అన్వేషించండి

Students Suicide: రోజురోజుకూ పెరిగిపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలు - చదువు ఒత్తిడే కారణం

Students Suicide: చదువు ఒత్తిడి భరించలేక అనేక మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతూ.. కన్నవారికి కన్నీటిని మిగులుస్తున్నారు. 

Students Suicide: ఈ మధ్య కాలంలో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రోజుకో వార్త దర్శనం ఇస్తుంది. చదువు ఒత్తిడితో కొందరు చనిపోతుంటే, వ్యక్తిగత కారణాలతో మరికొంత మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. బాగా చదివి తమను బాగా చూసుకుంటారని కలల కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. మంగళవారం రోజే యూనివర్సిటీల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఒకరు, ఐఐటీ హైదరాబాద్ లో మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. 

బాసర ట్రిపుల్ ఐటీలో ఉరివేసుకున్న బబ్లూ

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన జాదవ్ బబ్లూ పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే హాస్టల్ ఉండే అతడు అక్కడే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడని.. అధికారులు చెబుతున్నారు. అయితే బబ్లూ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తల్లిదండ్రులకు తెలియజేయగా.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి అరగంట ముందే కుమారుడు ఫోన్ చేసి.. నేను బాగున్నాను డాడీ అని చెప్పాడని.. అంతలోనే ఏమైందో ఆత్మహత్య చేసుకున్నాడంటూ బబ్లూ తండ్రి గుండెలవిసేలా రోదించాడు. 

ఐఐటీ హైదరాబాద్ లోనూ ఉరివేసుకొని విద్యార్థి ఆత్మహత్య

ఐఐటీ హైదరాబాద్ లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మమైతా నాయక్ ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ లో ఉంటూ చదివే ఈమె కూడా తన గదిలోని ఫ్యానుకు ఉరి వేసుకుంది. ఆమె ఒడిశా రాష్ట్రానికి చెందిన విద్యార్థినిగా గుర్తించారు. అయితే జులై 26వ తేదీన ఈమె క్యాంపస్ కు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఏం జరిగిందో తెలియదు గానీ ఒరియా, ఇంగ్లీషులో సూసైడ్ లెటర్ రాసి పెట్టి మరీ బలవన్మరణానికి పాల్పడింది. చదువు ఒత్తిడి కారణంగానే ఆమె బలవన్మరణం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆత్మహత్యకు పూర్తి బాధ్యత తనదేనని కూడా మమైతా నాయక్ లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు వివరిస్తున్నారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఐఐటీ హైదరాబాద్ యూనివర్సిటీలో ఇప్పటి వరకు ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించినట్లు సమాచారం. 2022-23 ఏడాది వ్యవధిలోనే నలుగురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఓ విద్యార్థి వైజాగ్ వెళ్లి అక్కడ బీచ్‌లో సూసైడ్ చేసుకున్నాడు.  

ఐఐటీ హైదరాబాద్ విద్యార్ధుల ఆత్మహత్యలు ఇవే..

హైదరాబాద్ ఐఐటీలో ఆత్మహత్యలు ఆగడం లేదు. దాదాపు ఏడాదిలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. గతేడాది ఆగస్టు 31న ఏపీ నంద్యాల జిల్లాకు చెందిన విద్యార్థి రాహుల్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే ఏడాది సెప్టెంబర్ 6న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కి చెందిన ఐఐటీ పూర్వ విద్యార్థి మేగ్ కపూర్ సంగారెడ్డిలో ఓ హోటల్‌పై నుంచి కిందికి దూకి బలన్మరణానికి పాల్పడ్డాడు. జులై 17వ తేదీన క్యాంపస్ నుంచి బయటికి వెళ్లిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ వైజాగ్‌లో శవమై తేలాడు. మంగళవారం ఒడిశాకు చెందిన మమైతా నాయక్ క్యాంపస్‌ హాస్టల్‌ రూమ్‌లో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు ప్రాణాలు తీసుకోకూడదని అధికారులు చెబుతున్నారు. చదువు ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలని సూచిస్తున్నారు. అంతగా నచ్చకపోతే.. తమకు ఇష్టమైన రంగానికి వెళ్లాలే తప్ప ఇలాంటివి చేయకూడదని వివరిస్తున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య దారుణం, భారత్ జోక్యం చేసుకోవాలి: అసదుద్దీన్ ఒవైసీ
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య దారుణం, భారత్ జోక్యం చేసుకోవాలి: అసదుద్దీన్ ఒవైసీ
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
Iran New Supreme Leader: ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
Nawab Cafe OTT : ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
Affordable Mileage Bikes: 70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
Vishnu Vinyasam Box Office Collection : శ్రీవిష్ణు విష్ణు విన్యాసం డీసెంట్ కలెక్షన్స్ - రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
శ్రీవిష్ణు విష్ణు విన్యాసం డీసెంట్ కలెక్షన్స్ - రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
Embed widget