అన్వేషించండి

Rythu Bharosa Scheme Guidelines: రైతు భరోసా పథకం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం, తెలుగులోనే ఉత్తర్వులు

Rythu Bharosa Guidelines | తెలంగాణ ప్రభుత్వం జనవరి 26న రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.12 వేల రూపాయలు అందించనుంది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది.

Guidelines for Rythu Bharosa scheme in Telangana | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఈనెల 26 వ తేదీ నుంచి అన్నదాతలకు రైతు భరోసా పథకిం అందించనుంది. రాష్ట్రంలోని రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించడానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. భూ భారతి పోర్టల్‌ (Bhu Bharati Portal)లో నమోదైన రైతులు వ్యవసాయం చేస్తున్న భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించనున్నారు. ఈ మేరకు రైతు భరోసాపై తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో ఆర్టీ నంబర్ 18 / తేదీ 10-01-2025) జారీ చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతులకు సంబంధించిన అంశాలు సరళంగా అర్థం కావాలన్న ఉద్దేశంతో రైతు భరోసా జీవోను తెలుగులో వెలువరించింది. గతంలో రుణమాఫీ మార్గదర్శకాలపైన తెలుగులో జీవో జారీ చేయడం తెలిసిందే.  #RythuBharosa

జనవరి 26న రైతు భరోసా అమలు

తెలంగాణ ప్రభుత్వం వ్వవసాయాన్ని లాభసాటిగా చేయడానికి నిర్ణయాలు తీసుకుంటుందని.. రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని రైతు భరోసా కింద రూ. 12 వేలు ఇవ్వనుందని అధికారులు తెలిపారు. రైతులకు పంట పెట్టుబడి సాయంతో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటించడానికి, అవసరమైన వనరులను సేకరించడానికి వీలుంటుందని తాజా ఉత్తర్వులలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం "రైతు భరోసా" పథకాన్ని జనవరి 26 నుంచి అమలు చేయనుంది. 

రైతుభరోసా పథకం (Rythu Bharosa)లోని ముఖ్యాంశాలు:

3.1 రైతు భరోసా స్కీమ్ కింద పంట పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి ఎకరాకు రూ.12,000 కు పెంచాం.

3.2 భూభారతి (Dharani To Bhu Bharati Portal) పోర్టల్ లో నమోదైన వ్యవసాయ భూమి విస్తీర్ణం ఆధారంగా రైతుభరోసా సహాయం అందించాలి. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని పట్టాదారుల భూములను రైతుభరోసా నుండి తొలగించాలి.

3.3 ROFR పట్టాదారులు కూడా రైతు భరోసా పంట పెట్టుబడికి అర్హులు.

3.4 ఆర్బీఐ నిర్వహించే DBT విధానంలో రైతు భరోసా సహాయం అన్నదాతల బ్యాంకు ఖాతాలో జమ చేయాలి.

3.5 రైతు భరోసా పథకాన్ని వ్యవసాయశాఖ సంచాలకులు, తెలంగాణ ప్రభుత్వం తరఫున అమలు చేస్తారు.

3.6 National Informatics Centre (నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్), IT భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తారు.


Rythu Bharosa Scheme Guidelines: రైతు భరోసా పథకం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం, తెలుగులోనే ఉత్తర్వులు

3.7  తమ జిల్లాకు సంబంధించిన రైతు భరోసా పథకం అమలుతో పాటు ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా కలెక్టర్లు బాధ్యులుగా ఉంటారు.

4. వ్యవసాయశాఖ సంచాలకులు ఈ పథకం అమలు విషయంలో తగు చర్యలు తీసుకోవాలి.

5. 2909660-A/06/A1/EBS.II/2025, తేదీ 10.01.2025 తో జారీ చేశారు

(తెలంగాణ గవర్నరు ఉత్తర్వు మేరకు ఏపిసి అండ్ ప్రభుత్వ కార్యదర్శి యం.రఘునందన్ రావు రైతు భరోసాకు సంబంధించి ఉత్వర్వులు జారీ చేశారు.

.


Rythu Bharosa Scheme Guidelines: రైతు భరోసా పథకం మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం, తెలుగులోనే ఉత్తర్వులు

 

 

Also Read: Vande Bharat: రైల్వేశాఖ గుడ్ న్యూస్, సికింద్రాబాద్‌ - విశాఖపట్నం వందేభారత్‌ కోచ్‌లు రెట్టింపు, భారీగా పెరిగిన సీట్లు 

ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఎకరానికి రూ.15వేలు అని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు 3 వేలు తగ్గించి రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రైతు కూలీలకు ఇంకా రూ.12 వేలు ఇవ్వడం మొదలుపెట్టలేదని, ఏడాది పాలన పూర్తైనా నిర్ణయం కూడా తీసుకోలేదని మండిపడుతున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు

వీడియోలు

అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Sankranti 2026 Movies Telugu: హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
హిట్ ఆల్బమ్ లేని సంక్రాంతి సినిమాలు, BGM హోరులో పాటలను పక్కన పెట్టేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
Rule Changes From 1st January: పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
పాన్- ఆధార్ అనుసంధానం నుంచి ఎల్పీజీ వరకు.. జనవరి నుంచి అమలులోకి కొత్త రూల్స్!
Telugu Film Chamber : తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
Year Ender 2025: ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
ఈ సంవత్సరం టీమిండియా 5 అతిపెద్ద ఓటములు.. చేదు జ్ఞాపకాలకు గుడ్ బై!
MLC Nagababu: గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
Embed widget