By: ABP Desam | Updated at : 07 Dec 2021 11:06 AM (IST)
టీఆర్ఎస్ ఎంపీల కీలక నిర్ణయం
పార్లమెంట్ సమావేశాలను తెలంగాణ రాష్ట్ర సమితి బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపి ఆ తర్వాత తమ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంపై స్పష్టత ఇవ్వాలని పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన నిర్వహిస్తున్నారు. సభా కార్యకలాపాలకు అడ్డం పడుతున్నారు. దీంతో పలుమార్లు స్పీకర్ వారిపై అసహనం వ్యక్తం చేశారు.
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వారికి సమాధానం కూడా ఇచ్చారు. తెలంగాణ టార్గెట్ ప్రకారం ఇవ్వాల్సిన ధాన్యమే ఇంకా ఇవ్వలేదని .. యాసంగిలో ఎంత ధాన్యం సేకరించాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ క్రమంలో ఆ సమాధానంతో సంతృప్తి చెందని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆదివారం టీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. అప్పుడే కేంద్రం నుంచి స్పష్టత రాకపోతే బాయ్ కాట్ చేయాలన్న సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ మేరకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత బాయ్ కాట్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
మరో వైపు టీఆర్ఎస్ ఎంపీలు బాయ్ కాట్ నిర్ణయం తీసుకోబోతున్నారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారమే విమర్శించారు. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారని.. బీజేపీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వారు మంగళవారం మధ్యాహ్నం నుంచి పార్లమెంట్ సమావేశాలను బాయ్కాట్ చేయబోతున్నారని ఆరోపించారు. అయితే విపక్ష పార్టీల ఆరోపణలు సహజగమే కానీ.. టీఆర్ఎస్ పార్లమెంట్ సమావేశాల బాయ్కాట్ నిర్ణయం తీకోవడం వెనుక వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం స్పందించకపోవడమే కాకుండా.. మరో కీలకమైన కారణం కూడా ఉందని చెబుతున్నారు. అవే ఎమ్మెల్సీ ఎన్నికలు.
Also Read: Journalist: కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 2 లక్షల సాయం.. డిసెంబర్ 15న పంపిణీ
ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరుగుతున్న చోట ఉన్న ఎంపీలు.. ఎన్నికలపైనే దృష్టి పెట్టాలని కేసీఆర్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను కేసీఆర్ ఎంపీలకు ఇచ్చారు. ఇప్పటికే నలుగురు ఎంపీలు ఓటర్లతో నిర్వహిస్తున్న క్యాంప్లకు వెళ్లినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీతో పాటు ఇండిపెండెంట్లు, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు సైలెంట్ అయ్యారు. దీంతో ఏం జరుగుతోందనని టీఆర్ఎస్ లో ఆందోళన నెలకొంది. మెజార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు టీఆర్ఎస్ కు చెందినవారే. అయితే వారిలో అసంతృప్తి ఉంది. నిధులు, విధుల విషయంలో వారిని సంతృప్తి పరచడం కష్టంగా మారింది. అందుకే ఎంపీలకు ఆ బాధ్యతలు ఇవ్వడంతో పనిలో పనిగా బాయ్ కాట్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
Also Read: Shreya Muralidhar : కార్డియాక్ అరెస్ట్తో యంగ్ యూట్యూబర్ మృతి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ
Bandi Sanjay : తెలంగాణకు మోదీ నిధులిస్తుంటే, కేసీఆర్ దారి మళ్లిస్తున్నారు- బండి సంజయ్
Piyush Goyal On CM KCR : బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్పు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంచలన కామెంట్స్
Amit Shah: కేసీఆర్కి ఉన్న బాధల్లా ఒక్కటే, తన కొడుకుని సీఎం చేయాలని-అమిత్షా సెటైర్లు
Secunderabad Bjp Meeting : బీజేపీ విజయసంకల్ప సభ, భారీగా తరలివచ్చిన శ్రేణులు, హాజరైన ప్రజాగాయకుడు గద్దర్
Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్
Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు
Royal Enfield Hunter 350: అత్యంత చవకైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వచ్చేస్తుంది - ధర ఎంతంటే?
Krishna Vamsi: రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్ - కృష్ణవంశీపై అంత నమ్మకమా?