అన్వేషించండి

Venugopalachari in Congress : కాంగ్రెస్‌లో చేరిన వేణగోపాలా చారి - బీఆర్ఎస్‌కు షాకిచ్చిన సీనియర్ నేత

Telangana Politics : సీనియర్ నేత వేణుగోపాలాచారి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Senior leader Venugopalachari joined the Congress party :  బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. మూడు సార్లు ఎంపీగా పనిచేసిన సముద్రాల వేణుగోపాల చారి... వాజ్‌పెయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించారు. అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో  తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఐడీసీ) చైర్మన్‌గా ఆయనను 2022 డిసెంబర్‌లో  నియమించారు. 2023 జనవరి 5న తెలంగాణ నీటి పారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం మారే వరకూ ఆ పదవిలోనే ఉన్నారు.  

నిర్మల్ జిల్లాకు చెందిన వేణుగోపాలా చారి                                        

 నిర్మల్‌ జిల్లాకు చెందిన వేణుగోపాలాచారి 1985 నుంచి 1996 వరకు వరుసగా ఎమ్మెల్యేగా కొనసాగారు. 1995లో చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగుతూనే 1996లో ఆదిలాబాద్‌ ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. ప్రధానులు దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌ మంత్రి వర్గంలో సంప్రదాయేతర ఇంధన వనరులశాఖ, వ్యవసాయశాఖల మంత్రిగా సముద్రాల బాధ్యతలు నిర్వర్తించారు. 1998లో మరోసారి ఎంపీగా గెలిచి వాజపేయి ప్రభుత్వంలో కూడా కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో ఎంపీగా హ్యాట్రిక్‌ విజయం సాధించి 2004 వరకు అదే పదవిలో కొనసాగారు. 

2004 నుంచి రాజీయాల్లో వెనుకబడిన చారి                                    

2004లో ఆదిలాబాద్‌ ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. 2009లో కొత్తగా ఏర్పాటైన ముధోల్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేశారు. 2012లో టీడీపీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు. 2013లో బీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత 2014లో పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా సముద్రాలను సీఎం కేసీఆర్‌ నియమించారు. ప్రభుత్వం మారిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు వెళ్లిపోతున్నారు. పార్టీకి భవిష్యత్ ఉంటుందో లేదోన్న ఆందోళనతో  ముందుగానే ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు.  

కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అవకాశం                           

కేంద్ర మంత్రిగా పని చేసిన వేణుగోపాలా చారి చివరికి నామనేటెడ్ పోస్టులకు పరిమితయ్యారు. ప్రతీ సారి ఎన్నికల సమయంలో తనకు టిక్కెట్ లభిస్తుందని ఆయన ఆశిస్తూ ఉంటారు. ప్రతీ సారి నిరాశే ఎదురవుతోంది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో అనుచరగణం ఉన్న  వేణుగోపాలా చారి వల్ల కాంగ్రెస్ అభ్యర్థికి మేలు జరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget