అన్వేషించండి

Warangal: ఆత్మగౌరవాన్ని చంపుకోవద్దు, అయ్యా అయ్యా అనొద్దు - మరోసారి కడియం శ్రీహరి హాట్ కామెంట్స్

జనగామ జిల్లా లింగాలఘనపురం మండల కేంద్రంలో జరిగిన కురుమ సంఘం పాలకవర్గం పదవీ ప్రమాణ స్వీకారోత్సవ సభకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఇంకోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఆత్మగౌరవాన్ని చంపుకోవద్దని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎవరికీ పాదాభివందనం చేయలేదని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో తాను ఎవరికీ తల వంచలేదని, ఇకపై కూడా వంచబోనని వ్యాఖ్యానించారు. ఆర్జించుకోవడం కాదని నిటారుగా ఆత్మగౌరవంతో నిలబడాలని అన్నారు. తప్పుచేసినోడే తలవంచుతాడని వ్యాఖ్యలు చేశారు. అయితే, వరంగల్ జిల్లా రాజకీయాల్లో కడియం శ్రీహరి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. పరోక్షంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్యెల్యే రాజయ్యపై వ్యాఖ్యలు చేశారని గతంలో జరిగిన రాజకీయ పరిణామాలను బట్టి అర్థం అవుతోంది.

శుక్రవారం (జనవరి 13) జనగామ జిల్లా లింగాలఘనపురం మండల కేంద్రంలో జరిగిన కురుమ సంఘం పాలకవర్గం పదవీ ప్రమాణ స్వీకారోత్సవ సభకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజా వ్యాఖ్యలు చేశారు. ప్రతీ మనిషి ఎలాంటి పరిస్థితుల్లో కూడా తప్పు చేయొద్దని హితవు పలికారు. ఆ తర్వాత అయ్యా.. అయ్యా అంటూ తలవంచి పాదాభివందనం చేయాల్సిన అవసరం రాకూడదని అన్నారు. తన రాజకీయ జీవితంలో తాను ఎప్పుడైనా తప్పు చేసి తల వంచడం చూశారా అని సభ ముందున్న వారిని అడిగారు. ప్రతి ఒక్కరు తన మాదిరిగా నిటారుగా బతకడం నేర్చుకోవాలని శ్రీహరి సూచించారు. అందరూ ఆత్మగౌరవంతోనే బతకాలని సూచించారు. విద్యతో సామాజిక చైతన్యం వస్తుందని తద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు.

ఎమ్మెల్యేకు, కడియంకు ఎప్పటినుంచో వైరాలు
స్టేషన్ ఘన్‌పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యతో అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి ఎప్పటినుంచో బేధాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కడియం చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఈటల కూడా ఆత్మగౌరవం పేరుతోనే కేసీఆర్ తో విభేదించిన విషయాన్ని అందరూ గుర్తుచేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా కడియం శ్రీహరి, రాజయ్య మధ్య, వారి వర్గాల మధ్య గొడవలు మరింత పెరిగాయి.

ఇద్దరూ మాజీ ఉప ముఖ్యమంత్రులు తమ హోదాను మరిచి ఒకరిపై మరొకరు మాటల యుద్ధానికి దిగారు. పార్టీ కేడర్ కూడా రెండు వర్గాలుగా చీలిపోయింది. స్టేషన్‌ ఘన్‌పూర్‌ లో రెండు గ్రూపులుగా  టీఆర్ఎస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాజయ్య, శ్రీహరి ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది.

అప్పట్లో దళిత బంధు పథకంపైనా వ్యాఖ్యలు

దళిత బంధు పథకం అమలు విషయంపైన కూడా కడియం శ్రీహరి గతంలో పార్టీకి కాస్త అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దళితబంధు పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే టీఆర్‌ఎస్‌కే నష్టమని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఒకే ఏడాదిలో 15 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించలేకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దళితబంధు అమలు చేయకపోతే ఎన్నికల్లో ఓటమి తప్పదని కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కడియం శ్రీహరి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Waqf Amendment Bill: నేడు పార్లమెంట్‌ ముందుకు వక్ఫ్ సవరణ బిల్,  ప్రభుత్వం పాస్ చేయగలదా ? సంఖ్యాబలం ఎలా ఉంది?
నేడు పార్లమెంట్‌ ముందుకు వక్ఫ్ సవరణ బిల్, ప్రభుత్వం పాస్ చేయగలదా ? సంఖ్యాబలం ఎలా ఉంది?
Waqf Amendment Bill:వక్ఫ్ సవరణ బిల్‌కు చంద్రబాబు, పవన్ ఎందుకు మద్దతు ఇచ్చారు? వైసీపీ స్టాండ్‌ ఏంటీ?
వక్ఫ్ సవరణ బిల్‌కు చంద్రబాబు, పవన్ ఎందుకు మద్దతు ఇచ్చారు? వైసీపీ స్టాండ్‌ ఏంటీ?
HCU Land Dispute: 400 ఎకరాలు హెచ్సీయూవి కావు- ఎలాంటి వెంచర్లు వేయడం లేదు: మంత్రుల బృందం
400 ఎకరాలు హెచ్సీయూవి కావు- ఎలాంటి వెంచర్లు వేయడం లేదు: మంత్రుల బృందం
Waqf Amendment Bill :కేంద్రం తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లులో ఏముంది? విపక్షాల ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టేనా?
కేంద్రం తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లులో ఏముంది?విపక్షాల ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs PBKS Match Highlights IPL 2025 | లక్నో పై 8 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం | ABP DesamAnant Ambani Dwarka Padyatra | హెలికాఫ్టర్లు వద్దంటూ కాలినడకన కృష్ణుడి గుడికి అంబానీ వారసుడు | ABP DesamAnant Ambani Rescue Hens From Cages | అత్తారింటి దారేదిలో పవన్ లా..మొత్తం కొనేసిన అనంత్ అంబానీ | ABP DesamAmeer Rinku Singh Trending | IPL 2025 లోనూ తన పూర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్న రింకూ సింగ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Waqf Amendment Bill: నేడు పార్లమెంట్‌ ముందుకు వక్ఫ్ సవరణ బిల్,  ప్రభుత్వం పాస్ చేయగలదా ? సంఖ్యాబలం ఎలా ఉంది?
నేడు పార్లమెంట్‌ ముందుకు వక్ఫ్ సవరణ బిల్, ప్రభుత్వం పాస్ చేయగలదా ? సంఖ్యాబలం ఎలా ఉంది?
Waqf Amendment Bill:వక్ఫ్ సవరణ బిల్‌కు చంద్రబాబు, పవన్ ఎందుకు మద్దతు ఇచ్చారు? వైసీపీ స్టాండ్‌ ఏంటీ?
వక్ఫ్ సవరణ బిల్‌కు చంద్రబాబు, పవన్ ఎందుకు మద్దతు ఇచ్చారు? వైసీపీ స్టాండ్‌ ఏంటీ?
HCU Land Dispute: 400 ఎకరాలు హెచ్సీయూవి కావు- ఎలాంటి వెంచర్లు వేయడం లేదు: మంత్రుల బృందం
400 ఎకరాలు హెచ్సీయూవి కావు- ఎలాంటి వెంచర్లు వేయడం లేదు: మంత్రుల బృందం
Waqf Amendment Bill :కేంద్రం తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లులో ఏముంది? విపక్షాల ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టేనా?
కేంద్రం తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లులో ఏముంది?విపక్షాల ప్రశ్నలకు సమాధానాలు దొరికినట్టేనా?
Pastor Praveen Kumar Death Case :పాస్టర్ ప్రవీణ్ మృతి కేసుపై హోం మంత్రిని కలిసిన పాస్టర్లు - మాజీ ఎంపీకి పోలీసుల నోటీసులు
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసుపై హోం మంత్రిని కలిసిన పాస్టర్లు - మాజీ ఎంపీకి పోలీసుల నోటీసులు
IPL 2025 PBKS VS LSG Result Update:  ప్ర‌భుసిమ్రాన్ ప్ర‌తాపం.. పంజాబ్ ఈజీ విక్ట‌రీ.. శ్రేయ‌స్ మెరుపులు.. 8 వికెట్ల‌తో ల‌క్నో చిత్తు
ప్ర‌భుసిమ్రాన్ ప్ర‌తాపం.. పంజాబ్ ఈజీ విక్ట‌రీ.. శ్రేయ‌స్ మెరుపులు.. 8 వికెట్ల‌తో ల‌క్నో చిత్తు
IIT And IIM: దేశంలోని ఐఐటీ, ఐఐఎంలలో ఉపాధ్యాయుల కొరత- పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో సంచలన విషయాలు
దేశంలోని ఐఐటీ, ఐఐఎంలలో ఉపాధ్యాయుల కొరత- పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో సంచలన విషయాలు
Anakapalli News: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏడేళ్ల బాలిక వేపాడ దివ్య హత్యకేసులో నిందితునికి మరణశిక్ష
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏడేళ్ల బాలిక వేపాడ దివ్య హత్యకేసులో నిందితునికి మరణశిక్ష
Embed widget