అన్వేషించండి

PM Modi : అవినీతి పరులను వదిలి పెట్టే ప్రశ్నే లేదు జైల్లో వైస్తాం - ప్రధాని మోదీ వార్నింగ్

PM Modi : అవినీతి పరుల్ని తప్పక జైలుకు పంపిస్తామని ప్రధాని మోదీ అన్నారు. సంగారెడ్డి విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించారు.

PM Narendra Modi :   మోదీ గ్యారంటీ అంటే అమలయ్యే గ్యారంటీ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.  సంగారెడ్డి జిల్లా(Sangareddy District) పటేల్‌గూడలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బహిరంగ మోడీ ఏమైనా చెబితే చేసి చూపిస్తాడని, ఆర్టికల్ 370(Article 370) రద్దు చేసి మాట నిలబెట్టుకున్నట్లు తెలిపారు. ఆర్టికల్ 370పై సినిమా కూడా రూపొందిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.  అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో కాంగ్రెస్‌ పార్టీ తనపై విమర్శలు చేస్తోందని ప్రధాని నరేంద్రమోదీ   అన్నారు. కుటుంబ పాలన సాగించేవారిలో అభద్రతా భావం ఎక్కువని చెప్పారు. సంగారెడ్డిలో భాజపా (BJP) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విజయ సంకల్ప సభ’లో ఆయన మాట్లాడారు. విదేశాల్లో తెలుగు ప్రజలు కీలక భూమిక పోషిస్తున్నారన్నారు. 

‘‘కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు కుటుంబ పార్టీలు పాలించాయి. ఆ పార్టీలు ఉన్నచోట ఆయా కుటుంబాలు బాగుపడ్డాయి. దోచుకోవడానికి వారికి ఏమైనా లైసెన్స్‌ ఉందా?
వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నా. కుటుంబ పార్టీల వల్ల ప్రతిభ ఉన్నవారికీ అన్యాయం జరుగుతోంది. యువతకు అవకాశాలు దొరకడం లేదు. మీ ఆశీర్వాదాలు, నమ్మకాన్ని వృథా కానివ్వను.. ఇది మోదీ గ్యారంటీ. ప్రజల నమ్మకాన్ని వమ్ము కానివ్వను. వారసత్వ నేతలకు భయం పట్టుకుంది. ఆ పార్టీల నేతలు సొంత ఖజానా నింపుతున్నారు. కుటుంబ పాలకుల అవినీతి దళాన్ని వెలికితీస్తున్నా. దోచుకున్న నల్లధనం దాచుకోవడానికే విదేశాల్లో ఖాతాలు తెరిచారని ఆరోపించారు. 
  
ఈ మేరకు విదేశాల్లో చాలామంది తెలుగు వారు ఉన్నారన్న మోడీ.. మన వాళ్లను విదేశాల్లో చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. అయోధ్య(Ayodhya) లో రాముడికి స్వాగతం పలికామని చెప్పారు. రామాలయంపై మోడీ గ్యారంటీ పూర్తి అయిందా.. లేదా? అని ప్రజలను అడిగారు. ఆర్థిక అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభించామంటూ.. ‘ఈ రోజు నేను మీకో గ్యారంటీ ఇస్తున్నా. రాసిపెట్టుకోండి’ అన్నారు. ప్రపంచంలో దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని చెప్పారు. ఈ మాట కూడా నిలబెట్టుకుంటాని, ఇది మోడీ గ్యారంటీ అని చెప్పారు. ఇక రూ.వేల కోట్ల అవినీతిని బయటపెడుతున్నందుకే తనపై విమర్శలు చేస్తున్నారన్నాని, తాను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. కుటుంబ పాలనతో రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని ప్రధాని ఆరోపించారు.
  
అలాగే కశ్మీర్ నుంచి తమిళనాడు వరకు కుటుంబ పాలన ఉన్న రాష్ట్రాల్లో కుటుంబాలే బాగుపడ్డాయని విమర్శలు చేశారు. మోడీని విమర్శించడమే సిద్ధాంతమపరమైన పోరాటమా? అని విపక్షాలను ప్రశ్నించారు. కొందరికి కుటుంబమే ముఖ్యం.. నాకు దేశం ముఖ్యమని చెప్పారు. కుటుంబ పార్టీలకు ఏమైనా లైసెన్స్ లు ఇచ్చారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ బాగుకోసమే వాళ్ల భాద అని, కుటుంబ వాదులు దేశ రాజకీయాల్లో యువతను ఎదగనీయలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మీ అశీర్వాదాలు వృథా కానివ్వను. ఇది మోడీ గ్యారంటీ’ అంటూ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. చివరగా భారత్ ప్రపంచానికి ఆశాకిరణంలా మారిందని చెప్పిన ప్రధాని.. భారత్ ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేర్చాలని సూచించారు.
 
ఇక మేమంతా మోదీ కుటుంబమే అని తెలంగాణ ప్రజలు(Telangana People) అంటున్నారని చెప్పారు. రాష్ట్ర యువత కలలను సాకారం చేస్తానని, 70 ఏళ్లలో కాంగ్రెస్‌ చేయలేని పనిని పదేళ్లలో చేసి చూపించామన్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఆ పార్టీలు కుమ్మక్కయ్యాయని ప్రజలందరికీ అర్థమైందని చెప్పారు. అవినీతిపరులను బీజేపీ అసలే వదిలిపెట్టదని, ఒక్కొక్కిరినీ జైల్లో పెట్టడం ఖాయమన్నారు. ఇక కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందని తెలిపారు.

 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
Telangana Cabinet Coordination Issues: జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలోని ఓ హోటల్‌లో సాంబార్‌లో బల్లి! సీజ్ చేసిన అధికారులు! 
ఆదిలాబాద్ జిల్లాలోని ఓ హోటల్‌లో సాంబార్‌లో బల్లి! సీజ్ చేసిన అధికారులు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Embed widget