అన్వేషించండి

Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు

Telangana News: తెలంగాణ గ్రూప్ 1 పరీక్షా కేంద్రాల వద్ద కొన్ని చోట్ల తొలి రోజు గుండెలు పిండేసే దృశ్యాలు కనిపించాయి. నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించకపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

Telangana Group 1 Exams: ఒక్క నిమిషం.. ఒకే ఒక్క నిమిషం వారి కలను చిదిమేసింది. కన్నవారిని ఉన్న ఊరిని వదిలి పుస్తకాలతో కుస్తీ పడుతూ ప్రభుత్వ అధికారులుగా స్థిరపడాలన్న వారి ఆశలపై నీళ్లు చల్లింది. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కాగా వివిధ కారణాలతో నిమిషం ఆలస్యంగా వచ్చిన వారిని అధికారులు అనుమతించలేదు. మధ్యాహ్నం 2 గంటలకు అన్నీ పరీక్షా కేంద్రాల గేట్లను అధికారులు మూసేశారు. దీంతో తమను పరీక్షకు అనుమతించాలని కన్నీటితో వేడుకున్నా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఓ పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థి రోదిస్తూ తనను లోపలికి పంపించాలని గేటు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలా తొలి రోజు కొన్ని చోట్ల గుండెలు పిండేసే దృశ్యాలు కనిపించాయి. ఎంత వేడుకున్నా ఫలితం లేకపోవడంతో చివరకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు నిరాశగా వెనుదిరిగారు. 

గోడ దూకి పరీక్ష కేంద్రం వైపు..

సికింద్రాబాద్‌లోని ఓ పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన ఓ అభ్యర్థి తనను లోపలికి పంపించాలని అధికారులను వేడుకున్నాడు. అయినా నిబంధనల ప్రకారం పోలీసులు అతన్ని అనుమతించలేదు. దీంతో గోడ దూకి పరీక్ష కేంద్రం వైపు పరుగులు పెట్టాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని బేగంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరో చోట, ఓ మహిళా  అభ్యర్థిని నిమిషం ఆలస్యంగా రాగా.. అధికారులు అనుమతించలేదు. దీంతో గేట్లు పట్టుకుని కన్నీటితో తనను అనుమతించాలని వేడుకుంది. అయినా, పోలీసులు లోపలికి అనుమతించలేదు.
Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు
Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు

అమ్మ కన్నీటిని చూసి..

గ్రూప్ - 1 పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చిన ఓ అభ్యర్థినిని అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో పరీక్ష రాయలేకపోయానని ఆమె ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. ఈ క్రమంలో పోలీసు సిబ్బంది ఆమెకు సపర్యలు చేశారు. ఈ దృశ్యాన్ని చూసిన సదరు అభ్యర్థిని బిడ్డ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దృశ్యం అక్కడి వారిని కదిలించింది.
Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు
Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు

శభాష్.. పోలీస్

అటు, కొన్ని కేంద్రాల్లో పోలీసులు అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా సాయం చేశారు. దుండిగల్‌లో ఓ అభ్యర్థిని పొరపాటున తన పరీక్షా కేంద్రానికి కాకుండా వేరే పరీక్షా కేంద్రానికి వెళ్లింది. దీంతో కన్నీళ్లు పెట్టుకోగా అక్కడే విధులు నిర్వహిస్తోన్న ఓ పోలీస్ సిబ్బంది విషయం తెలుసుకుని ఆ అభ్యర్థినిని తన బైక్‌పై ఆమె పరీక్షా కేంద్రానికి సకాలంలో తీసుకెళ్లారు. దీంతో పోలీస్ సిబ్బందిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, కీసరలో అభ్యర్థి పరీక్షా కేంద్రానికి రావడం ఆలస్యం కావడంతో.. ఇది గమనించిన ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య అతన్ని పెట్రోలింగ్ వాహనంలో గీతాంజలి ఇంజినీరింగ్ పరీక్షా కేంద్రానికి సకాలంలో తీసుకొచ్చారు. దీంతో ఆ అభ్యర్థి సజావుగా పరీక్ష రాయగలిగారు.
Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు
Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు

Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు
Gorup 1 Exams: ఆ ఒక్క 'నిమిషం' - ఏళ్ల కలను చిదిమేసింది, గుండెలు పిండేసే దృశ్యాలు

ప్రశాంతంగా ముగిసిన పరీక్ష

రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు క్వాలిఫై కాగా వీరిలో అత్యధికులు పరీక్షకు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. తొలి రోజు జనరల్ ఇంగ్లీష్ పేపర్ పరీక్ష నిర్వహించారు. మంగళవారం నుంచి ఈ నెల 27 వరకూ  వివిధ సబ్జెక్టుల ప్రకారం పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆందోళనలు కొనసాగుతోన్న క్రమంలో పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్నీ కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ విధించారు. పరీక్ష గది, చీఫ్ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పరిస్థితిని సమీక్షించారు. హైదరాబాద్ జిల్లాలో 5,163 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 4,896 మంది హాజరయ్యారు. 

అటు, గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో అన్ని అంశాలు స్పష్టంగా చెప్పిందని.. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోవడం సరికాదని పేర్కొంది. పలితాల విడుదలకు ముందే తుది విచారణ ముగించాలని ఉన్నత న్యాయస్థానానికి సూచించింది.

Also Read: Telangana Jobs: బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న రేవంత్ రెడ్డి - అన్ని లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget