అన్వేషించండి

DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 3 విడతల్లో ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ - తెలంగాణ (DOST 2026) ద్వారా డిగ్రీ కాలేజీలో ప్రవేశాలను 3 విడతలుగా నిర్వహించనున్నారు. విద్యార్థులు బుధవారం (ఈ నెల 15) నుంచి తొలి విడత ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా అప్లై చేసుకోవాలి. మొత్తం మూడు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, జూన్ 20 నుంచి 27 వరకు విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జులై 1వ తేదీ నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మండలి ఛైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, ఉపాధ్యక్షులు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్కే మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ తదితరులు దోస్త్ షెడ్యూల్‌ను విడుదల చేశారు.

రిజిస్ట్రేషన్ ఫీజు..
ఈ ప్రవేశాలకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ www.dost.cgg.gov.in లో ఏప్రిల్ 13న దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. రిజిస్ట్రేషన్ ఫీజు మొదటి విడతకు రూ. 200 చెల్లించాలి. ఒకవేళ రెండో విడత నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూ. 400 పేమెంట్ చేయాలి. గత ఏడాది లెక్కల ప్రకారం దోస్త్, నాన్-దోస్త్, రెసిడెన్షియల్ కళాశాలల్లో కలిపి రాష్ట్రంలో మొత్తం 4.40 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి.


DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

దోస్త్ మూడు విడతల కౌన్సెలింగ్ షెడ్యూలు..
తొలి విడత రిజిస్ట్రేషన్లు - ఏప్రిల్ 15 నుంచి మే 7వ తేదీ వరకు 
వెబ్ ఆప్షన్లు - ఏప్రిల్ 30 నుంచి మే 8వ తేదీ వరకు ఇవ్వాలి
సీట్ల కేటాయింపు - మే 14
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ - మే 15 నుంచి 23వ తేదీ వరకు

రెండో విడత రిజిస్ట్రేషన్లు - మే 15 నుంచి మే 25వ తేదీ వరకు 
వెబ్ ఆప్షన్లు - మే 15 నుంచి మే 26వ తేదీ వరకు ఇవ్వాలి
సీట్ల కేటాయింపు - మే 30
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ - మే 31 నుంచి జూన్ 5 తేదీ వరకు

మూడో విడత రిజిస్ట్రేషన్లు - మే 31 నుంచి జూన్ 15వ తేదీ వరకు 
వెబ్ ఆప్షన్లు - మే 31 నుంచి జూన్ 16వ తేదీ వరకు ఇవ్వాలి
సీట్ల కేటాయింపు - జూన్ 20
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ - జూన్ 20 నుంచి జూన్ 25 తేదీ వరకు

దోస్త్ పరిధిలోకి మరిన్ని కాలేజీలు..
ఈ సందర్భంగా  దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. గతేడాది వరకు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను సీపీగెట్ (CPGET) ద్వారా భర్తీ చేయగా, ఈసారి వాటిలోని మూడు మేనేజ్‌మెంట్ కోర్సులను దోస్త్ పరిధిలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. గత విద్యాసంవత్సరం (2025-26)లో మొత్తం 4.40 లక్షల సీట్లు ఉండగా, 2.05 లక్షల సీట్లు భర్తీ అయినట్లు తెలిపారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల శాతం పెరగడంతో డిగ్రీలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా పెరగవచ్చని ఆశిస్తున్నారు. ప్రస్తుతం సొంతంగా జాయినింగ్స్ నిర్వహించుకుంటున్న 60 ప్రైవేటు కాలేజీలను సైతం దోస్త్ పరిధిలోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. 

దోస్త్ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ (OU), కాకతీయ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, పాలమూరు వర్సిటీ, మహాత్మాగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాలతో పాటు చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ, కొత్తగూడెంలోని మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ, జేఎన్‌టీయూ పరిధిలోని కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్‌సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఎస్‌డబ్ల్యూ వంటి కోర్సుల్లో సీట్లను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారు. వీటితో పాటు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (SBTET) పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో డీ ఫార్మసీ సీట్లను, గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (నిథిమ్)లోని ఒక కోర్సు సీట్లను కూడా దోస్త్ ద్వారానే భర్తీ చేయనున్నామని అధికారులు తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Crop fire in Nirmal district: కన్నబిడ్డల్లా సాకిన పంటను కళ్లముందే కబళించిన అగ్ని - కన్నీరు పెట్టిస్తున్న నిర్మల్ జిల్లాలో అన్నదాతల ఆక్రందన!
కన్నబిడ్డల్లా సాకిన పంటను కళ్లముందే కబళించిన అగ్ని - కన్నీరు పెట్టిస్తున్న నిర్మల్ జిల్లాలో అన్నదాతల ఆక్రందన!
Hyderabad Real Estate News: ప్రగతీనగర్, నిజాంపేట్‌ రియల్టర్స్‌ను వేధిస్తున్న ఏజ్‌బార్ సమస్య! పెళ్లికాని ప్రసాద్‌లా మిగిలిపోతున్న బిల్డింగ్స్!
ప్రగతీనగర్, నిజాంపేట్‌ రియల్టర్స్‌ను వేధిస్తున్న ఏజ్‌బార్ సమస్య! పెళ్లికాని ప్రసాద్‌లా మిగిలిపోతున్న బిల్డింగ్స్!
TRS Pary: కవిత టీఆర్‌ఎస్ పార్టీకి ఈసీ ఓకే కానీ పేరులో చిన్న మార్పు! రక్షణ సేనగా మారిన రాష్ట్ర సేన!
కవిత టీఆర్‌ఎస్ పార్టీకి ఈసీ ఓకే కానీ పేరులో చిన్న మార్పు! రక్షణ సేనగా మారిన రాష్ట్ర సేన!
Hyderabad Mango Pickle Season: అమెరికా నుంచి అనకాపల్లి వరకూ నోరూరిస్తున్న హైదరాబాద్ ఆవకాయ్‌! పచ్చళ్ల సీజన్‌లో సరికొత్త ట్రెండ్!
అమెరికా నుంచి అనకాపల్లి వరకూ నోరూరిస్తున్న హైదరాబాద్ ఆవకాయ్‌! పచ్చళ్ల సీజన్‌లో సరికొత్త ట్రెండ్!
Advertisement

వీడియోలు

Mumbai Indians Batting Failure IPL 2026 | ముంబై వరుస పరాజయాలకు కారణం ఏంటి ?
Yuvi, Travis plan behind Abhishek Success IPL 2026 | అభిషేక్ విధ్వంసం వెనుక రహస్యం ఇదే
Ryan Rickelton Breaks Record IPL 2026 | 18 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన ర్యాన్ రికెల్టన్
Vaibhav Suryavanshi Performance IPl 2026 | వైభవ్ విధ్వంసానికి గవాస్కర్ ఫిదా
SRH vs MI Highlights IPL 2026 | ముంబైపై సన్‌రైజర్స్ అదిరే విక్టరీ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Real Estate News: ప్రగతీనగర్, నిజాంపేట్‌ రియల్టర్స్‌ను వేధిస్తున్న ఏజ్‌బార్ సమస్య! పెళ్లికాని ప్రసాద్‌లా మిగిలిపోతున్న బిల్డింగ్స్!
ప్రగతీనగర్, నిజాంపేట్‌ రియల్టర్స్‌ను వేధిస్తున్న ఏజ్‌బార్ సమస్య! పెళ్లికాని ప్రసాద్‌లా మిగిలిపోతున్న బిల్డింగ్స్!
Andhra Pradesh Cabinet meeting: ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124 కోట్లు - కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124 కోట్లు - కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
Hansika: బికినీలో హన్సిక... మారిషస్‌లో మస్తీ మజా
బికినీలో హన్సిక... మారిషస్‌లో మస్తీ మజా
AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో 85. 25 శాతం ఉత్తీర్ణత! మరోసారి బాలికలదే పైచేయి!
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో 85. 25 శాతం ఉత్తీర్ణత! మరోసారి బాలికలదే పైచేయి!
Bellamkonda Sai Sreenivas Weds Kavya: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి ఫోటోలు... తిరుమలలో ఏడడుగులు వేసిన హీరో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి ఫోటోలు... తిరుమలలో ఏడడుగులు వేసిన హీరో
Kara Review - కర రివ్యూ: బ్యాంక్ రాబరీలో పోలీసులకు సవాల్ విసిరిన పల్లెటూరి దొంగ… ధనుష్ సినిమా ఎలా ఉందంటే?
కర రివ్యూ: బ్యాంక్ రాబరీలో పోలీసులకు సవాల్ విసిరిన పల్లెటూరి దొంగ… ధనుష్ సినిమా ఎలా ఉందంటే?
Kids Swimming : పిల్లలకు స్విమ్మింగ్ నేర్పిస్తే కలిగే లాభాలివే.. జీవితాంతం ఉపయోగపడే స్కిల్ ఇది, ఎందుకంటే
పిల్లలకు స్విమ్మింగ్ నేర్పిస్తే కలిగే లాభాలివే.. జీవితాంతం ఉపయోగపడే స్కిల్ ఇది, ఎందుకంటే
MAVIGUN News: మావిగన్‌పై అంతా గప్‌చుప్‌! అసలు రీజన్ ఇదే!
మావిగన్‌పై అంతా గప్‌చుప్‌! అసలు రీజన్ ఇదే!
Embed widget