అన్వేషించండి

Telangana paddy cultivation reduction: తెలంగాణ వరికి కేంద్రం బ్రేక్ - 25 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింపు టార్గెట్.. రైతులకు పంటల మార్పిడి సెగ!

Telangana Rice production:తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం, దిగుబడి సవాల్‌గా మారింది. గోదాముల్లో నిల్వలు పేరుకుపోతుండటం, ఇతర నిత్యావసర పంటల కొరత ఏర్పడుతూండటంతో పంటల మార్పిడికి కేంద్రం టార్గెట్ పెట్టింది.

Oil palm and pulses cultivation Telangana:   తెలంగాణ గడ్డపై పారుతున్న జలకళతో వరి సాగు రికార్డులు సృష్టిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి కళ్లెం వేసేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా వరి సాగును తగ్గించి, ఆ స్థానంలో నూనెగింజలు, పప్పుధాన్యాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్రం భారీ ప్రణాళికను ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 2.5 కోట్ల ఎకరాల్లో వరి సాగును తగ్గించాలని నిర్ణయించగా, అందులో ఏకంగా 10 శాతం అంటే 25 లక్షల ఎకరాలు బాధ్యతను ఒక్క తెలంగాణకే అప్పగించడం ఇప్పుడు రాష్ట్ర వ్యవసాయ రంగంలో కలకలం రేపుతోంది.

 తెలంగాణపైనే ఎందుకు ఈ భారం?                        

గడిచిన మూడేళ్లలో తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం 16 లక్షల ఎకరాల మేర పెరిగి, ప్రస్తుతం 133 లక్షల ఎకరాలకు చేరుకుంది. ఏటా సుమారు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది. యాంత్రీకరణ పెరగడం, ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఉండటంతో పాటు రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ. 500 బోనస్  పథకం రైతులకు వరిపై మరింత మక్కువ పెంచింది. ఫలితంగా కేంద్ర గోదాముల్లో ధాన్యం నిల్వలు నిండిపోయి, కొత్త పంటను నిల్వ చేసేందుకు స్థలం లేని పరిస్థితి ఏర్పడింది. ఈ  కారణంగానే ప్రతి ఏటా 5 లక్షల ఎకరాల చొప్పున  వరిని తగ్గించాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది.

 ధాన్యం ఎక్కువ.. పప్పులు తక్కువ!                      

రాష్ట్రంలో ఒకవైపు వరి నిల్వలు పేరుకుపోతుంటే, మరోవైపు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మన అవసరాలకు సరిపడా ఇవి ఇక్కడ ఉత్పత్తి కాకపోవడంతో మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. అందుకే వరిని తగ్గించి, ఆ భూముల్లో ఆయిల్ పామ్, పప్పుధాన్యాలు , వాణిజ్య పంటలు వేయడం ద్వారా రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించవచ్చని కేంద్రం సూచిస్తోంది.

 రైతులకు సవాల్‌గా మారనున్న పంటల మార్పిడి                 

అయితే, దశాబ్దాలుగా వరి సాగుకే అలవాటు పడిన రైతులకు ఇది పెద్ద పరీక్షగా మారనుంది. వరి పంటకు ఉన్న మార్కెటింగ్ సౌకర్యం, నీటి లభ్యత ఇతర పంటలకు ఉంటుందా? అన్నది రైతుల ప్రధాన సందేహం. కేవలం ఆదేశాలతోనే వరి సాగు తగ్గదని, ప్రత్యామ్నాయ పంటలకు గ్యారెంటీ ధర స కొనుగోలు భరోసా కల్పిస్తేనే ఈ లక్ష్యం సాధ్యమవుతుందని వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్రం నిర్దేశించిన ఈ భారీ టార్గెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వరి తగ్గించి ఇతర పంటల వైపు రైతులను మళ్లించడం వల్ల మార్కెట్‌లో సమతుల్యత వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులను ఒప్పించడం అంత సులభం కాకపోవచ్చు. ఏదేమైనా, తెలంగాణ వ్యవసాయం ఇప్పుడు వరి  నీడ నుంచి బయటకు వచ్చి  వాణిజ్య బాట పట్టాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana paddy cultivation reduction: తెలంగాణ వరికి కేంద్రం బ్రేక్ - 25 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింపు టార్గెట్.. రైతులకు పంటల మార్పిడి సెగ!
తెలంగాణ వరికి కేంద్రం బ్రేక్ - 25 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింపు టార్గెట్.. రైతులకు పంటల మార్పిడి సెగ!
Breaking News: అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం ఖరారు.. ట్రంప్ సంతకం కోసం వెయిటింగ్
అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం ఖరారు.. ట్రంప్ సంతకం కోసం వెయిటింగ్
Telangana govt land monetization: భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
Heatwave In AP And Telangana: వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Advertisement

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana govt land monetization: భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
Janasena vs Nageshwar: మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
YS Jagan national politics shift: SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
Heatwave In AP And Telangana: వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Saravanan Leader OTT: ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
Revanth Reddy unveils NTR statue: కాంగ్రెస్ సీఎం అయితే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయకూడదా? - ఇందిరమ్మతో పోల్చిన రేవంత్
కాంగ్రెస్ సీఎం అయితే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయకూడదా? - ఇందిరమ్మతో పోల్చిన రేవంత్
Pre Diabetic Care : ప్రీ-డయాబెటిస్, మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే.. షుగర్ పెరగవచ్చు జాగ్రత్త
ప్రీ-డయాబెటిస్, మధుమేహం ఉన్నవారు తినకూడని పండ్లు ఇవే.. షుగర్ పెరగవచ్చు జాగ్రత్త
IPL 2026 Qualifier-2  GT vs RR Preview: క్వాలిఫైయర్ 2 లో GT వర్సెస్ RR : ఫైనల్ టికెట్ కోసం హోరాహోరీ పోరు.. పిచ్ రిపోర్ట్, టాస్ కీలకం
క్వాలిఫైయర్ 2 లో GT వర్సెస్ RR : ఫైనల్ టికెట్ కోసం హోరాహోరీ పోరు.. పిచ్ రిపోర్ట్, టాస్ కీలకం
Embed widget