అన్వేషించండి

Nizamabad Free Coaching Centre : పోలీసు కొలువుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Nizamabad Free Coaching Centre : తెలంగాణలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్లు జారీ అవుతున్న క్రమంలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ కల్పిస్తున్నామని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పోలీస్ శాఖలో కొలువుల కోసం నిజామాబాద్ లో ఉచిత శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.

Nizamabad Free Coaching Centre : తెలంగాణ ప్రభుత్వం 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు చెందిన సుమారు వెయ్యి మంది యువతీ యువకులకు పోలీస్ శాఖ కొలువుల కోసం నిజామాబాద్ లో ఉచిత శిక్షణ అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గానికి చెందిన యువత కోసం మంత్రి ప్రశాంత్ రెడ్డి తన సొంత ఖర్చులతో ముందస్తు శిక్షణ తరగతులను ఏర్పాటు చేయించారు. 850 మంది స్క్రీనింగ్ టెస్ట్ రాయగా, వారిలో మెరిట్ ఆధారంగా 461 మందిని గ్రూప్ ఎగ్జామ్స్ ముందస్తు శిక్షణ కోసం ఎంపిక చేశారు. వేల్పూర్ మండలం పడిగెల్ గ్రామంలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను సోమవారం మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు.

నిరుద్యోగ యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి 
        
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజమాబాద్ జిల్లాకు చెందిన నిరుపేద కుటుంబాల యువతకు కూడా న్యాయం జరగాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేయించామని అన్నారు. హైదరాబాద్ లో అందించే కోచింగ్ కు ఏమాత్రం తగ్గకుండా మరింత మెరుగైన మెటీరియల్ తో పాటు, నిష్ణాతులైన ఫ్యాకల్టీతో స్థానికంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయించామని చెప్పారు. సుమారు 57 పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా ప్రత్యేక యాప్ ను సిద్ధం చేయించామని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత అంకితభావం, పట్టుదల, ఏకాగ్రతతో చదువుతూ ఉచిత శిక్షణ తరగతులను ఉద్యోగాలు సాధించేందుకు అనుకూలంగా మలచుకోవాలని హితవు పలికారు. జిల్లా నుంచి, బాల్కొండ నియోజకవర్గం నుంచి అత్యధిక మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తే తమకు చెప్పలేనంత సంతృప్తి కలుగుతుందని, తాము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కినట్లు అవుతుందన్నారు.

గతంలో అన్యాయం 

తెలంగాణ అనేక కుట్రలు పన్ని ఇదివరకు ఆంధ్రాలో విలీనం చేశారని, అప్పటి నుంచి తెలంగాణ ఉనికి మసకబారుతూ ఒక్కో రంగం ఆంధ్రా పాలకుల చేతుల్లోకి వెళ్తూ వచ్చిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలను కొల్లగొడుతూ వలస పాలకులు తెలంగాణను దుర్భర స్థితిలోకి నెట్టివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల ఆలనా పాలనను విస్మరించారని, తెలంగాణలో సమకూరిన ఆదాయాన్ని ఆంధ్రా ప్రాంతం అభివృద్ధికి వినియోగించారని, చివరకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లోనూ తెలంగాణ యువతకు హైదరాబాద్ ఫ్రీజోన్ వంటి జీవోలను తెరపైకి తెచ్చి అమలు చేసిన కారణంగా తీవ్ర అన్యాయం జరిగిందని ఆక్షేపించారు. 

స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు 

 వీటిని గమనించిన కేసీఆర్ మలి విడత తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించారని మంత్రి గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో గడిచిన ఏడేళ్ల కాలంలోనే లక్షా 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం చేశామన్నారు. 2.25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో కొత్త పరిశ్రమలు ఏర్పాటవడం వల్ల ప్రైవేట్ రంగంలోనూ 16 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. తాజాగా 80 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నోటిఫికేషన్లు విడుదల చేయిస్తున్నారని చెప్పారు. కేవలం ఉద్యోగాల భర్తీయే కాకుండా, అవి స్థానికులైన తెలంగాణ బిడ్డలకే దక్కాలనే తపనతో ఏడాదిన్నరగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కొలువుల భర్తీలో స్థానికత అమలు కోసం రాష్ట్రపతి ఉత్తర్వులను సవరణ చేయించారని అన్నారు. ముఖ్యమంత్రి కృషి ఫలితంగా ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో 95 శాతం స్థానికులకే దక్కనున్నాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అయితే యువత స్థానిక కోటా ఉద్యోగాలతో పాటు జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగాలను కూడా దక్కించుకుని జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేయాలని సూచించారు. 

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
HYDRA Ranganath: హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Team India Equals Own World Record :  వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
Embed widget