అన్వేషించండి

Kishan Reddy : విజయవాడ-సికింద్రాబాద్‌ రూట్లో వందే భారత్‌ రైళ్లు, తిరుపతి వరకూ పొడిగించాలని కోరాం- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy : మూడు దశల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎయిర్ పోర్టు తరహాలో రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నామన్నారు.

Kishan Reddy : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.719.30 కోట్ల నిధులను కేటాయించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణపై నిర్వహించిన సమీక్షలో దక్షిణమధ్య రైల్వే జీఎం ఎ.కె.జైన్‌తో పాటు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 1874లో  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిర్మించారన్నారు. తెలంగాణలోనే ఇదే అతి పెద్ద రైల్వేస్టేషన్, హైదరాబాద్ లో 3 రైల్వేస్టేషన్ లు ఉన్నాయన్నారు. రద్దీని తగ్గించడం కోసం చర్లపల్లిలో మరొ టెర్మినల్ ప్రారంభించామన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను పూర్తిగా ఆధునీకరించనున్నారని తెలిపారు. 40 ఏళ్ల తరువాత వచ్చే ప్రయాణికుల తాకిడిని తట్టుకునే విధంగా రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. జీ + 4 కారు పార్కింగ్ తో పాటు 24 లిఫ్టులు, ఎక్సలేటర్లు, సీసీ కెమెరాల, వైఫై, అధునాతన రైల్వేస్టేషన్ గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. 

వరంగల్ లో వర్క్ షాప్ 

"దక్షిణ భారతదేశంలోనే బెస్ట్ రైల్వేస్టేషన్ గా సికింద్రాబాద్ స్టేషన్ ను రూపొందిస్తున్నాం. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు మూడు దశలలో పనులను పూర్తి చేయాలని అదేశాలు జారీచేశాం. 36 నెలలలో పనులను పుర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధమయ్యింది. రూ.384 కోట్లతో వరంగల్ లో 150 ఎకరాలలో వర్క్ షాప్ నిర్మాణం చేపడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటే ఎంఎంటీఎస్ 2వ ఫేస్ పూర్తి చేసి హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలం.  ఎంఎంటీఎస్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను."- కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి 

విజయవాడ-సికింద్రాబాద్ మార్గంలో వందే భారత్ రైళ్లు 

ఎయిర్ పోర్టు తరహాలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రూ.719.30 కోట్లతో రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచామని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఈ నిధులతో రైల్వేస్టేషన్‌ ను పూర్తిగా ఆధునికీకరిస్తామన్నారు. దక్షిణ భారత్‌లో ఉత్తమ రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్‌ను తీర్చిదిద్దుతామని కిషన్ రెడ్డి వెల్లడించారు.  మూడు దశల్లో 36 నెలల్లో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. కాజీపేటలో రూ.384 కోట్లతో వ్యాగన్‌ వర్క్‌ షాప్‌ కోసం టెండర్లు పిలిచినట్లు తెలిపారు. దీని కోసం 150 ఎకరాల భూసేకరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. విజయవాడ-సికింద్రాబాద్‌ మార్గంలో వందే భారత్‌ రైళ్లు రాబోతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. వాటిని తిరుపతి వరకు పొడిగించాలని రైల్వేశాఖను కోరామన్నారు. 1300 కి.మీ మేర కొత్త లైన్ల కోసం భూసేకరణ జరుగుతోందన్నారు. 

Also Read : Raids On Rajagopal : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలంగాణ సర్కార్ సడెన్ షాక్ - సుశీ ఇన్‌ఫ్రాలో సర్వీస్ ట్యాక్స్ అధికారుల సోదాలు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
KCR Disqualification: అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?
అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
MK Stalin DMK Manifesto: మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
Visakhapatnam Crime News: భార్యలేని టైంలో యువతిని ఇంటికి పిలిచి హత్య, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో.. విశాఖలో దారుణం
భార్యలేని టైంలో యువతిని ఇంటికి పిలిచి హత్య, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో.. విశాఖలో దారుణం
IPL 2026 MI Vs KKR Result Update: ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
Most Cheapest Diesel SUVs: దేశంలోనే అతి తక్కువ ధరలో డీజిల్ ఆటోమేటిక్ SUV ఏది? టాప్ 5 కార్ల వివరాలివే
దేశంలోనే అతి తక్కువ ధరలో డీజిల్ ఆటోమేటిక్ SUV ఏది? టాప్ 5 కార్ల వివరాలివే
Embed widget