అన్వేషించండి

Telangana News: మహిళా జర్నలిస్టులపై సీఎం అనుచరుల దాడి! డీజీపీకి ఫిర్యాదు

Telangana News: నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన మహిళా జర్నలిస్టులపై దాడి ఘటనపై డీజీపీకి బాధితులు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.

Attack on Women Journalists: నాగర్ కర్నూల్ జిల్లా కొండారెడ్డి పల్లి, వెల్దండ గ్రామాల్లో మహిళా జర్నలిస్టులు సరితా, విజయ రెడ్డిపై దాడి ఘటనలో డీజీపీకి ఫిర్యాదు అందింది. జర్నలిస్టుల నుంచి కెమెరాలు, సెల్ ఫోన్లు లాక్కొని, పోలీసు స్టేషన్ లోనే పోలీసుల ముందే దాడికి యత్నించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్ ను కలిసి టీయూడబ్ల్యూజే ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. రుణమాఫీపై గ్రౌండ్ రిపోర్టుకు వెళ్లిన మహిళా జర్నలిస్టుల పట్ల కొందరు వ్యక్తులు ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని డీజీపీకి వివరించారు.

 ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాలని డీజీపీని కోరారు. ఈ అంశంపై స్పందించిన డీజీపీ జితేందర్ ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేదిలేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు. డీజీపీని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రమణ కుమార్, హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి యార నవీన్ కుమార్, ఐజేయు సభ్యుడు అవ్వారి భాస్కర్, మహిళా జర్నలిస్టులు సరితా, విజయ రెడ్డి, పలువురు జర్నలిస్టు సంఘం నాయకులు ఉన్నారు.

అసలేం జరిగిందంటే..

నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొండారెడ్డి పల్లి గ్రామంలో ఆవుల సరిత, ఎం విజయా రెడ్డి అనే ఇద్దరు మహిళా జర్నలిస్టులు సీఎం రేవంత్‌ రెడ్డి అనుచరులు కొట్టి, దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. వారిని బురదలోకి నెట్టారని ఆరోపిస్తున్నారు. స్థానిక విలేకరులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో వివాదాస్పద అంశంగా ఉన్న వ్యవసాయ రుణమాఫీ స్థితిపై క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు మహిళా జర్నలిస్టులు వెళ్లారు.

రేవంత్ రెడ్డి పరిపాలనపై విమర్శనాత్మకంగా వీరు కవరేజీ చేస్తుండగా సీఎం అనుచరులు లక్ష్యంగా చేసుకున్నారని అంటున్నారు. వారు మహిళలపై భౌతికంగా దాడి చేశారు. కెమెరామెన్‌ల నుంచి కెమెరాలను లాక్కొని డిజిటల్ స్టోరేజీ కార్డులను లాక్కున్నారు. జర్నలిస్టు ప్రతినిధుల బృందాన్ని అక్కడి నుంచి వెళ్లకుండా అడ్డుకున్నారు. చాలా సేపటి తర్వాత ఎట్టకేలకు మహిళా జర్నలిస్టులు వెళ్లిపోతుండగా.. వారి వాహనాలను వెంబడించారు. చివరికి వెల్దండి పోలీస్ స్టేషన్‌లో ఆశ్రయం పొందారు.

టాప్ హెడ్ లైన్స్

Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలోని ఓ హోటల్‌లో సాంబార్‌లో బల్లి! సీజ్ చేసిన అధికారులు! 
ఆదిలాబాద్ జిల్లాలోని ఓ హోటల్‌లో సాంబార్‌లో బల్లి! సీజ్ చేసిన అధికారులు! 
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Adilabad Crime News: ఆదిలాబాద్ జిల్లాలో చోరీ సొత్తు కొనుగోలు, రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్! రిమాండ్‌కు ఆరుగురు నిందితులు 
ఆదిలాబాద్ జిల్లాలో చోరీ సొత్తు కొనుగోలు, రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్! రిమాండ్‌కు ఆరుగురు నిందితులు 
Revanth Reddy Challenges KCR: కాళేశ్వరంపై అసెంబ్లీ జాయింట్ సెషన్‌కు సీఎం రేవంత్ సవాల్ - డేట్,టైం చాయిస్‌ కేసీఆర్, కేటీఆర్, హరీష్‌కే !
కాళేశ్వరంపై అసెంబ్లీ జాయింట్ సెషన్‌కు సీఎం రేవంత్ సవాల్ - డేట్,టైం చాయిస్‌ కేసీఆర్, కేటీఆర్, హరీష్‌కే !

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Embed widget