అన్వేషించండి

Telangana Caste Census: తెలంగాణలో రెండోసారి సమగ్ర కుటుంబ సర్వే, రేవంత్ రెడ్డి మార్క్ నిర్ణయాలు ఉంటాయా?

Telangana News | తెలంగాణలో రెండోసారి సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమగ్ర కులగణనను నిర్ణయం తీసుకుంది. కుటుంబసర్వే రెండు నెలల్లో పూర్తి చేసి నివేదిక ఇవ్వనున్నారు.

Telangana CM Revanth Reddy | హైదరాబాద్‌: తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. తాజాగా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర శాసనసభలో సమగ్ర సర్వేపై తీర్మానం చేశారని తెలిసిందే. దాంతో ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి, కుల సర్వే నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరపనున్న ఈ ఇంటింటి సర్వేను 60 రోజుల్లో పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (Shanti Kumari) జీవో 18 జారీ చేశారు. ఈ సమగ్ర కుటుంబ సర్వేకు నోడల్ బాధ్యతలను ప్రణాళిక శాఖకు ప్రభుత్వం అప్పగించింది.

గతంలో తొలిసారి సమగ్ర కుటుంబ సర్వే

గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన కొత్తలో అప్పటి సీఎం కేసీఆర్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. ప్రతి కుటుంబం ఆర్థిక, సామాజిక, కుల, విద్య, ఉపాది లాంటి అంశాలపై సర్వే నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి జీవో జారీ చేయడంతో ఇంటింటా సర్వేకు లైన్ క్లియర్ అయింది. ఈసారి సర్వే ఫలితాలు స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం కీలకంగా మారతాయి.

అన్ని రంగాల్లో అవకాశాలు మెరుగు పరిచేందుకు సర్వే

రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారికి అన్ని రంగాల్లో అవకాశాలు మెరుగు పరచాలని సమగ్ర కుటుంబ సర్వేకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర వెనుకబడిన వర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధిలో మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ఇంటింటా సర్వే చేయాలని ఫిబ్రవరి 4న తెలంగాణ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని శాసనసభలో ఆమోదించారు. ఈ మేరకు సమగ్ర కుల సర్వే (Caste Census) చేసేందుకు బీసీ కమిషన్‌ కసరత్తు ప్రారంభించింది. కొత్తగా ఏర్పాటైన కమిషన్‌ ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి రిపోర్ట్ అందించనుంది. ఇతర రాష్ట్రాల్లో చేసిన అధ్యయనాలు, బిహార్‌లో చేపట్టిన కుల సర్వే, బీసీ కమిషన్లు అనుసరించిన ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం పరిశీలించింది. 

సమగ్ర కులగణన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు
కుల సర్వే వెంటనే చేపట్టాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి బీసీ కమిషన్‌ సమావేశంలో ఆదేశించగా.. అందుకు తగినంత యంత్రాంగం లేదని బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ నిరంజన్‌ తెలిపారు. ఈ క్రమంలో ప్రణాళిక విభాగంతో కలిసి సర్వే నిర్వహించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. 60 రోజుల్లోగా సర్వే పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. సమగ్ర కుల గణన అనంతరం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. కులగణననై ప్రభుత్వం ఉత్తర్వులపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేయడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Also Read: Rains Latest Update: మరికొన్ని గంటల్లో అల్పపీడనం - ఏపీలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో మోస్తరు వర్షాలతో ఎల్లో అలర్ట్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Sridhar Babu Morphed Videos: మంత్రి శ్రీధర్ బాబు దంపతులను సైతం వదలని సైబర్ నేరగాళ్లు! ఏఐ మార్ఫింగ్ వీడియోలపై ఫిర్యాదు
మంత్రి శ్రీధర్ బాబు దంపతులను సైతం వదలని సైబర్ నేరగాళ్లు! ఏఐ మార్ఫింగ్ వీడియోలపై ఫిర్యాదు
Akhil Raj: ఫుడ్ డెలివరీ బాయ్‌పై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో దాడి... అఖిల్ రాజ్ వీడియో వైరల్
ఫుడ్ డెలివరీ బాయ్‌పై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో దాడి... అఖిల్ రాజ్ వీడియో వైరల్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Breaking News: పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Embed widget