అన్వేషించండి

Telangana Caste Census: తెలంగాణలో రెండోసారి సమగ్ర కుటుంబ సర్వే, రేవంత్ రెడ్డి మార్క్ నిర్ణయాలు ఉంటాయా?

Telangana News | తెలంగాణలో రెండోసారి సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమగ్ర కులగణనను నిర్ణయం తీసుకుంది. కుటుంబసర్వే రెండు నెలల్లో పూర్తి చేసి నివేదిక ఇవ్వనున్నారు.

Telangana CM Revanth Reddy | హైదరాబాద్‌: తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. తాజాగా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర శాసనసభలో సమగ్ర సర్వేపై తీర్మానం చేశారని తెలిసిందే. దాంతో ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి, కుల సర్వే నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరపనున్న ఈ ఇంటింటి సర్వేను 60 రోజుల్లో పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (Shanti Kumari) జీవో 18 జారీ చేశారు. ఈ సమగ్ర కుటుంబ సర్వేకు నోడల్ బాధ్యతలను ప్రణాళిక శాఖకు ప్రభుత్వం అప్పగించింది.

గతంలో తొలిసారి సమగ్ర కుటుంబ సర్వే

గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన కొత్తలో అప్పటి సీఎం కేసీఆర్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. ప్రతి కుటుంబం ఆర్థిక, సామాజిక, కుల, విద్య, ఉపాది లాంటి అంశాలపై సర్వే నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వేకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ సీఎస్ శాంతికుమారి జీవో జారీ చేయడంతో ఇంటింటా సర్వేకు లైన్ క్లియర్ అయింది. ఈసారి సర్వే ఫలితాలు స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం కీలకంగా మారతాయి.

అన్ని రంగాల్లో అవకాశాలు మెరుగు పరిచేందుకు సర్వే

రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారికి అన్ని రంగాల్లో అవకాశాలు మెరుగు పరచాలని సమగ్ర కుటుంబ సర్వేకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర వెనుకబడిన వర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధిలో మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ఇంటింటా సర్వే చేయాలని ఫిబ్రవరి 4న తెలంగాణ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని శాసనసభలో ఆమోదించారు. ఈ మేరకు సమగ్ర కుల సర్వే (Caste Census) చేసేందుకు బీసీ కమిషన్‌ కసరత్తు ప్రారంభించింది. కొత్తగా ఏర్పాటైన కమిషన్‌ ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి రిపోర్ట్ అందించనుంది. ఇతర రాష్ట్రాల్లో చేసిన అధ్యయనాలు, బిహార్‌లో చేపట్టిన కుల సర్వే, బీసీ కమిషన్లు అనుసరించిన ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం పరిశీలించింది. 

సమగ్ర కులగణన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు
కుల సర్వే వెంటనే చేపట్టాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి బీసీ కమిషన్‌ సమావేశంలో ఆదేశించగా.. అందుకు తగినంత యంత్రాంగం లేదని బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ నిరంజన్‌ తెలిపారు. ఈ క్రమంలో ప్రణాళిక విభాగంతో కలిసి సర్వే నిర్వహించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. 60 రోజుల్లోగా సర్వే పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. సమగ్ర కుల గణన అనంతరం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. కులగణననై ప్రభుత్వం ఉత్తర్వులపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేయడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Also Read: Rains Latest Update: మరికొన్ని గంటల్లో అల్పపీడనం - ఏపీలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో మోస్తరు వర్షాలతో ఎల్లో అలర్ట్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Telangana Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ దూరం - రెండు స్థానాలు ఏకగ్రీవమే !
రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ దూరం - రెండు స్థానాలు ఏకగ్రీవమే !
Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
Telangana CM Revanth : 99 రోజుల ప్రణాళికపై సీఎం రేవంత్ దృష్టి - ఈ కార్యక్రమంతో ఏం సాధించాలనుకుంటున్నారు?
99 రోజుల ప్రణాళికపై సీఎం రేవంత్ దృష్టి - ఈ కార్యక్రమంతో ఏం సాధించాలనుకుంటున్నారు?

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Eng 2nd Semi Final: సంజూ సెంచరీ మిస్.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ రికార్డ్ స్కోరు.. ఇంగ్లాండ్‌కు బిగ్ టార్గెట్
సంజూ సెంచరీ మిస్.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ రికార్డ్ స్కోరు.. ఇంగ్లాండ్‌కు బిగ్ టార్గెట్
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
India Condoles Khamenei Death: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
Operation Decapitation: ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
Mrithyunjay OTT : మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Speaker chit chat: వైసీపీ సభ్యులు సభకు వస్తేనే మసాలా - జగన్ జీతం తీసుకోవడం లేదు - స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు
వైసీపీ సభ్యులు సభకు వస్తేనే మసాలా - జగన్ జీతం తీసుకోవడం లేదు - స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు
Embed widget