అన్వేషించండి

Telangana Revenue Dept: తెలంగాణలో ఎగబాకిన రెవెన్యూ ఛార్జీలు.. నేటి నుంచే అమల్లోకి..

కొద్ది రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల ప్రభుత్వ విలువలు, స్టాంపు డ్యూటీనీ పెంచిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో నెల రోజుల క్రితం భూముల విలువను భారీగా పెంచిన ప్రభుత్వం తాజాగా రిజిస్ట్రేషన్ ఫీజులు, ఇతర రెవెన్యూ శాఖ సంబంధిత ఛార్జీలను భారీ స్థాయిలో పెంచింది. సొసైటీల రిజిస్ట్రేషన్‌ ఛార్జీలతో పాటు, చిట్‌ ఫండ్‌లకు సంబంధించిన రుసుములను ప్రభుత్వం పెంచింది. పెరిగిన కొత్త ధరలన్నీ గురువారం (సెప్టెంబరు 2) నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు బుధవారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల ప్రభుత్వ విలువలు, స్టాంపు డ్యూటీనీ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా అందించే వివిధ సేవలను కూడా ప్రభుత్వం భారీగా పెంచింది. గతంలో సొసైటీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే అందుకోసం ఛార్జీ రూ.500 చెల్లించాల్సి వచ్చేది. తాజాగా ఆ ధర రూ.2 వేలకు పెరిగింది. సొసైటీల పత్రాల ఫైలింగ్‌కు గతంలో రూ.300 ఉన్న ఛార్జీలను ఇప్పుడు ఏకంగా రూ.వెయ్యి చేశారు. అగ్రిమెంట్‌ ఆఫ్‌ సేల్‌, జీపీఏలకు గతంలో రూ.2 వేలు ఉండగా తాజాగా దీనికి కనిష్ఠం రూ.5 వేలుగా గరిష్ఠంగా  రూ.లక్షగా నిర్ణయించారు. 

Also Read: YS Vijayalakshmi Meet: వైఎస్ విజయలక్ష్మి ఆత్మీయ భేటీ నేడే, దీని వెనుక రాజకీయం అదేనా..? జగన్, షర్మిల హాజరవుతారా..?

వీలునామా రిజిస్ట్రేషన్‌కు రూ.3 వేలు, వీలునామా విచారణ, వీలునామా సీల్డ్ కవర్‌ డిపాజిట్‌, వీలునామా సీలు తెరవడం వంటి వాటికి రుసుమును రూ.5 వేలుగా పేర్కొన్నారు. ఇంటి వద్ద రిజిస్ట్రేషన్‌ చేసే ఛార్జీలు గతంలో రూ.వెయ్యి ఉండగా తాజాగా రూ.10 వేలకు ఎగబాకింది. ఐదుగురు కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ మంది ఉంటే ప్రతి అదనపు సభ్యుడికి మరో రూ.వెయ్యి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, 75 ఏళ్ల పైబడి వృద్ధులకు ప్రైవేటు అటెండన్సీ ఫీజును రూ.5 వేలుగా నిర్ణయించారు. సర్టిఫైడ్‌ కాపీ, ఎన్‌కంబ్రాన్స్ సర్టిఫికేట్ (ఈసీ)లకు గతంలో రూ.200 ఉండగా ప్రస్తుతం రూ.500కు పెరిగింది. సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్‌కు ఫీజును రూ.5 వేలుగా నిర్ణయించారు.  అంతేకాక, తండ్రి, తల్లి, భర్త, భార్య, సోదరుడు, అక్క, కొడుకు, కుమార్తె, తాత, అమ్మమ్మ, నానమ్మ, మనుమలు, దత్తత తీసుకున్న కుమారుడు, లేదా కుమార్తె తదితరులను కుటుంబ సభ్యులుగా పేర్కొన్నారు.

Also Read: AP Telangana Breaking: వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు.. అన్న పక్కనే కూర్చున్న షర్మిల

Also Read: Covid Vaccine for Children: పిల్లలకూ కొవిడ్ వ్యాక్సిన్ దిశగా కీలక ముందడుగు.. హైదరాబాదీ సంస్థకు అనుమతులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు

వీడియోలు

Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
Embed widget