అన్వేషించండి

Power Charges: ప్రజలకు కేంద్రం ఝలక్! ఈ టైంలో కరెంటు వాడితే ఛార్జీల బాదుడు మామూలుగా ఉండదు!

‘టైం ఆఫ్‌ డే’ (టీఓడీ) పేరు పెడుతూ కొత్త విధానాన్ని తీసుకురానున్నారు. గరిష్ఠంగా కరెంటు డిమాండ్‌ ఉన్న సమయంలో కరెంట్‌ వాడితే 20 వరకూ అధిక ఛార్జీ వసూలు చేయనున్నారు.

విద్యుత్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఝలక్ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేస్తోంది. కరెంటు వాడకంలో భాగంగా అత్యంత డిమాండ్ ఉండే సమయంలో (పీక్ అవర్స్) వాడే కరెంటుకు ఏకంగా 20 శాతం వరకూ అధిక ఛార్జీ వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ‘టైం ఆఫ్‌ డే’ (టీఓడీ) పేరు పెడుతూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. గరిష్ఠంగా కరెంటు డిమాండ్‌ ఉన్న సమయం (టీఓడీ)లో కరెంట్‌ వాడే పరిశ్రమలు లేదా ఫ్యాక్టరీలు, కమర్షియల్ వినియోగదారులకు 2024 ఏప్రిల్‌ 1లోగా 20 శాతం, ఇళ్లలో వినియోగదారులకు 2025 ఏప్రిల్‌ 1లోగా 10 శాతం ఛార్జీలను పెంచి వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ (రైట్‌ ఆఫ్‌ కన్స్యూమర్‌) సవరణ రూల్స్‌-2023 డ్రాఫ్ట్ ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై ఏప్రిల్‌ 14వ తేదీలోపు అభ్యంతరాలు ఏమన్నా ఉంటే తెలపాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. రాష్ట్రాల అభిప్రాయాలు తెలిపిన అనంతరం ఈ నిబంధన అమల్లోకి తీసుకొస్తారు. 

మరోవైపు, రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకూ ఎండ బాగా ఉన్న సమయంలో సౌర విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది కాబట్టి, ఆ సమయంలో వాడే విద్యుత్‌ ఛార్జీలను 20 శాతం తగ్గించాలని సూచించింది. ఈ విధానం అమలులోకి తీసుకొచ్చేందుకు 2025 ఏప్రిల్‌ 1వ తేదీలోపు వ్యవసాయ వినియోగదారులు కాకుండా, మిగతా వినియోగదారులకు స్మార్ట్‌/ప్రీ పెయిడ్‌ మీటర్లు బిగించాలని కేంద్రం స్పష్టం చేసింది.

పీక్ అవర్స్ అంటే..
సాధారణంగా విపరీతంగా కరెంటు వాడే సమయాన్ని పీక్ అవర్స్ అంటారు. పీక్‌ డిమాండ్‌ అనేది ఉదయం 6 గంటల నుంచి 10 గంటల దాకా, మళ్లీ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకూ ఉంటుంది. పీక్ అవర్స్‌లో కరెంటును డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా చేయడానికి బహిరంగ మార్కెట్ లో అధిక ధరను వెచ్చించి పంపిణీ సంస్థలు కరెంటును కొంటున్నాయి. దానివల్ల ఆర్థికంగా భారం పడుతోంది. యూనిట్‌ కరెంటుకు రూ.5 వసూలు చేస్తుంటే, దానిపై 20 శాతం అదనంగా యూనిట్‌కు రూ.6 వసూలు చేయాలని గుర్తు చేసింది. డిమాండ్‌ లేని సమయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా యూనిట్‌ విద్యుత్తు రూ.5గా ఉంటే 20 శాతం తక్కువగా రూ.4 వసూలు చేయాలని సూచించింది.

తెలంగాణలో శనివారం మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాలకు అత్యధికంగా 13,970 మెగావాట్ల డిమాండ్‌ నమోదైంది. రాత్రి 10 గంటలకు డిమాండ్‌ 8 వేల మెగావాట్లకు పడిపోయింది. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో రోజూ ఉదయం 6 నుంచి 12 వరకు, సాయంత్రం 6 నుంచి 9 వరకూ గరిష్ఠ డిమాండ్‌ ఉంటోంది. ఈ సమయాల్లో కోతలు లేకుండా సరఫరా చేయడానికి పంపిణీ సంస్థ (డిస్కం)లు ఇంధన ఎక్స్ఛేంజిలో యూనిట్‌కు రూ.12 చెల్లించి కరెంట్‌ కొంటున్నాయి. దీంతో వాటిపై రూ.వేల కోట్ల అదనపు భారం పడుతోంది. గరిష్ఠ డిమాండ్‌ కొంత సమయం పాటు మాత్రమే ఉండడం, తర్వాత వెంటనే అందులో సగానికి పడిపోతున్నందున కరెంట్‌ సరఫరా గ్రిడ్‌ నిర్వహణ కూడా ఇబ్బందికరంగా మారుతుందని కేంద్రం తెలిపింది. ఈ సమస్యల పరిష్కారానికి టీఓడీ విధానాన్ని తెచ్చినట్లు కేంద్రం చెబుతోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desamసింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు, సిద్దార్థ - ఫొటోలు వైరల్ట్రాఫిక్ వాలంటీర్లుగా గౌరవంగా బతుకుతామంటున్న ట్రాన్స్‌జెండర్స్‌వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Traffic Restrictions: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, ఆ రూట్లో వెళ్లకండి
Bigg Boss 8 : అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
అభయ్ సెల్ఫ్ నామినేషన్, 3వ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్లే, రిస్క్ ఎవరికంటే?
Andhra News: ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
ఏపీ ప్రభుత్వం ప్రపంచ రికార్డు - ఒకేరోజు 13,326 గ్రామసభలు, డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే..
Balapur Ganesh Laddu Auction: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
YSRCP Merge With Congress: షర్మిల అడ్డుపడకపోతే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం అయ్యుండేది! సంచలనం రేపుతున్న పోస్ట్
Hyderabad News: లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
లడ్డూ వేలంలో పాల్గొని వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు - గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Embed widget