అన్వేషించండి

Warangal News: వరంగల్ లో మరోసారి ఒమిక్రాన్ కలకలం... స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన యువకుడికి ఒమిక్రాన్ పాజిటివ్

వరంగల్ జిల్లాలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఇటీవల స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన యువకుడికి ఒమిక్రాన్ నిర్థారణ అయింది. అతడిని హైదరాబాద్ టిమ్స్ రిఫర్ చేశారు వైద్యులు.

వరంగల్ జిల్లాలో మరోసారి ఒమిక్రాన్ కలకలం రేగింది. నగరంలోని బ్యాంక్ కాలనీలో స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన 24 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ వైరస్ సోకినట్లు తేలింది. ఈ మేరకు వరంగల్ డీఎంహెచ్వో వెంకటరమణ వివరాలు వెల్లడించారు. ఈనెల 12న స్విట్జర్లాండ్ నుంచి యువకుడి వరంగల్ కు వచ్చాడు. అతడికి సాధారణంగా కరోనా పరీక్షలు చేయగా కోవిడ్ నిర్థారణ అయింది. అనంతరం  నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. అతడికి ఒమిక్రన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వెంటనే యువకుడిని హైదరాబాద్ లోని టిమ్స్ కు రిఫర్ చేశారు వైద్యులు. అతడి దగ్గర బంధుమిత్రులకు 20 మందికి శాంపుల్స్ సేకరించి పరీక్షల కోసం పంపినట్లు చెప్పారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె. వెంకటరమణ తెలిపారు. 

సిరిసిల్లలో ముగ్గురికి ఒమిక్రాన్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి ఒమిక్రాన్‌ సోకినట్టు వచ్చినట్లు తేలింది. ఇటీవల దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ వచ్చింది. తాజాగా బాధితుడి భార్య, తల్లి, స్నేహితుడికి వైరస్‌ వ్యాప్తించింది. ఒమిక్రాన్‌ బాధితులను చికిత్స కోసం హైదరాబాద్‌ టిమ్స్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. వీరి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ కు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.  

Also Read: నైట్ కర్ఫ్యూతో ఒమిక్రాన్‌ వ్యాప్తి తగ్గుతుందా ? హౌ? ఎలా?

తెలంగాణలో విస్తరిస్తోన్న ఒమిక్రాన్

తెలంగాణలో ఆదివారం 3 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 44కు చేరాయి. గడచిన 24 గంటల్లో 20,576 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 109 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,80,662కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌ లో ఈ వివరాలు ప్రకటించింది. గత 24 గంటలలో కరోనాతో ఒక్కరు మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 4,022కి కరోనాతో మరణించారు. కరోనా బారి నుంచి తాజాగా 190 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 3,167 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Also Read: షిర్డీ వెళ్తున్నారా? ఆగండి.. ఆగండి.. దర్శన వేళల్లో మార్పులు చేశారు తెలుసా? 

44కి చేరిన ఒమిక్రాన్ కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 248 మంది శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ కోవిడ్‌ ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేశారు. వారిలో ఇద్దరు ప్రయాణికులకు కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారి నమూనాలను అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఒక్కరోజు వ్యవధిలో తెలంగాణలో 3 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం మొత్తం ఒమిక్రాన్ కేసులు సంఖ్య 44కి చేరింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 10 మంది కోలుకున్నారని వైద్యులు తెలిపారు. ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు 11,493 మంది ప్రయాణికులు వచ్చారు. 

Also Read: కొత్త సంవత్సరం కానుక! జనవరి 1న రైతుల ఖాతాల్లో డబ్బులు వేయనున్న మోదీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Embed widget