Breaking News Telugu Live Updates: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు స్వర్ణం, మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్డేట్స్, వివరాలు మీకోసం
LIVE

Background
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు స్వర్ణం, మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్
Mirabai Chanu Wins Gold : కామన్వెల్త్ గేమ్స్ భారత్ స్వర్ణం సాధించింది. 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది.
కామెన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు స్వర్ణం, మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్
Mirabai Chanu Wins Gold : కామెన్వెల్త్ గేమ్స్ భారత్ స్వర్ణం సాధించింది. 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది.
తెనాలిలో రోడ్డు ప్రమాదం, లారీ ఢీకొని బాలుడు మృతి
Tenali Road Accident : గుంటూరు జిల్లా తెనాలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొనటంతో బాలుడు మృతి చెందాడు. కావాలి గ్రామానికి చెందిన కొండయ్య 14 ఏళ్ల బాలుడు తెనాలిలో బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన అక్కతో కలసి రోడ్డుపై యాచన చేస్తుండగా లారీ ఢీకొట్టింది. మధ్యాహ్నం సమయంలో యాచిస్తూ కొత్త వంతెన నుంచి మార్కెట్ వెళ్లే మార్గంలో వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనటంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ములుగులోని రైస్ మిల్లులో కూలీ అనుమానాస్పద మృతి
ములుగు జిల్లా : ములుగు (మం) జంగాల పల్లిలో ఓ రైస్ మిల్లులో బిహార్ కు చెందిన గుడ్డు అనే కూలీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రైస్ మిల్లులోని చెట్టుకు ఊరి వేసుకొని చనిపోయినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Jagtial: అధిక వడ్డీలతో ఫైనాన్స్ నడుపుతున్న ఇద్దరి అరెస్ట్
జగిత్యాల జిల్లా... కోరుట్ల సర్కిల్ పరిధిలో అధిక వడ్డీలతో అక్రమ ఫైనాన్స్ నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన కోరుట్ల పోలీసులు...
వారి వద్ద నుండి సుమారు 24 లక్షల రూపాయల నగదు, అప్పు పత్రాలు స్వాధీనం...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

