Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam
టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న జోష్ లో భారత ఆటగాళ్లు ఐపీఎల్ సమరానికి సిద్ధమవుతున్నారు. ప్రత్యేకించి భారత్ టీ20 వరల్డ్ కప్ లో సాధించటంలో కీలక పాత్ర పోషించిన స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా...ఇప్పుడు ముంబై ఇండియన్స్ ని షాక్ గురి చేశాడా. గడచిన రెండు రోజులుగా జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచుల్లో బుమ్రా కనిపించకపోవటం ఇప్పుడు కొత్త అనుమానాలకు దారి తీస్తోంది. అయితే ఇదే టైమ్ లో జస్ ప్రీత్ బుమ్రా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చెకప్స్ కి హాజరైనట్లు మరో వార్త వెలుగులోకి వచ్చింది. అంతే ఇక బుమ్రా గాయపడ్డాడనే వార్తలు బయటకు వచ్చాయి. వాస్తవానికి బుమ్రా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి ఎందుకు వెళ్లాడనే విషయంపై బీసీసీఐ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు కానీ...ముంబై ఇండియన్స్ కోచ్ మహేలా జయవర్ధనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులోని సభ్యులు లేట్ గా టీమ్ తో జాయిన్ అయ్యే విధంగా ముందుగానే పర్మిషన్ ఇచ్చామని చెబుతున్నాడు జయవర్ధనే. అందువల్లే బుమ్రా ప్రాక్టీస్ మ్యాచ్ లకు రావటం లేదని చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. కానీ బుమ్రా NCE కి వెళ్లటంపై మాత్రం స్పందించలేదు. గతేడాది ఐపీఎల్ టైమ్ లో వెన్ను నొప్పి కారణంగా బాధపడిన బుమ్రా తర్వాత భారత్ ఆడిన చాలా సిరీస్ లకు దూరమయ్యాడు. మళ్లీ ఇప్పుడు ఐపీఎల్ టైమ్ లోనే బుమ్రా గాయపడ్డాడన్న వార్తలు ఫ్యాన్స్ తో పాటు ముంబై జట్టును కలవపరిచేవే.























