అన్వేషించండి

Munugode ByElections: ఆ నేతల్ని కలవాలంటే మునుగోడు వెళ్లాల్సిందే, మరోవైపు జోరుగా ప్రచారం

మునుగోడు ఉప సమరంపై ఇప్పుడు తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించాయి. ఇప్పటికే సభలు, సమావేశాలకు భువనగిరి జిల్లాతోపాటు పరిసర జిల్లాల కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు.

Munugode Bypolls: మునుగోడు ఉప ఎన్నికలకు అటు టీఆర్‌ఎస్, ఇటు బీజేపీ నాయకత్వంతోపాటు కాంగ్రెస్‌ పార్టీ సైతం ప్రత్యేకంగా ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. వీరంతా ఇప్పుడు మునుగోడులో మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్, ఉప ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి అధికారంలోకి రావాలని టీఆర్‌ఎస్‌ పార్టీ, తెలంగాణలో తన సత్తా చాటేందుకు మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాదించాలని బీజేపీ పార్టీ భావిస్తుండటంతో మునుగోడులో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు మునుగోడులోనే ఉంటూ క్యాంపెయినింగ్‌ చేస్తున్నారు
వంద మందికో ఇన్‌ఛార్జ్..
హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ సారి తన వ్యూహాన్ని మార్చింది. మునుగోడు (Munugode By Elections) స్థానాన్ని మరోమారు కైవసం చేసుకునేందుకు పక్కడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ఇందుకోసం మంత్రులను మండల ఇన్‌ఛార్జ్‌లుగా, ఎమ్మెల్యేలను గ్రామస్థాయి ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది. దీంతోపాటు సర్పంచ్, ఎంపీటీసీ, కౌన్సిలర్, కార్పోరేట్‌ స్థాయి నాయకులను కూడా ప్రచారంలో బాగస్వామ్యం చేస్తుంది. ప్రతి వంద మంది ఓటర్లకు ఓ ఇన్‌ఛార్జ్‌ను నియమించి ప్రచారం ముగిసే వరకు వారితో మమేకం కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి నల్గొండతోపాటు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మునుగోడుకు తరలిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం నగరానికి చెందిన కార్పోరేటర్లు మునుగోడుకు తరలివెళ్లగా ఎంపీటీసీ, సర్పంచ్‌లు సైతం మునుగోడుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 
రాష్ట్ర నాయకత్వంతోపాటు కేంద్రమంత్రులు..
తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాదించాలని భావిస్తున్న బీజేపీ పార్టీ అన్ని అస్త్రాలను ఉపయోగిస్తుంది . ఇప్పటికే రాష్ట్ర పార్టీకి చెందిన కీలక నాయకులు మునుగోడులో తిష్టవేయగా కేంద్ర మంత్రులను తరచూ ప్రచారానికి దించుతూ తమ సత్తాను చాటేందుకు సిద్దమవుతుంది. ఎన్నికల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ అందుకు కావాల్సిన వ్యూహాన్ని మార్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కేంద్ర మంత్రులు నేరుగా ప్రచారంలో పాల్గొననుండటంతో ఇటు ప్రోటోకాల్‌ ఇబ్బందులు కూడా ఉండవని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా వీలైనంత మంది మంత్రులను ప్రచారంలో భాగస్వాములుగా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు చేరికలపైనే బీజేపీ ప్రధానంగా దృష్టి సారించడం గమనార్హం. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ పార్టీ సైతం తన సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల నియమితులైన టీపీసీసీ మెంబర్లతోపాటు రాష్ట్ర నాయకత్వం పూర్తిగా మునుగోడులో ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఓటరును కలిసి వారిని తమవైపు తిప్పుకునేలా కాంగ్రెస్‌ పార్టీ వ్యూహం రచించింది. సానుభూతి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుని మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాదించాలని భావిస్తున్నట్లు చూస్తుంది. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నికలకు అటు ప్రజా ప్రతినిధులతోపాటు నాయకులు సైతం అక్కడే తిష్ట వేయడంతో వారిని కలవాలంటే అక్కడికే వెళ్లాలని ప్రజలు బావిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Meeseva Charges: తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?
తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?
Paadi Kaushik Reddy Controversy: కౌశిక్ రెడ్డికి వివాదాలు అలవాటుగా మారాయా? బీఆర్‌ఎస్‌కు నష్టమా? లాభమా?
కౌశిక్ రెడ్డికి వివాదాలు అలవాటుగా మారాయా? బీఆర్‌ఎస్‌కు నష్టమా? లాభమా?
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
Revanth vs Vijayasanthi: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!

వీడియోలు

PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
LSG vs DC Match Preview IPL 2026 | ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడనున్న లక్నో, ఢిల్లీ | ABP Desam
Irfan pathan on ACA Restrictions | ఐపీఎల్ పై అజమాయిషీనా..సొంత జట్టు ప్రయోజనాల కోసమా.? | ABP Desam
Cooper Connolly 72 vs GT IPL 2026 | పంజాబ్ కు మొదటి మ్యాచ్ లో వరంలా కూపర్ కాన్లే | ABP Desam
PBKS vs GT IPL 2026 Match Highlights | గుజరాత్ టైటాన్స్ పై మూడు వికెట్లతో పంజాబ్ విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Bhumana Karunakar Reddy : భూమ‌న నేతృత్వంలో మ‌త మార్పిడి! తనను క్రిస్టియన్ అని ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్‌!
భూమ‌న నేతృత్వంలో మ‌త మార్పిడి! తనను క్రిస్టియన్ అని ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్‌!
Ranabaali Leaks : రణబాలి వీడియో లీక్ - సీమ యాసలో విజయ్ దేవరకొండ డైలాగ్స్... ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
రణబాలి వీడియో లీక్ - సీమ యాసలో విజయ్ దేవరకొండ డైలాగ్స్... ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే
West Bengal Latest News:పశ్చిమబెంగాల్ ఎన్నికల వేళ దారుణం! మాల్దాలో న్యాయాధికారుల బందీ! సీజేఐ సీరియస్‌!
పశ్చిమబెంగాల్ ఎన్నికల వేళ దారుణం! మాల్దాలో న్యాయాధికారుల బందీ! సీజేఐ సీరియస్‌!
Telangana Meeseva Charges: తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?
తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?
Petro Price Hike: ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు తప్పదా? ముడి చమురు సెగ ఏ స్థాయిలో ఉందో తెలుసా?
ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు తప్పదా? ముడి చమురు సెగ ఏ స్థాయిలో ఉందో తెలుసా?
Amaravati: అమరావతికి అండగా నిలబడ్డ కేంద్రానికి మద్దతుగా ఇంటి ముందు దీపాలు వెలిగించండి! రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు!
అమరావతికి అండగా నిలబడ్డ కేంద్రానికి మద్దతుగా ఇంటి ముందు దీపాలు వెలిగించండి! రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు!
Target Harish Rao: తెలంగాణలో అందరి టార్గెట్ హరీష్ రావేనా - ట్రబుల్ షూటర్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఇదేనా?
తెలంగాణలో అందరి టార్గెట్ హరీష్ రావేనా - ట్రబుల్ షూటర్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఇదేనా?
Embed widget