అన్వేషించండి

Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు

Telangana News: తెలంగాణ గ్రూప్ 1 పరీక్షా కేంద్రాల వద్ద కొన్ని చోట్ల తొలి రోజు గుండెలు పిండేసే దృశ్యాలు కనిపించాయి. నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించకపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

Telangana Group 1 Exams: ఒక్క నిమిషం.. ఒకే ఒక్క నిమిషం వారి కలను చిదిమేసింది. కన్నవారిని ఉన్న ఊరిని వదిలి పుస్తకాలతో కుస్తీ పడుతూ ప్రభుత్వ అధికారులుగా స్థిరపడాలన్న వారి ఆశలపై నీళ్లు చల్లింది. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కాగా వివిధ కారణాలతో నిమిషం ఆలస్యంగా వచ్చిన వారిని అధికారులు అనుమతించలేదు. మధ్యాహ్నం 2 గంటలకు అన్నీ పరీక్షా కేంద్రాల గేట్లను అధికారులు మూసేశారు. దీంతో తమను పరీక్షకు అనుమతించాలని కన్నీటితో వేడుకున్నా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఓ పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థి రోదిస్తూ తనను లోపలికి పంపించాలని గేటు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలా తొలి రోజు కొన్ని చోట్ల గుండెలు పిండేసే దృశ్యాలు కనిపించాయి. ఎంత వేడుకున్నా ఫలితం లేకపోవడంతో చివరకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు నిరాశగా వెనుదిరిగారు. 

గోడ దూకి పరీక్ష కేంద్రం వైపు..

సికింద్రాబాద్‌లోని ఓ పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన ఓ అభ్యర్థి తనను లోపలికి పంపించాలని అధికారులను వేడుకున్నాడు. అయినా నిబంధనల ప్రకారం పోలీసులు అతన్ని అనుమతించలేదు. దీంతో గోడ దూకి పరీక్ష కేంద్రం వైపు పరుగులు పెట్టాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని బేగంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరో చోట, ఓ మహిళా  అభ్యర్థిని నిమిషం ఆలస్యంగా రాగా.. అధికారులు అనుమతించలేదు. దీంతో గేట్లు పట్టుకుని కన్నీటితో తనను అనుమతించాలని వేడుకుంది. అయినా, పోలీసులు లోపలికి అనుమతించలేదు.
Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు
Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు

అమ్మ కన్నీటిని చూసి..

గ్రూప్ - 1 పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చిన ఓ అభ్యర్థినిని అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో పరీక్ష రాయలేకపోయానని ఆమె ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. ఈ క్రమంలో పోలీసు సిబ్బంది ఆమెకు సపర్యలు చేశారు. ఈ దృశ్యాన్ని చూసిన సదరు అభ్యర్థిని బిడ్డ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దృశ్యం అక్కడి వారిని కదిలించింది.
Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు
Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు

శభాష్.. పోలీస్

అటు, కొన్ని కేంద్రాల్లో పోలీసులు అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా సాయం చేశారు. దుండిగల్‌లో ఓ అభ్యర్థిని పొరపాటున తన పరీక్షా కేంద్రానికి కాకుండా వేరే పరీక్షా కేంద్రానికి వెళ్లింది. దీంతో కన్నీళ్లు పెట్టుకోగా అక్కడే విధులు నిర్వహిస్తోన్న ఓ పోలీస్ సిబ్బంది విషయం తెలుసుకుని ఆ అభ్యర్థినిని తన బైక్‌పై ఆమె పరీక్షా కేంద్రానికి సకాలంలో తీసుకెళ్లారు. దీంతో పోలీస్ సిబ్బందిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, కీసరలో అభ్యర్థి పరీక్షా కేంద్రానికి రావడం ఆలస్యం కావడంతో.. ఇది గమనించిన ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య అతన్ని పెట్రోలింగ్ వాహనంలో గీతాంజలి ఇంజినీరింగ్ పరీక్షా కేంద్రానికి సకాలంలో తీసుకొచ్చారు. దీంతో ఆ అభ్యర్థి సజావుగా పరీక్ష రాయగలిగారు.
Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు
Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు

Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు
Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు

ప్రశాంతంగా ముగిసిన పరీక్ష

రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు క్వాలిఫై కాగా వీరిలో అత్యధికులు పరీక్షకు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. తొలి రోజు జనరల్ ఇంగ్లీష్ పేపర్ పరీక్ష నిర్వహించారు. మంగళవారం నుంచి ఈ నెల 27 వరకూ  వివిధ సబ్జెక్టుల ప్రకారం పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆందోళనలు కొనసాగుతోన్న క్రమంలో పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్నీ కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ విధించారు. పరీక్ష గది, చీఫ్ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పరిస్థితిని సమీక్షించారు. హైదరాబాద్ జిల్లాలో 5,163 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 4,896 మంది హాజరయ్యారు. 

అటు, గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో అన్ని అంశాలు స్పష్టంగా చెప్పిందని.. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోవడం సరికాదని పేర్కొంది. పలితాల విడుదలకు ముందే తుది విచారణ ముగించాలని ఉన్నత న్యాయస్థానానికి సూచించింది.

Also Read: Telangana Jobs: బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న రేవంత్ రెడ్డి - అన్ని లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan:కోర్టుకు గంట సమయం ఇచ్చిన జగన్ -  హైదరాబాద్ టూర్ షెడ్యూల్ వైరల్
కోర్టుకు గంట సమయం ఇచ్చిన జగన్ - హైదరాబాద్ టూర్ షెడ్యూల్ వైరల్
Maoist encounter: ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు
ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు
NRI murder case: అమెరికాలో శశికళ హత్య - భర్తపై అనుమానం - ఎనిమిదిన్నరేళ్లకు దొరికిన అసలు హంతకుడు!
అమెరికాలో శశికళ హత్య - భర్తపై అనుమానం - ఎనిమిదిన్నరేళ్లకు దొరికిన అసలు హంతకుడు!
New Rent Rules: ఇల్లు అద్దెకు ఇస్తున్నారా? పోనీ తీసుకుంటున్నారా? - అద్దె ఒప్పందాల్లో కొత్త రూల్స్ వచ్చేశాయ్ - తెలుసుకోకపోతే నష్టపోతారు  !
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా? పోనీ తీసుకుంటున్నారా? - అద్దె ఒప్పందాల్లో కొత్త రూల్స్ వచ్చేశాయ్ - తెలుసుకోకపోతే నష్టపోతారు !
Advertisement

వీడియోలు

Suma about Her Retirement in Premiste Event | రిటైర్మెంట్ పై సుమ కామెంట్స్ | ABP Desam
BJP Madhavi Latha on SS Rajamouli : రాజమౌళి హనుమాన్ కామెంట్స్ పై మాధవీలత రియాక్షన్ | ABP Desam
WTC Final India | టీమిండియా టెస్ట్ చాంపియన్‌ షిప్ ఫైనల్ చేరాలంటే ఇదొక్కటే దారి
Ind vs SA Shubman Gill | రెండు టెస్ట్‌‌లో గిల్ ఆడటంపై అనుమానాలు.. అతడి ప్లేస్‌లో మరొకరు?
Dinesh Karthik Comments on Gambhir | గంభీర్.. అతడి కెరీర్ నాశనం చేస్తున్నావ్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:కోర్టుకు గంట సమయం ఇచ్చిన జగన్ -  హైదరాబాద్ టూర్ షెడ్యూల్ వైరల్
కోర్టుకు గంట సమయం ఇచ్చిన జగన్ - హైదరాబాద్ టూర్ షెడ్యూల్ వైరల్
Maoist encounter: ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు
ఎన్‌కౌంటర్ అయిన వారిలో దేవ్‌జీ, ఆజాద్ లేరు - లొంగిపోవాలని ఇంటలిజెన్స్ చీఫ్ పిలుపు
NRI murder case: అమెరికాలో శశికళ హత్య - భర్తపై అనుమానం - ఎనిమిదిన్నరేళ్లకు దొరికిన అసలు హంతకుడు!
అమెరికాలో శశికళ హత్య - భర్తపై అనుమానం - ఎనిమిదిన్నరేళ్లకు దొరికిన అసలు హంతకుడు!
New Rent Rules: ఇల్లు అద్దెకు ఇస్తున్నారా? పోనీ తీసుకుంటున్నారా? - అద్దె ఒప్పందాల్లో కొత్త రూల్స్ వచ్చేశాయ్ - తెలుసుకోకపోతే నష్టపోతారు  !
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా? పోనీ తీసుకుంటున్నారా? - అద్దె ఒప్పందాల్లో కొత్త రూల్స్ వచ్చేశాయ్ - తెలుసుకోకపోతే నష్టపోతారు !
Prime Minister Modi Puttaparthi tour: ప్రధాని మోదీ పుట్టపర్తి పర్యటన - ఏపీ బీజేపీ నేతల్లో జోష్
ప్రధాని మోదీ పుట్టపర్తి పర్యటన - ఏపీ బీజేపీ నేతల్లో జోష్
Deepika Padukone: ప్రభాస్ సినిమాలు అక్కర్లేదా... మరి షారుఖ్, బన్నీవి ఎందుకు? దీపిక కామెంట్స్‌తో కొత్త కాంట్రవర్సీ
ప్రభాస్ సినిమాలు అక్కర్లేదా... మరి షారుఖ్, బన్నీవి ఎందుకు? దీపిక కామెంట్స్‌తో కొత్త కాంట్రవర్సీ
Bandi Sanjay About Naxalism: నక్సలైట్లు అడవుల్లో చస్తుంటే... అర్బన్ నక్సల్స్ పదవులు అనుభవిస్తున్నారు: బండి సంజయ్
నక్సలైట్లు అడవుల్లో చస్తుంటే... అర్బన్ నక్సల్స్ పదవులు అనుభవిస్తున్నారు: బండి సంజయ్
Supritha Naidu: అటు తల్లి... ఇటు కుమార్తె... డబ్బింగ్ స్టూడియోలో సుప్రీత ఎమోషనల్ మూమెంట్
అటు తల్లి... ఇటు కుమార్తె... డబ్బింగ్ స్టూడియోలో సుప్రీత ఎమోషనల్ మూమెంట్
Embed widget