News
News
X

YS Jagan: ఏపీ రైతులకు శుభవార్త.. వారి ఖాతాల్లోకి నేరుగా నగదు జమచేసిన సీఎం వైఎస్ జగన్

ఏపీ రైతులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త అందించారు. ఇన్ పుట్ సబ్సిడీ కింద నేరుగా నగదును రైతుల ఖాతాల్లో జమచేశారు.

FOLLOW US: 
Share:

గులాబ్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించింది. ఈ సెప్టెంబర్‌లో సంభవించిన గులాబ్‌ సైక్లోన్‌ వల్ల రైతులు భారీగా నష్టపోయారు. పంట నష్టపోయిన రైతులకు రూ.22 కోట్లను ఏపీ సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి నేరుగా రైతులకు పెట్టుబడి రాయితీ అందించారు. ఈ సైక్లోన్‌ వల్ల 34,586 మంది రైతులు పంట నష్టపోయారు.

ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు పంట నష్టపరిహారం కింద 13.96 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ సాయం కింద రూ. 1,071 కోట్లు విడుదల చేసింది. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు , రబీలో పంట నష్టపోయిన వారికి ఇన్‌పుట్ సబ్సిడీ కింద నేడు రూ.22 కోట్లను సీఎం జగన్ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. రైతులకు ప్రభుత్వం ఆపన్నహస్తం అందించాలని, అందులో భాగంగా మరో అడుగు ముందుకేసి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏపీలో దాదాపు 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారని సీఎం పేర్కొన్నారు. వీరికి ప్రభుత్వ సహకారం ఎప్పటికీ ఉంటుందని.. అందులో భాగంగా రైతు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. 
Also Read: తప్పు ప్రభుత్వాలది.. శిక్ష రైతులకు ! అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులు !

విపత్తుల కారణంగా నష్టపోయిన రైతులకు అదే సీజన్ ముగిసేలోగా పంట నష్టపరిహారం చెల్లించాలని సీఎం వైఎస్ జగన్ ఇదివరకే నిర్ణయించారు. సెప్టెంబర్ 2021లో సంభవించిన గులాబ్ సైక్లోన్ వల్ల నష్టపోయిన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి సీఎం నేరుగా నగదు జమ చేశారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు ఇందుకు సంబంధించి వివరాలను ఇటీవల వెల్లడించారు. నేడు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రైతులకు పరిహారాన్ని అందజేశారు. అనంతపురం, కడప జిల్లాల్లో వేరుశెనగ పంట దెబ్బతిన్న రైతులకుసైతం  80% రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తున్నారు. రబీ సీజన్ ముగిసేలోగా ప్రభుత్వ సహకారం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ ... ఇద్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలన్న ఏపీ ప్రభుత్వ లాయర్లు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 16 Nov 2021 12:16 PM (IST) Tags: YS Jagan YSRCP AP government AP CM YS Jagan gulab cyclone AP Farmers YS Jagan Cares YS Jagan With AP Farmers Gulab Hit Farmers

సంబంధిత కథనాలు

TSPSC Papers Leak: పేపర్స్ లీక్ నిందితులు రేణుక, భర్త డాక్యా నాయక్‌లపై వేటు

TSPSC Papers Leak: పేపర్స్ లీక్ నిందితులు రేణుక, భర్త డాక్యా నాయక్‌లపై వేటు

PRO-Khalistani Twitter Account: భారతదేశంలోని ఖలిస్తానీ మద్దతుదారుల ట్విట్టర్ ఖాతాలు బ్లాక్

PRO-Khalistani Twitter Account: భారతదేశంలోని ఖలిస్తానీ మద్దతుదారుల ట్విట్టర్ ఖాతాలు బ్లాక్

Breaking News Live Telugu Updates: వడగండ్ల ప్రభావిత జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన, పంట నష్టంపై పరిశీలన

Breaking News Live Telugu Updates: వడగండ్ల ప్రభావిత జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన, పంట నష్టంపై పరిశీలన

AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి

AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి

IB Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగ రాతపరీక్ష అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! పరీక్ష ఎప్పుడంటే?

IB Recruitment: ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగ రాతపరీక్ష అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! పరీక్ష ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్

TS Paper Leak Politics : "పేపర్ లీక్" కేసు - రాజకీయ పుట్టలో వేలు పట్టిన సిట్ ! వ్యూహాత్మక తప్పిదమేనా ?

TS Paper Leak Politics :

Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్

Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు,  ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం