అన్వేషించండి

Telangana Local Election Reservation: తెలంగాణలో BCలకు 42% కోటా - జీవో రిలీజ్ - శనివారం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ?

BC Reservation: తెలంగాణ లోకల్ ఎలక్షన్ రిజర్వేషన్ ఖరారు చేస్తూ జీవో విడుదల చేశారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Telangana local election BC reservation GO: తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల (BC) కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలో వాగ్దానం చేసిన ఈ BC కోటా జీవో నెంబర్ 9 విడుదల చేసింది.   రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ షెడ్యూల్  విడుదలయ్యే అవకాశంఉందని  అధికారులు తెలిపారు. ఈ లోపు అధికారులతోఎస్‌ఈసీ సమావేశం  నిర్వహిస్తారు.  తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించింది.                                   

అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మార్చి 18, 2025న BC కోటాను 42%కు పెంచే బిల్లులు ఆమోదించారు.  ఆగస్టు 31న మరో రెండు బిల్లులు ఆమోదించి, SC, ST, BCలకు 50% మించి రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. కానీ అవి పెండింగ్ లో ఉన్నాయి.                        

డెడికేటెడ్ BC కమిషన్ నివేదిక, కుల సర్వే ఆధారంగా 42% BC కోటా నిర్ణయించారు. ఈ కోటాలో మహిళలకు 50% సబ్-కోటా కూడా ఉంటుంది. జిల్లా కలెక్టర్లు   రిజర్వేషన్ మ్యాట్రిక్స్‌ను సీల్డ్ కవర్లలో పంచాయతీ రాజ్ విభాగానికి సమర్పించారు. ఈ మ్యాట్రిక్స్ ప్రకారం, గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు (MPP), జిల్లా పరిషత్తులు (ZP)లో BC, SC, ST కోటాలు నిర్ణయిస్తారు.  జీవో విడుదలైనందున  వెంటనే పంచాయతీ రాజ్ విభాగం SECకు సిఫార్సు చేస్తుంది. SEC ఒకటి లేదా రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుంది.        

ఎన్నికలు దశలవారీగా జరుగుతాయి. మొదటి దశలో ZP చైర్మన్‌లు (31), ZPTCలు (566), MPP ప్రెసిడెంట్లు (566), MPTCలు (5,773) ఎన్నికలు. రెండో దశలో గ్రామ పంచాయతీలు (13,000+) జరుగుతాయి. అయితే ఈ జీవో చెల్లుబాటుపై సందేహాలు ఉన్నాయి. సెప్టెంబర్ 24న తెలంగాణ హైకోర్టు, 42% BC కోటాపై పిటిషన్‌ను తిరస్కరించింది. "GO జారీ కాలేదు,  తొందరపడి పిటిషన్ వేశారు" అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇప్పుడు జీవో జారీ అయినందుకు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.               

 

    

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jeevan Reddy: ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
ఈ 25న కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాజీనామా.. జగిత్యాలలో మారనున్న రాజకీయ ముఖచిత్రం
Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget