అన్వేషించండి

Telangana Rythu Bharosa Status: తెలంగాణలో రైతు భరోసా నిధులు ఎప్పుడు వస్తాయి? ఆ తప్పులు చేస్తే పైసలు రానట్టే!

Telangana Rythu Bharosa Status: తెలంగాణలో రైతు భరోసా నిధుల పంపిణీ ప్రస్తుత స్థితి. మూడో విడత పెండింగ్‌ వివరాలు, కొత్త వానాకాలం సీజన్ నిబంధనలపై సమగ్ర సమాచారం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రైతు భరోసా పథకం కింద ఎకరాకు ₹12,000 పంపిణీ ప్రారంభమైంది.
  • రెండు ఎకరాలలోపు రైతులకు నిధులు విడుదల; పెద్ద రైతులకు పెండింగ్.
  • ఖరీఫ్ కోసం భూభారతి, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా అర్హత నిర్ధారణ.
  • రైతులు eKYC, ఆధార్ అనుసంధానం చేయాలి, లేకుంటే నిధులు లేవు.

Telangana Rythu Bharosa Status: తెలంగాణ వ్యవసాయ రంగంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. రైతు భరోసా నిధులు ఎప్పుడు వస్తాయి పాత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు స్థానంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన ఈ కొత్త పథకం ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది. ఎకరం లోపు ఉన్న వారికి పడ్డాయి. మరి రెండు ఎకరాల దాటిన వారి పరిస్థితి ఏంటి? 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక, గతంలో ఉన్న రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది. కేవలం పేరు మార్చడమే కాదు, పెట్టుబడి సాయాన్ని కూడా పెంచింది. ఏటా ఎకరానికి 12వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ పథకం నిధుల పంపిణీ స్టాగర్డ్‌ మేనర్‌ అంటే విడుదల వారీ పద్ధతిలో సాగుతోంది. 

మొన్నటి వరకు యాసంగి(రబీ) సీజన్‌కు సంబంధించిన నిధుల పంపిణీ కొనసాగుతోంది. ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు తొలి ప్రాధాన్యత ఇస్తోంది. మార్చి 22న మొదటి విడత నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నెర్మెట్ట వేదికగా విడుదల చేశారు. ఎకరం, అంతకంటే తక్కువ భూమి ఉన్న సుమారు 68 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల మధ్య సాగు భూమి ఉన్న మిడ్‌సైడ్‌ రైతుల కోసం ప్రభుత్వం దాదాపు 2,063 కోట్లు విడుదల చేసింది. అందరి కళ్లు ఇప్పుడు మూడో విడతపైనే ఉన్నాయి. రెండు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న పెద్ద రైతులకు సంబంధించిన సుమారు 3500 కోట్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. జూన్ నెల ప్రారంభమైనప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిధుల సమీకరణ, అర్హుల వడపోతపై అధికారులు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. 

ఖరీఫ్‌ కోసం కొత్త నిబంధనలు 

జూన్ నెల రావడంతో వానాకాలం సాగు పనులు మొదలవుతున్నాయి. అయితే ఈసారి ప్రభుత్వం నిధుల పంపిణీలో మరింత పారదర్శకత కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో సాగు చేయని భూములకు, రియల్ ఎస్టేట్‌ వెంచర్లకు కూడా పెట్టుబడి సాయం అందిందనే విమర్శలు ఉన్నాయి. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం భూ భారతి వెరిఫికేషన్, శాటిలైట్ మ్యాపింగ్‌ ప్రక్రియను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అంటే శాటిలైట్‌ ద్వారా మీ భూమిలో పంట సాగవుతోందా లేదా ని పరిశీలించి కేవలం సాగులో ఉన్న భూములకే నిధులు ఇస్తారు. 

రైతులు చేయాల్సిన పనులు 

మీరు రైతు భరోసా సాయం పొందాలంటే రెండు పనులు కచ్చితంగా చేయాలి. మీ బ్యాంకు ఖాతాకు ఈకేవైసీ చేయాలి. బ్యాంక్ ఖాతాకు ఆధార్‌ కార్డు కచ్చితంగా లింక్ చేయాలి. 

స్టేటస్ ఎలా చెక్‌ చేయాలి. 

మీకు రావాల్సిన డబ్బులు ఏ స్టేజీలో ఉన్నాయో తెలుసుకోవడం చాలా సులభమైన పని. ముందుగా తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారిక పోర్టల్‌ను విజిట్ చేయాలి. అక్కడ మీ కొత్త పట్టాదార్ పాస్ బుక్ నంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ అప్లికేషన్ ల్యాండ్ వెరిఫికేషన్ ఏ స్టేజీలో ఉందో కనిపిస్తుంది. గత మార్చి లేదా ఏప్రిల్‌లో మీకు నగదు జమ అయిందో లేదో కూడా హిస్టరీ తెలుసుకోవచ్చు. 

తెలంగాణ ప్రభుత్వం యాసంగి పెండింగ్ నిధులను క్లియర్ చేసిన వెంటనే వానాకాలం కొత్త విడత నిధులపై స్పష్టమైన షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉంది. రైతు సోదరులు తమ డాక్యుమెంట్‌లను సిద్ధం చేసుకోవడం ద్వారా నిధుల పంపిణీ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించవచ్చు. సాగు సాయం పక్కగా అర్హులైన వారికే చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యంలా కనిపిస్తోంది.   

Frequently Asked Questions

రెండు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు ఎప్పుడు వస్తాయి?

రెండు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న పెద్ద రైతులకు దాదాపు 3500 కోట్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. నిధుల సమీకరణ, అర్హుల వడపోత తర్వాత దీనిపై జూన్ నెలలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఖరీఫ్ సీజన్‌లో రైతు భరోసా నిధుల పంపిణీకి కొత్త నిబంధనలు ఏమైనా ఉన్నాయా?

ఖరీఫ్‌లో పారదర్శకత కోసం ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంది. సాగులో ఉన్న భూములకే నిధులు అందించడానికి భూ భారతి వెరిఫికేషన్, శాటిలైట్ మ్యాపింగ్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

రైతు భరోసా సాయం పొందాలంటే రైతులు ఏమి చేయాలి?

రైతు భరోసా సాయం పొందాలంటే, మీరు మీ బ్యాంకు ఖాతాకు ఈకేవైసీ చేయాలి. అలాగే, మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్‌ కార్డును కచ్చితంగా లింక్ చేయాలి.

రైతు భరోసా నిధుల స్టేటస్‌ను ఎలా చెక్ చేసుకోవచ్చు?

తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారిక పోర్టల్‌ను సందర్శించి, మీ కొత్త పట్టాదార్ పాస్ బుక్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీ దరఖాస్తు లేదా నగదు జమ స్టేటస్ తెలుసుకోవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
AIADMK MLA MR Vijayabhaskar Resigns: టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
టీవీకే విజయ్ ప్లాన్‌కు అల్లాడిపోతున్న అన్నాడీఎంకే - మరో ఎమ్మెల్యే రాజీనామా - లైన్‌లో ఇంకా ఉన్నారా?
Kodangal Duplicate Votes: కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
కొడంగల్‌లో 11 వేల కర్ణాటక వాసుల ఓట్లు - కవిత సంచలన ఆరోపణలు
ENE Sequel Release Date : ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓవైపు కుర్రాళ్లు రెడీ... మరోవైపు నవ్వుల తుపాన్ - ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
Embed widget