అన్వేషించండి

Warangal: ఆత్మగౌరవాన్ని చంపుకోవద్దు, అయ్యా అయ్యా అనొద్దు - మరోసారి కడియం శ్రీహరి హాట్ కామెంట్స్

జనగామ జిల్లా లింగాలఘనపురం మండల కేంద్రంలో జరిగిన కురుమ సంఘం పాలకవర్గం పదవీ ప్రమాణ స్వీకారోత్సవ సభకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఇంకోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఆత్మగౌరవాన్ని చంపుకోవద్దని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎవరికీ పాదాభివందనం చేయలేదని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో తాను ఎవరికీ తల వంచలేదని, ఇకపై కూడా వంచబోనని వ్యాఖ్యానించారు. ఆర్జించుకోవడం కాదని నిటారుగా ఆత్మగౌరవంతో నిలబడాలని అన్నారు. తప్పుచేసినోడే తలవంచుతాడని వ్యాఖ్యలు చేశారు. అయితే, వరంగల్ జిల్లా రాజకీయాల్లో కడియం శ్రీహరి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. పరోక్షంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్యెల్యే రాజయ్యపై వ్యాఖ్యలు చేశారని గతంలో జరిగిన రాజకీయ పరిణామాలను బట్టి అర్థం అవుతోంది.

శుక్రవారం (జనవరి 13) జనగామ జిల్లా లింగాలఘనపురం మండల కేంద్రంలో జరిగిన కురుమ సంఘం పాలకవర్గం పదవీ ప్రమాణ స్వీకారోత్సవ సభకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజా వ్యాఖ్యలు చేశారు. ప్రతీ మనిషి ఎలాంటి పరిస్థితుల్లో కూడా తప్పు చేయొద్దని హితవు పలికారు. ఆ తర్వాత అయ్యా.. అయ్యా అంటూ తలవంచి పాదాభివందనం చేయాల్సిన అవసరం రాకూడదని అన్నారు. తన రాజకీయ జీవితంలో తాను ఎప్పుడైనా తప్పు చేసి తల వంచడం చూశారా అని సభ ముందున్న వారిని అడిగారు. ప్రతి ఒక్కరు తన మాదిరిగా నిటారుగా బతకడం నేర్చుకోవాలని శ్రీహరి సూచించారు. అందరూ ఆత్మగౌరవంతోనే బతకాలని సూచించారు. విద్యతో సామాజిక చైతన్యం వస్తుందని తద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు.

ఎమ్మెల్యేకు, కడియంకు ఎప్పటినుంచో వైరాలు
స్టేషన్ ఘన్‌పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యతో అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఎప్పటినుంచో బేధాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కడియం చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఈటల కూడా ఆత్మగౌరవం పేరుతోనే కేసీఆర్ తో విభేదించిన విషయాన్ని అందరూ గుర్తుచేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా కడియం శ్రీహరి, రాజయ్య మధ్య, వారి వర్గాల మధ్య గొడవలు మరింత పెరిగాయి.

ఇద్దరూ మాజీ ఉప ముఖ్యమంత్రులు తమ హోదాను మరిచి ఒకరిపై మరొకరు మాటల యుద్ధానికి దిగారు. పార్టీ కేడర్ కూడా రెండు వర్గాలుగా చీలిపోయింది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ లో రెండు గ్రూపులుగా  టీఆర్ఎస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాజయ్య, శ్రీహరి ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది.

అప్పట్లో దళిత బంధు పథకంపైనా వ్యాఖ్యలు

దళిత బంధు పథకం అమలు విషయంపైన కూడా కడియం శ్రీహరి గతంలో పార్టీకి కాస్త అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దళితబంధు పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే టీఆర్‌ఎస్‌కే నష్టమని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఒకే ఏడాదిలో 15 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించలేకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దళితబంధు అమలు చేయకపోతే ఎన్నికల్లో ఓటమి తప్పదని కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కడియం శ్రీహరి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget