అన్వేషించండి

TRS News: రాజ్యసభలో కేంద్రం అన్నీ అబద్ధాలే - కేంద్రమంత్రిపై టీఆర్ఎస్ ఎంపీల ప్రివిలైజ్ నోటీసు

TRS in Rajyasbha: ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలంతా కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కేకే మాట్లాడారు.

Telangana Paddy Procurement: తెలంగాణలో పండే వడ్లను కేంద్రం కొనుగోలు చేసే విషయంలో దుమారం కొనసాగుతూనే ఉంది. తాజాగా కేంద్రం తీరుపై టీఆర్ఎస్ నేతలు మరోసారి మండిపడ్డారు. దేశంలో ఎఫ్‌సీఐ వద్ద పోగుపడుతున్న బియ్యాన్ని ఎగుమతి చేయడం లేదంటూ కేంద్రం అబద్ధాలు చెబుతోందని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు (కేకే) (K Kesava Rao) ఆరోపించారు. పారా బాయిల్డ్‌ రైస్‌ను కేంద్రం ఎగుమతి చేస్తోందని, అలాంటప్పుడు తెలంగాణలో ధాన్యం ఎందుకు సేకరించడం లేదని నిలదీశారు. ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలంతా కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కేకే (K Kesava Rao) మాట్లాడారు.

శ్రీలంక, బంగ్లాదేశ్‌ వంటి దేశాలు పారా బాయిల్డ్‌ రైస్‌ (Para Boiled Rice) అడుగుతున్నాయని, ఇలాంటి సమయంలో కేంద్రం సేకరించి ఆయా దేశాలకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. తెలంగాణ మంత్రులు ఎప్పుడూ కేంద్ర మంత్రులను బెదిరించలేదని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశామని అన్నారు. ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతూ.. దేశంలో గత ఏడేళ్లుగా ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ విపరీతంగా పెరిగిందదని ఆరోపించారు. ప్రభుత్వ ప్రతి వ్యాపారాన్ని కేంద్రం లాభంతో అమ్మేయాలని చూస్తోందని విమర్శించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలును ప్రజా సంక్షేమం కోణంలో చూడాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. 

పీయూష్‌ గోయల్‌పై (Piyush Goyal) సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
కేంద్ర ఆహార‌శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌ (Piyush Goyal) దేశాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించారని, ఆయన వ్యాఖ్యలు అబద్ధమని ఆరోపిస్తూ నేడు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు జారీ చేశారు. చైర్మన్‌కు రాజ్యసభ సభ్యులు, లోక్‌స‌భ స‌భ్యులు స్పీక‌ర్‌కు ఆ లేఖ‌ను ఇచ్చారు. రూల్ 187 ప్రకారం కేంద్ర మంత్రి పీయూష్‌పై స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు ఇస్తున్నట్లు రాజ్యస‌భ టీఆర్ఎస్‌ స‌భ్యులు త‌మ లేఖ‌లో తెలిపారు. ఒక‌టో తేదీన పారా బాయిల్డ్ రైస్ ఎగుమ‌తిపై మంత్రి పీయూష్ గోయల్ఇ (Piyush Goyal) చ్చిన స‌మాధానం త‌ప్పుదోవ ప‌ట్టించేలా ఉంద‌ని అన్నారు. వాస్తవానికి విదేశాల‌కు మిలియ‌న్ ట‌న్నుల బాయిల్డ్ రైస్‌ను ఎగుమ‌తి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో స్పష్టంగా ఉంద‌ని టీఆర్ఎస్ (TRS) ఎంపీలు ఆరోపించారు. మంత్రి స‌మాధానం స‌రైన రీతిలో లేని కార‌ణంగానే ఆయ‌న‌పై స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. లోక్‌స‌భ టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఇదే అంశాన్ని లేఖ‌లో ప్రస్తావిస్తూ స్పీక‌ర్‌కు నోటీసు ఇచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Jagan Targets CM Ramesh | విశాఖ వేదికగా బీజేపీపై జగన్ విమర్శలు..దేనికి సంకేతం..! | ABP DesamBJP MP Candidate Madhavi Latha |అదే మసీదులో ముక్కు నేలకు పెట్టి క్షమాపణలు కోరాలి..! | ABP DesamPawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
Embed widget