అన్వేషించండి

Warangal Airport: వచ్చే ఏడాది నుంచి వరంగల్‌కు విమానాలు... ఏఏఐను తుది నివేదిక కోరిన రాష్ట్ర ప్రభుత్వం

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ లో విమానాశ్రయాన్ని వచ్చే ఏడాది లోపు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరులోగా విమానాశ్రయాల తుది నివేదిక ఇవ్వాలని ఏఏఐను కోరింది.

రాష్ట్రంలో తొలిదశలో మూడు ప్రాంతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విమానాశ్రయాల నిర్మాణం కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు ఈ నెలాఖరులోగా తుది నివేదిక ఇవ్వాలని పౌర విమానయాన సంస్థ(ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా-ఏఏఐ)కు స్పష్టంచేసింది.  తెలంగాణలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉడాన్‌ పథకం కింద 6 ప్రాంతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో మామునూరు(వరంగల్‌), జక్రాన్‌పల్లి(నిజామాబాద్‌), బసంత్‌నగర్‌(పెద్దపల్లి)పై దృష్టిపెట్టింది. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న వరంగల్‌ నగరంలో విమానాశ్రయాన్ని వచ్చే ఏడాది కల్లా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. 

Also Read: వాగులో బాలురు గల్లంతు.. ఐదుగురి మృతదేహాల వెలికితీత, మంత్రి కేటీఆర్ ఆవేదన

అంచనా వ్యయాలను సవరించాలి

మామునూరు, బసంత్‌నగర్‌లలో రన్‌వేకు అవసరమైన ఎయిర్‌ స్ట్రిప్స్‌ అందుబాటులో ఉన్నా... వినియోగంలో లేకపోవడంతో అవి దెబ్బతిన్నాయి. జక్రాన్‌పల్లిలో పూర్తిస్థాయి విమానాశ్రయం నిర్మించాల్సి ఉంది. రెండో దశలో ఖానాపూర్‌(ఆదిలాబాద్‌), గొల్లగూడెం-పేటచెరువు(భద్రాద్రి-కొత్తగూడెం), గుడిబండ(మహబూబ్‌నగర్‌)లపై నివేదికలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఏఏఐను కోరింది. ఈ ఆరు ప్రాంతీయ విమానాశ్రయాలకు సంబంధించి ఏఏఐ గతంలో ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతానికి రద్దీ అంతగా ఉండని కారణంగా దశలవారీగా వాటిని విస్తరించేలా వ్యయాలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

Also Read: ఏపీ రైతులకు శుభవార్త.. వారి ఖాతాల్లోకి నేరుగా నగదు జమచేసిన సీఎం వైఎస్ జగన్

ఏఏఐపై అసహనం

 ఒక్కో విమానాశ్రయం నిర్మాణానికి రూ.400-450 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఏఏఐ నుంచి నివేదిక వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించి నిధులు కోరాలని అధికారులు యోచిస్తున్నారు. ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ నుంచి ఆశించినంత వేగంగా స్పందన రాకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం అసహనంతో ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, ఏఏఐ ఛైర్మన్‌ సంజీవ్‌కుమార్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా రాష్ట్రంలో ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్‌ కోరారు.

Also Read: రాజ్యసభ సభ్యుడ్ని ఎమ్మెల్సీ చేసిన కేసీఆర్ ! ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ మార్క్...

Also Read:  వరంగల్ నుంచి త్వరలో విమాన సర్వీసులు... అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్రానికి కేంద్ర పౌరవిమానయానశాఖ లేఖ...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ

వీడియోలు

ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget