అన్వేషించండి

Kishan Reddy : విజయవాడ-సికింద్రాబాద్‌ రూట్లో వందే భారత్‌ రైళ్లు, తిరుపతి వరకూ పొడిగించాలని కోరాం- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy : మూడు దశల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎయిర్ పోర్టు తరహాలో రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నామన్నారు.

Kishan Reddy : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.719.30 కోట్ల నిధులను కేటాయించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణపై నిర్వహించిన సమీక్షలో దక్షిణమధ్య రైల్వే జీఎం ఎ.కె.జైన్‌తో పాటు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 1874లో  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిర్మించారన్నారు. తెలంగాణలోనే ఇదే అతి పెద్ద రైల్వేస్టేషన్, హైదరాబాద్ లో 3 రైల్వేస్టేషన్ లు ఉన్నాయన్నారు. రద్దీని తగ్గించడం కోసం చర్లపల్లిలో మరొ టెర్మినల్ ప్రారంభించామన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను పూర్తిగా ఆధునీకరించనున్నారని తెలిపారు. 40 ఏళ్ల తరువాత వచ్చే ప్రయాణికుల తాకిడిని తట్టుకునే విధంగా రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. జీ + 4 కారు పార్కింగ్ తో పాటు 24 లిఫ్టులు, ఎక్సలేటర్లు, సీసీ కెమెరాల, వైఫై, అధునాతన రైల్వేస్టేషన్ గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. 

వరంగల్ లో వర్క్ షాప్ 

"దక్షిణ భారతదేశంలోనే బెస్ట్ రైల్వేస్టేషన్ గా సికింద్రాబాద్ స్టేషన్ ను రూపొందిస్తున్నాం. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు మూడు దశలలో పనులను పూర్తి చేయాలని అదేశాలు జారీచేశాం. 36 నెలలలో పనులను పుర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధమయ్యింది. రూ.384 కోట్లతో వరంగల్ లో 150 ఎకరాలలో వర్క్ షాప్ నిర్మాణం చేపడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటే ఎంఎంటీఎస్ 2వ ఫేస్ పూర్తి చేసి హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలం.  ఎంఎంటీఎస్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను."- కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి 

విజయవాడ-సికింద్రాబాద్ మార్గంలో వందే భారత్ రైళ్లు 

ఎయిర్ పోర్టు తరహాలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. రూ.719.30 కోట్లతో రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచామని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఈ నిధులతో రైల్వేస్టేషన్‌ ను పూర్తిగా ఆధునికీకరిస్తామన్నారు. దక్షిణ భారత్‌లో ఉత్తమ రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్‌ను తీర్చిదిద్దుతామని కిషన్ రెడ్డి వెల్లడించారు.  మూడు దశల్లో 36 నెలల్లో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. కాజీపేటలో రూ.384 కోట్లతో వ్యాగన్‌ వర్క్‌ షాప్‌ కోసం టెండర్లు పిలిచినట్లు తెలిపారు. దీని కోసం 150 ఎకరాల భూసేకరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. విజయవాడ-సికింద్రాబాద్‌ మార్గంలో వందే భారత్‌ రైళ్లు రాబోతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. వాటిని తిరుపతి వరకు పొడిగించాలని రైల్వేశాఖను కోరామన్నారు. 1300 కి.మీ మేర కొత్త లైన్ల కోసం భూసేకరణ జరుగుతోందన్నారు. 

Also Read : Raids On Rajagopal : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలంగాణ సర్కార్ సడెన్ షాక్ - సుశీ ఇన్‌ఫ్రాలో సర్వీస్ ట్యాక్స్ అధికారుల సోదాలు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
IRCTC Tour Package: దుబాయ్, అబుదాబి వెళ్లాలనుకునేవారికి IRCTC టూర్ ప్యాకేజీ.. ఖర్చు, ప్లాన్ వివరాలివే
దుబాయ్, అబుదాబి వెళ్లాలనుకునేవారికి IRCTC టూర్ ప్యాకేజీ.. ఖర్చు, ప్లాన్ వివరాలివే
Hyderabad- Vijayawada National Highway: హైదరాబాద్ - విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణ, జాతీయ రహదారి 65 విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్
హైదరాబాద్ - విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణ, జాతీయ రహదారి 65 విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్
Royal Enfield Bullet Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 వచ్చేస్తోంది.. పవర్‌ఫుల్ ఇంజిన్‌, అద్భుతమైన ఫీచర్లు చూశారా
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 వచ్చేస్తోంది.. పవర్‌ఫుల్ ఇంజిన్‌, అద్భుతమైన ఫీచర్లు చూశారా
Advertisement

వీడియోలు

పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్
అబ్బాయిలకో న్యాయం?  అమ్మాయిలకో న్యాయమా?
3i Atlas interstellar object | 9 ఏళ్లలో 3 సార్లు.. భూమి కోసమా? సూర్యుడి కోసమా? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
IRCTC Tour Package: దుబాయ్, అబుదాబి వెళ్లాలనుకునేవారికి IRCTC టూర్ ప్యాకేజీ.. ఖర్చు, ప్లాన్ వివరాలివే
దుబాయ్, అబుదాబి వెళ్లాలనుకునేవారికి IRCTC టూర్ ప్యాకేజీ.. ఖర్చు, ప్లాన్ వివరాలివే
Hyderabad- Vijayawada National Highway: హైదరాబాద్ - విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణ, జాతీయ రహదారి 65 విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్
హైదరాబాద్ - విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణ, జాతీయ రహదారి 65 విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్
Royal Enfield Bullet Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 వచ్చేస్తోంది.. పవర్‌ఫుల్ ఇంజిన్‌, అద్భుతమైన ఫీచర్లు చూశారా
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 వచ్చేస్తోంది.. పవర్‌ఫుల్ ఇంజిన్‌, అద్భుతమైన ఫీచర్లు చూశారా
ISRO Gaganayan Vyomitra: గగనయాన్‌కు తొలిమెట్టు.. మానవరోబో వ్యోమిత్రను అంతరిక్షంలోకి పంపుతున్న ఇస్రో
గగనయాన్‌కు తొలిమెట్టు.. మానవరోబో వ్యోమిత్రను అంతరిక్షంలోకి పంపుతున్న ఇస్రో
Aadi Saikumar: ప్రభాస్ వల్ల 'శంబాల'కు ఫ్యాన్స్ సపోర్ట్... ఫ్లాపులు, సక్సెస్ రేట్‌పై ఆది సాయికుమార్ రియాక్షన్!
ప్రభాస్ వల్ల 'శంబాల'కు ఫ్యాన్స్ సపోర్ట్... ఫ్లాపులు, సక్సెస్ రేట్‌పై ఆది సాయికుమార్ రియాక్షన్!
Hyderabad Crime News: పీఎస్ ఎదుటే నిప్పంటించుకుని డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వ్యక్తి ఆత్మహత్య
పీఎస్ ఎదుటే నిప్పంటించుకుని డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వ్యక్తి ఆత్మహత్య
Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి
ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి
Embed widget