అన్వేషించండి

Students Suicide: రోజురోజుకూ పెరిగిపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలు - చదువు ఒత్తిడే కారణం

Students Suicide: చదువు ఒత్తిడి భరించలేక అనేక మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతూ.. కన్నవారికి కన్నీటిని మిగులుస్తున్నారు. 

Students Suicide: ఈ మధ్య కాలంలో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రోజుకో వార్త దర్శనం ఇస్తుంది. చదువు ఒత్తిడితో కొందరు చనిపోతుంటే, వ్యక్తిగత కారణాలతో మరికొంత మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. బాగా చదివి తమను బాగా చూసుకుంటారని కలల కన్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. మంగళవారం రోజే యూనివర్సిటీల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఒకరు, ఐఐటీ హైదరాబాద్ లో మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. 

బాసర ట్రిపుల్ ఐటీలో ఉరివేసుకున్న బబ్లూ

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన జాదవ్ బబ్లూ పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే హాస్టల్ ఉండే అతడు అక్కడే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాలతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడని.. అధికారులు చెబుతున్నారు. అయితే బబ్లూ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తల్లిదండ్రులకు తెలియజేయగా.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి అరగంట ముందే కుమారుడు ఫోన్ చేసి.. నేను బాగున్నాను డాడీ అని చెప్పాడని.. అంతలోనే ఏమైందో ఆత్మహత్య చేసుకున్నాడంటూ బబ్లూ తండ్రి గుండెలవిసేలా రోదించాడు. 

ఐఐటీ హైదరాబాద్ లోనూ ఉరివేసుకొని విద్యార్థి ఆత్మహత్య

ఐఐటీ హైదరాబాద్ లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మమైతా నాయక్ ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ లో ఉంటూ చదివే ఈమె కూడా తన గదిలోని ఫ్యానుకు ఉరి వేసుకుంది. ఆమె ఒడిశా రాష్ట్రానికి చెందిన విద్యార్థినిగా గుర్తించారు. అయితే జులై 26వ తేదీన ఈమె క్యాంపస్ కు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఏం జరిగిందో తెలియదు గానీ ఒరియా, ఇంగ్లీషులో సూసైడ్ లెటర్ రాసి పెట్టి మరీ బలవన్మరణానికి పాల్పడింది. చదువు ఒత్తిడి కారణంగానే ఆమె బలవన్మరణం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆత్మహత్యకు పూర్తి బాధ్యత తనదేనని కూడా మమైతా నాయక్ లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు వివరిస్తున్నారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఐఐటీ హైదరాబాద్ యూనివర్సిటీలో ఇప్పటి వరకు ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించినట్లు సమాచారం. 2022-23 ఏడాది వ్యవధిలోనే నలుగురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఓ విద్యార్థి వైజాగ్ వెళ్లి అక్కడ బీచ్‌లో సూసైడ్ చేసుకున్నాడు.  

ఐఐటీ హైదరాబాద్ విద్యార్ధుల ఆత్మహత్యలు ఇవే..

హైదరాబాద్ ఐఐటీలో ఆత్మహత్యలు ఆగడం లేదు. దాదాపు ఏడాదిలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. గతేడాది ఆగస్టు 31న ఏపీ నంద్యాల జిల్లాకు చెందిన విద్యార్థి రాహుల్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే ఏడాది సెప్టెంబర్ 6న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కి చెందిన ఐఐటీ పూర్వ విద్యార్థి మేగ్ కపూర్ సంగారెడ్డిలో ఓ హోటల్‌పై నుంచి కిందికి దూకి బలన్మరణానికి పాల్పడ్డాడు. జులై 17వ తేదీన క్యాంపస్ నుంచి బయటికి వెళ్లిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కార్తీక్ వైజాగ్‌లో శవమై తేలాడు. మంగళవారం ఒడిశాకు చెందిన మమైతా నాయక్ క్యాంపస్‌ హాస్టల్‌ రూమ్‌లో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు ప్రాణాలు తీసుకోకూడదని అధికారులు చెబుతున్నారు. చదువు ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలని సూచిస్తున్నారు. అంతగా నచ్చకపోతే.. తమకు ఇష్టమైన రంగానికి వెళ్లాలే తప్ప ఇలాంటివి చేయకూడదని వివరిస్తున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Tata Advanced Systems Limited:  టాటాలో ఉద్యోగాలు.డైరక్ట్ వాక్ ఇన్ …  ఎప్పుడు.. ఎక్కడంటే.. ?
టాటాలో ఉద్యోగాలు.డైరక్ట్ వాక్ ఇన్ … ఎప్పుడు.. ఎక్కడంటే.. ?
Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్Klassen's glove error Rickelton Not out | IPL 2025 MI vs SRH మ్యాచ్ లో అరుదైన రీతిలో రికెల్టన్ నాట్ అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Tata Advanced Systems Limited:  టాటాలో ఉద్యోగాలు.డైరక్ట్ వాక్ ఇన్ …  ఎప్పుడు.. ఎక్కడంటే.. ?
టాటాలో ఉద్యోగాలు.డైరక్ట్ వాక్ ఇన్ … ఎప్పుడు.. ఎక్కడంటే.. ?
Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
Weather Hyderabad: ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత-  హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌  
ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత- హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌
Ramya Moksha Kancharla: అలేఖ్య కాదు... రమ్య మోక్ష పికిల్స్... కమ్ బ్యాక్ అనౌన్స్ చేసిన చిట్టి చెల్లెలు
అలేఖ్య కాదు... రమ్య మోక్ష పికిల్స్... కమ్ బ్యాక్ అనౌన్స్ చేసిన చిట్టి చెల్లెలు
MMTS Rape Case : ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
Holi party bill: హోలీ పార్టీ చేసుకుని బిల్లు ప్రభుత్వానికి పెట్టారు - చీఫ్ సెక్రటరీపై మండిపడుతున్న పార్టీలు
హోలీ పార్టీ చేసుకుని బిల్లు ప్రభుత్వానికి పెట్టారు - చీఫ్ సెక్రటరీపై మండిపడుతున్న పార్టీలు
Embed widget