అన్వేషించండి

Sharmila On Viveka Murder Case: వివేకా హత్య కేసు తేల్చకపోతే సీబీఐ మీద నమ్మకం పోతుంది: షర్మిల

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును త్వరగా తేలకపోతే CBI మీద ప్రజలకు ఉన్న నమ్మకం పోతుందన్నారు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును త్వరగా తేల్చాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ప్రజల అభిమానాన్ని పొందిన అంత పెద్ద నాయకుడి కేసు విచారణకు ఇంకా ఎన్నాళ్లు పడుతుందని ఆమె ప్రశ్నించారు. కేసు విచారణ త్వరగా తేలకపోతే CBI మీద ప్రజలకు ఉన్న నమ్మకం పోతుందన్నారు. వివేకా హత్యకేసు విచారణలో ప్రభుత్వాల జోక్యం ఉండకూడదు అన్నారు. కాగా, వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ సోమవారం నోటీసులిచ్చింది. హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీసులో మంగళవారం విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొన్నారు. అయితే తనకు ఐదు రోజుల సమయం ఇవ్వాలని, బిజీ షెడ్యూళ్ల వల్ల విచారణకు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి స్పందించారు. ఐదు రోజుల తరువాత సీబీఐ చెప్పినప్పుడు విచారణకు హాజరవుతానని చెప్పారు.

తన పాదయాత్రలో ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఎత్తిచూపిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా , ఒడిదుడుకులు ఎదురైనా పోరాడుతున్నందుకు మాపై కక్ష కట్టి దాడులు చేశారు, కేసులు పెట్టారని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. తమపై ఉద్దేశపూర్వకంగా స్పీకర్ దగ్గర కంప్లైంట్ చేసినా మేం ప్రజల పక్షాన నిలబడ్డాం అన్నారు. ఇప్పటికే 3500 కిలో మీటర్లు పాదయాత్ర పూర్తి చేశాం, ఎక్కడైతే ఆగిందో అక్కడినుంచే మళ్లీ పాదయాత్ర మొదలుపెడతామన్నారు. మా మాటల వల్ల ఎవరూ కూడా ఆ ఎమ్మెల్యేల మీద దాడులు చేయలేదని, పాదయాత్ర 3500 కిలో మీటర్లు పూర్తి అయ్యాక మమ్మల్ని ఆపడానికి సీఎం కేసీఆర్ గూండాలతో మా వాహనాలను ధ్వంసం చేయిండంతో పాటు తమపై దాడులు చేయించారని వైఎస్ షర్మిల ఆరోపించారు.

వైఎస్సార్ పాదయాత్ర ఫలితమే సంక్షేమ పాలన.. 
రాజశేఖర్ రెడ్డి ప్రజా ప్రస్థాన పాదయాత్ర ఫలితమే ఆయన సంక్షేమ పాలన, ఆయన అద్బుత పథకాలు.. ఆరోగ్య శ్రీ, జలయజ్ఞం, ఫీజ్ రీయింబర్స్ మెంట్, రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, పోడు భూములకు పట్టాలు, మైనార్టీలకు రిజర్వేషన్లు వంటి వాటి వెనక ఉన్నది వైఎస్ఆర్ పాదయాత్ర అన్నారు. ఆయన పాదయాత్రకు కొనసాగింపుగా మేం 3500 కిలోమీటర్ల ప్రజా ప్రస్థానం పాదయాత్ర పూర్తి చేశామన్నారు.  ప్రతి చోటా కేసీఆర్ వైఫల్యాలు ఎత్తి చూపించాం, తెలంగాణలో రుణమాఫీ చేయకుండా ప్రతి రైతును కేసీఆర్ అప్పుల పాలు చేశారని ఆరోపించారు. వైఎస్సార్ రైతులకు ఎంతో చేసి అండగా నిలిచారు. పెట్టుబడి తగ్గించి రాబడి పెంచారు. కానీ కేసీఆర్ రైతులకు రైతుబంధు ఇస్తూ సబ్సిడీ పథకాలు అన్నీ నిలిపేశారు. మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని విస్మరించారు.  కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇస్తామని మాటతప్పారు.  ఫీ రీయింబర్స్ మెంట్ కూడా గాలికొదిలేశారు. ఆరోగ్య శ్రీ పథకానికి తూట్లు పొడిచి , ప్రజలకు ఆరోగ్య భద్రత లేకుండా చేశారని మండిపడ్డారు.

కేసీఆర్ ఏ హామీలు నెవరేర్చలేదు.. 
పోడు భూములకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదు. దీనిపై మేం ప్రతి మంగళవారం దీక్షలు చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. కాళేశ్వరం ప్రాజెక్టులోనే కేసీఆర్ 70 వేల కోట్ల అవినీతి చేశారని ఎత్తి చూపి, పదే పదే మాట్లాడింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాత్రమే అన్నారు. పాదయాత్రకు విరామం ప్రకటించి మరీ ఢిల్లీ వెళ్లి కాగ్, సీబీఐ కి ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారు.  4 లక్షల కోట్ల అప్పులు చేసి కూడా ఏ పథకానికి డబ్బు లేదు.  ఆరోగ్య శ్రీ, ఫీ రీయింబర్స్ మెంట్, రుణమాఫీ సర్పంచులకు, జీతాలకు, పెన్షన్లకు దేనికీ కూడా డబ్బు లేదు. మరి అప్పు చేసి ఏం చేశారని ప్రశ్నిస్తున్నందుకే తమపై దాడులు చేయిస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు.

ఒక మహిళ కారులో ఉండగానే లాక్కెళ్లి, అరెస్టు చేసి, గంటల తరబడి స్టేషన్ లో పెట్టి అక్రమ కేసులు పెట్టారు. పోలీసులు ఇంత తొత్తుల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అని ప్రశ్నించారు. కోర్టు పాదయాత్రకు అనుమతి ఇచ్చినా, పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా కాలయాపన చేశారన్నారు. నిరాహా దీక్ష చేసి మళ్లీ కోర్టులకు పోతే పాదయాత్ర చేసుకోనివ్వండి అని కోర్టు చెప్పిందని, మళ్లీ ఈ నెల 28 వ తేదీ నుంచి పాదయాత్ర పున: ప్రారంభిస్తున్నాం అన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
హైదరాబాద్‌ స్టేడియాలను అంతర్దాతీయ స్థాయిలోకి మారుస్తా..: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ స్టేడియాలను అంతర్దాతీయ స్థాయిలోకి మారుస్తా..: సీఎం రేవంత్ రెడ్డి
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
IPL 2026 RCB Vs SRH Result Update: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ- రాణించిన ప‌డిక్క‌ల్, కోహ్లీ, డ‌ఫీ- స‌న్ రైజ‌ర్స్ కు నిరాశ‌
Embed widget