ర్ హిట్టింగ్ కు కేరాఫ్ అడ్రస్
 స‌న్ రైజ‌ర్స్ న‌యా సంచ‌ల‌నం అనికేత్ వర్మ.. విధ్వంస‌క ఇన్నింగ్స్‌లతో ప‌వ‌ర్ హిట్టింగ్ కు కేరాఫ్ అడ్రస్
CM Revanth Reddy: పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
Money Facts: దేశంలో సగం మంది వద్ద 3.5 లక్షలు కూడా లేవు, ప్రపంచంలో 90 శాతం మందికి జీతం టెన్షన్..!
దేశంలో సగం మంది వద్ద 3.5 లక్షలు కూడా లేవు, ప్రపంచంలో 90 శాతం మందికి జీతం టెన్షన్..!
Embed widget