అన్వేషించండి

Telangana News: 'ప్రజాపాలన'కు దరఖాస్తుల వెల్లువ - ఎక్కువ మంది అప్లై చేసిందే వాటికే!

Praja Palana: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం చేపట్టిన 'ప్రజాపాలన'లో భాగంగా భారీగా దరఖాస్తులు వచ్చాయి. 8 రోజులు పాటు సాగిన ప్రక్రియలో కోటికి పైగా అర్జీలు వచ్చాయి. పరిశీలన అనంతరం అర్హులకు లబ్ధి చేకూరనుంది.

Prajapalana Application Process Completed: తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక హామీల అమలు కోసం చేపట్టిన 'ప్రజాపాలన - అభయహస్తం' (Prajapalana) దరఖాస్తుల ప్రక్రియ శనివారంతో ముగిసింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకూ 8 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మొత్తం 1,24,85,383 అర్జీలు వచ్చాయి. అయితే, ఓ కుటుంబం నుంచి ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలని ప్రభుత్వం చెబుతున్నా.. అవగాహన లోపం, నిబంధనల్లో స్పష్టత లేక కొన్ని కుటుంబాల నుంచి ఒకటికి మించి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అన్ని దరఖాస్తుల ఎంట్రీని ఈ నెల 17 నాటికి పూర్తి చేసి.. అనంతరం అర్హతను బట్టి ఆయా పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

దరఖాస్తుల వెల్లువ

6 గ్యారెంటీల్లోని మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు గ్రామ, వార్డు డివిజన్ సభల్లో దరఖాస్తులు స్వీకరించారు. 5 గ్యారెంటీల పథకాల కోసం 1,05,91,636 దరఖాస్తులు రాగా, మిగిలిన అవసరాల కోసం 19,92,747 అప్లికేషన్స్ వచ్చాయి. శనివారం ఒక్క రోజే 16,90,000 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,769 పంచాయతీలు, 3,624 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సదస్సులు పూర్తయ్యాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే పదవీ బాధ్యతలు స్వీకరించిన రెండో రోజే సీఎం రేవంత్ రెడ్డి హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సహా, ఆరోగ్య శ్రీ పథకం బీమా మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచింది. మిగిలిన వాటి అమలు కోసం డిసెంబర్ 28 నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల కోసం భారీగా అర్జీలు వచ్చాయి. 15 శాతం అభయహస్తం గ్యారెంటీలకు సంబంధం లేని.. రేషన్ కార్డులు, భూ సమస్యలు ఉన్నాయి. తెల్ల కాగితాలపైనా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. 

వీటి కోసమే

'ప్రజాపాలన' దరఖాస్తుల ప్రక్రియలో ఎక్కువగా 'మహాలక్ష్మి' పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, ఇందిరమ్మ ఇళ్లుపైనే దరఖాస్తుదారులు ఎక్కువ ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. చాలా మంది తమ రేషన్ కార్డులు సొంతూరిలో ఉండడంతో అక్కడికి వెళ్లి అప్లికేషన్స్ సమర్పించారు. జిరాక్స్ అప్లికేషన్స్ సమర్పించిన వారికి అధికారులు ఫోన్లు చేసి రప్పించి మరీ కొత్త దరఖాస్తులు నింపించారు.

4 నెలలకోసారి

'ప్రజాపాలన'లో దరఖాస్తు చేయలేకపోయిన వారు ఆందోళన చెందాల్సిన పని లేదని ఇది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతీ 4 నెలలకోసారి ఈ కార్యక్రమం చేపడతామని.. తొలి విడతలో అప్లై చేసుకోని వారు రెండో విడతలో అర్జీలు సమర్పించవచ్చని తెలిపింది. గ్రామసభల్లో దరఖాస్తు ఇచ్చేందుకు వీలు పడని వాళ్లు స్థానిక తహసీల్దార్‌, ఎంపీడీవో, మున్సిపల్ ఆఫీస్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అందుకున్న దరఖాస్తులను స్క్రూట్నీ చేసే ప్రక్రియను అధికారులు చేపట్టారు. వీటిని ఆన్ లైన్ చేసే ప్రక్రియను ఈ నెల 17 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెటుకున్నారు. 

డీటీపీ ఆపరేటర్లకు శిక్షణ

వచ్చిన అప్లికేషన్‌లను ఆన్‌లైన్‌ చేయడానికి భారీగా డీటీపీ ఆపరేటర్లను నియమించింది ప్రభుత్వం. వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. ఇప్పుడు అందుబాటులో ఉన్న వారితో వేగంగా పని జరగకపోతే మరికొంతమందిని నియమించాలని కూడా భావిస్తోంది. ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం వారి అర్హతలను ఎలా నిర్ణయిస్తుందనే విషయంపై మాత్రం వివరాలు వెల్లడించలేదు. వచ్చే నెల నుంచి మహిళలకు 2500వేలు ఇస్తామని ప్రకటించిన వేళ అసలు ఎవరికి వస్తుంది ఈ పథకం కోసం ఎలాంటి అర్హతలు తెరపైకి తీసుకొస్తారనే ఉత్కంఠ ప్రజల్లో ఉంది. 

Also Read: Revanth Reddy: కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా రేవంత్‌ నియామకం, మరో 25 మందికి చోటు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Dussehra 2024: అక్టోబర్ 3 నుంచి బెజవాడ దుర్గ గుడిలో దసరా నవరాత్రులు ప్రారంభం
అక్టోబర్ 3 నుంచి బెజవాడ దుర్గ గుడిలో దసరా నవరాత్రులు ప్రారంభం
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Embed widget