అన్వేషించండి

Khammam Students: టెన్త్ విద్యార్థులను చితకబాదిన టీచర్ - మార్కులు తక్కువ వచ్చాయని అమానుషం

Khammam News: విద్యార్థులకు మార్కులు తక్కువ వచ్చాయనే నెపంతో ఓ ఉపాధ్యాయుడు వారిపై దారుణంగా ప్రవర్తించాడు. వారిని విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.

Teacher Hit Tenth Students Severly in Khammam: విద్యార్థులను బిడ్డల్లా చూసుకోవాల్సిన ఓ టీచర్ వారి పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయనే కారణంగా వారిని విచక్షణా రహితంగా కొట్టాడు. దీంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడగా.. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఖమ్మం (Khammam) జిల్లాలో జరిగింది. తిరుమలాయపాలెం (Tirumulayapalem) మండలంలోని మాదిరిపురం అడ్డ రోడ్డు వద్ద ఉన్న తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో 62 మంది పదో తరగతి విద్యార్థులు చదువుతున్నారు. వారికి తెలుగు ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రావు ఇటీవల గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు. ఈ క్రమంలో పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయంటూ మంగళవారం రాత్రి 25 మంది విద్యార్థులను డస్టర్ తో విచక్షణా రహితంగా కొట్టాడు. వారి వీపులు ఎర్రగా కమిలి వాతలు తేలిపోయాయి. దీనిపై కొందరు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో సమీపంలో ఉన్న చంద్రుతండాకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలుకు చేరుకుని ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఎస్సై గిరిధర్ రెడ్డి బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడారు. వారి ఫిర్యాదు మేరకు టీచర్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

'మమ్మల్ని టార్గెట్ చేశారు'

తెలుగు టీచర్ లక్ష్మణ్ రావు మమ్మల్ని టార్గెట్ చేస్తూ ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. 100 మార్కులకు 51 నుంచి 71  వరకూ వచ్చినా.. మార్కులు తక్కువ వచ్చాయనే సాకుతో చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై కక్ష పెంచుకున్నారని.. ఇప్పటికైనా ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు, విద్యార్థుల తల్లిదండ్రులు సైతం టీచర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాల్సింది పోయి ఇలా విచక్షణా రహితంగా కొట్టడం ఏంటని ప్రశ్నించారు. వారి కోపం పిల్లలపై చూపడం సరికాదని.. అధికారులు సదరు ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.

Also Read: Telangana News: 18 ఏళ్ల నిరీక్షణకు తెర - దుబాయ్ లో జైలుశిక్ష అనుభవిస్తున్న తెలంగాణ వాసులకు విముక్తి

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Embed widget