అన్వేషించండి

Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?

CM Revanth: పెట్టుబడుల సదస్సును ఫ్యూచర్ సిటీలో నిర్వహించాలని రేవంత్ నిర్ణయించారు. కానీ ఇప్పటికీ ఫ్యూచర్ సిటీ మాస్టర్ పాల్లాన్

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

CM Revanth Future City Dreams: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణను  ఫ్యూచర్ స్టేట్ అని ప్రకటించారు. తర్వాతా  ఫ్యూచర్ సిటీని ప్రకటించారు.  2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన భారీ ప్రణాళికలు ప్రకటించారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఫ్యూచ్ సిటీ ఇందులో ముఖ్యమైనవి. కానీ ఈ ప్రాజెక్టులు దేంట్లోనూ అడుగు ముందుకు పడలేదు.  ముచ్చెర్ల పల్లి ప్రాంతంలో 30,000 ఎకరాల్లో  ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని  విదేశీ పర్యటనల్లో ప్రచారం చేశారు.  పెద్ద ఎత్తున పెట్టుబడులతో రావాలని కోరారు. కానీ ఇప్పటికీ అక్కడ పెద్దగా పురోగతి కనిపించడం లేదు. 

సమగ్ర ప్రణాళిక కరవు 

ఫ్యూచర్ సిటీని 30వేల ఎకరాల్లో రేవంత్ ప్రకటించారు కానీ ఇప్పటి వరకూ మాస్టర్ ప్లాన్ లేదు. దీనికి కారణం పూర్తి స్థాయిలో భూసేకరణ జరగకపోవడమే. గత ప్రభుత్వం ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములతో ప్రస్తుతానికి కొన్ని కేటాయింపులు చేశారు. కానీ రేవంత్ భారీ ప్రణాళిక ప్రకారం ఇంకా భారీగా భూములు సేకరించాల్సి ఉంది. అలా సేకరించాలంటే రైతులకు అక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చూపించాలని అనుకుంటున్నారు.అందుకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి  వచ్చి రెండేళ్లు అయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ముగింపులో భాగంగా ఇన్వెస్టర్ల సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇన్వెస్టర్ల వద్ద ఫ్యూచర్ సిటీ ప్రమోషన్

హైదరాబాద్‌లో ఎలాంటి ప్రతిష్టాత్మకమైన సమావేశం అయినా  హైటెక్స్ లేకపోతే మరో  అదే స్థాయి  కన్వెన్షన్‌లోనో నిర్వహిస్తారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా నిర్మాణం ప్రారంభం కాని ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్నారు.  హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఉన్నాయి..అందుకే నాలుగో సిటీగా.. ఫ్యూచర్ సిటీని ప్లాన్  చేస్తున్నానని.. తరచుగా చెప్పేవారు. తెలంగాణలో పెట్టుబడులకు ప్రముఖ సంస్థలు వస్తే.. ముందుగా  ఫ్యూచర్ సిటీనే ఆప్షన్ గా  చెప్పేవారు. ఇప్పుడు అక్కడ కొన్ని సంస్థలకు భూముల కేటాయింపులు అయ్యాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అధారాటీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. స్కిల్ యూనివర్శిటీని నిర్మిస్తున్నారు.  ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. 
 
మరో సైబరాబాద్‌లా మార్చాలని కోరిక
 
హైదరాబాద్  మరో వైపు విస్తరించాలని రేవంత్ పట్టుదలగా ఉన్నారు.  10 సంవత్సరాల్లో 'న్యూయార్క్'లా మారేలా చేస్తామని చెబుతున్నారు.  ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఆకర్షించడం, నెట్-జీరో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకూ భారీ సంస్థల పెట్టుబడుల ప్రకటన రాలేదు. సీఎం  సింగరేణి కాలరీస్ ను  10 ఎకరాల్లో  కార్పొరేట్ గ్లోబల్ ఆఫీస్ నిర్మించాలని ఆదేశించారు . వాటితో పాటు మరికొన్ని ప్రభుత్వ సంస్థలే కార్యాలయాలు నిర్మించనున్నాయి. కానీ ఇప్పటి వరకూ అక్కడ ప్రైవేటు సంస్థల పెట్టుబడుల గురించి పెద్దగా ప్రకటనలు రాలేదు. 

రేవంత్ నేల విడిచి సాము చేస్తున్నారా?

అమరావతితో పాటు గుజరాత్, కర్ణాటకల్లో కూడా ఇలా ప్రత్యేక సిటీలు కట్టే ప్రణాళికలను అక్కడి ప్రభుత్వాలు అమలు చేసుతన్నాయి. రేవంత్ కూడా అలా ఓ సిటీని నిర్మించాలని అనుకుంటన్నారు.  అక్కడ ఇంకా ఏమీ లేకపోయినా ఇన్వెస్టర్ల  ఘనంగా సదస్సు నిర్వహించి భవిష్యత్ లో అక్కడే ఓ గొప్ప నగరం ఉండబోతోందని ఆయన పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించేందుకు గట్టి ప్రయత్నాలు చేయనున్నారు. ఆయన ఫలితాలు విజయవంతం అవ్వాలంటే ముందుకు ఫ్యూచర్ సిటీకి అవసరమైన భూములు సేకరించాలి. మాస్టర్ ప్లాన్ రెడీ చేయాలి. కానీ ముందుగానే రేవంత్ ఫ్యూచర్ సిటీని ట్రాక్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత సక్సెస్అవుతుందో మాత్రం అంచనా వేయడం కష్టంగా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ABP Desam Smart Ed Conclave 2026: స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
స్కిల్ ఉంటే ప్రపంచం నీ జేబులో ఉన్నట్టే: ABP Desam Smart Ed Conclave 2026లో నెక్ట్స్‌ వేవ్‌ సీఈవో రాహుల్‌!
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Telangana CPM: తెలంగాణ సీపీఎం గతమెంతో ఘనం - ఇప్పుడు నిర్వీర్యం - అంతా వీరభద్రమే చేశారా?
తెలంగాణ సీపీఎం గతమెంతో ఘనం - ఇప్పుడు నిర్వీర్యం - అంతా వీరభద్రమే చేశారా?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget