అన్వేషించండి

Khammam News: జగన్‌తో మాజీ ఎంపీ పొంగులేటి భేటీ.. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో వేడి

పొంగులేటి తరఫున పార్టీ పెద్దలతో మాట్లాడతారా.. వేరే పార్టీకి రిఫర్ చేస్తారా.. లేక లైట్‌ తీసుకుంటారా? ఇప్పుడు ఇదే చర్చ ఖమ్మంలో నడుస్తోంది. జగన్, పొంగులేటి భేటీ ఇప్పుడు ఖమ్మంలో హాట్‌ టాపిక్‌.

ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ కావడం ఖమ్మం రాజకీయాలను వేడి పుట్టిస్తుంది. 2019 తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీలో ప్రాధాన్యత లభించలేదన్న అసంతృప్తితో ఆయన ఉన్నారు. ఏడాది కాలంగా పొంగులేటి పార్టీ మారుతారా..? అనే విషయంపై తీవ్ర చర్చ నడుస్తోంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తనదైన శైలిలో కార్యకర్తలను కాపాడుకుంటూ  సైలెంట్‌ అయిపోయారు. ఇప్పుడు ఎపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలవడం సంచలనంగా మారుతోంది. పార్టీ మారేందుకే జగన్‌ను కలిశారా..? లేక ఇతర విషయాలపై కలిశారా..? అనేది చర్చానీయాంశంగా మారింది. 

వైఎస్సార్‌సీపీతోనే రాజకీయ ప్రస్థానం..
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పొంగులేటి కాంట్రాక్టర్‌గా సుపరిచితుడు. 2012లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించడంతోపాటు తాను ఎంపీగా విజయం సాదించి సంచలనం సృష్టించారు. అప్పటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఎదిగారు. 2016లో జరిగిన పాలేరు ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సొంత పార్టీ నేతల ఓటమికి కారణమయ్యారని కేసీఆర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఫిర్యాదులతో  2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ కేటాయించలేదు. అయినప్పటికీ ఇప్పటి వరకు గులాభీ పార్టీలోనే కొనసాగుతున్నారు. 

వరుసగా ఒడిదుడుకులే..
2019 నుంచి సొంత పార్టీలో మాజీ ఎంపీ పొంగులేటిఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఆయనకు రాజ్యసభ టిక్కెట్‌ వస్తుందని, ఎమ్మెల్సీ వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. పొంగులేటి వర్గంగా ఉన్న కొందరు ప్రజాప్రతినిధులు సైతం వేరే గూటికి చేరారు. అయినప్పటికీ జిల్లాలో తరుచూ పర్యటిస్తూ తన వర్గంను కాపాడుకుంటున్నారాయన. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఈయన వల్లే కొందరు నేతలు క్రాస్‌ ఓటింగ్‌ చేశారని  జరిగిదంటూ ఆరోపణలు వచ్చాయి. బహిరంగసభలలోనే కొందరు రాష్ట్ర స్థాయి నేతలు ఈయనపై విమర్శలు చేశారు. దీంతో ఈయన కారులో కొనసాగుతారా లేక వేరే పార్టీ వైపు మొగ్గుతారా అన్న చర్చ నడిచింది. 

జగన్‌తో బేటి.. రాజకీయ కలవరం..
పొంగులేటి తన రాజకీయ ప్రస్థానం వైఎస్సార్‌సీపీతో ప్రారంభించడంతోపాటు జగన్‌మోహన్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే రెండేళ్లుగా పార్టీలో ప్రాధాన్యత తగ్గిన పొంగులేటి జగన్‌తో భేటి కావడం దుమారం రేపుతోంది. ఈ భేటీలో ఏం చర్చించారనే విషయంపై చర్చ నడుస్తోంది. జగన్‌కు కేసీఆర్‌ సన్నిహితుడనే విషయంలో పొంగులేటి గురించి కేసీఆర్‌కు వివరిస్తారా..? లేదా పార్టీ మారేందుకు జగన్‌ ఆశీస్సులు తీసుకున్నారా..? అనే విషయం తేలాల్సి ఉంది. జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

Also Read: BTech Student Suicide: ఈ చదువులు వద్దు.. ఒత్తిడి తట్టుకోలేక బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో ఏముందంటే..!

Also Read: Weather Updates: తెలంగాణను కమ్మేసిన దట్టమైన మేఘాలు.. ఏపీలో పెరిగిన చలి తీవ్రత, మళ్లీ అకాల వర్షాలు

Also Read: Horoscope Today 22 January 2022: ఈ రాశివారు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.. మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Also Read: AP PRC : ఏపీ పీఆర్సీ జీతాలు పెరుగుతాయా ? తగ్గుతాయా ? - పెన్షనర్లకు లాభమా ? నష్టమా ? ... ఏ టూ జడ్ ఎనాలసిస్ ఇదిగో..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Thatikonda Rajaiah vs Kadiyam Sri hari | కడియం కావ్య డమ్మీ అభ్యర్థి... నా యుద్ధం శ్రీహరిపైనే | ABPCM Jagan on YS Avinash Reddy | వివేకా హత్య కేసులో అవినాష్ నిర్దోషి అన్న సీఎం జగన్ | ABP DesamTirupati YSRCP MP Candidate Maddila Gurumoorthy| తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తితో ఇంటర్వ్యూSRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Embed widget