అన్వేషించండి

MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం

Komatireddy Rajgopal Reddy | సొంత ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. నిధులు మొత్తం ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాకే పోతున్నాయని ప్రశ్నించారు.

Telangana Assembly Session | హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోందని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే నిధులు కేటాయిస్తూ, సాధారణ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదని ఆయన ఆక్షేపించారు. నిధులు మొత్తం ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం జిల్లాకే పోతున్నాయని బయట టాక్ నడుస్తోందని, నా మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఏం తప్పు చేశారు? అధికారంలో ఉండి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతే నేను ఎమ్మెల్యేగా ఉండటం అనవసరం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆకలి కోసం కోసం ఆత్మగౌరవం కోసం పోరాటం చేశాం..

అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ల పాటు సాగింది ఆకలి కోసం కాదు, ఆత్మగౌరవం కోసం. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ, ఆత్మగౌరవాన్ని వదులుకోరని ఈ ఉద్యమం నిరూపించింది. నాడు తెలంగాణ గొంతు వినిపించడం కోసం సొంత పార్టీని సైతం ఎదిరించి పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కొడంగల్ అభివృద్ధి గురించి, ఉత్తం కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా లిఫ్ట్ ఇరిగేషన్ల గురించి మాట్లాడుతున్నారు. కానీ, భట్టి విక్రమార్క అధ్యక్షతన ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండటం వల్ల ఏ పథకం వచ్చినా అక్కడికే పోతోందనే మాట వినిపిస్తోంది.


MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం

కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా మునుగోడుకు అన్యాయం..

నా మునుగోడు ప్రాంతంలో ఒక్క లిఫ్ట్ లేదు, కాల్వ లేదు, కనీసం చెరువులు కూడా లేవు. మన (కాంగ్రెస్) ప్రభుత్వం ఉండి కూడా నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే, ఒక ఎమ్మెల్యేగా మౌనంగా ఉండటం నేరం. నేను ఎవరి బెదిరింపులకు భయపడను, ప్రలోభాలకు లొంగను. నా ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఉండటం కూడా అనవసరమని భావిస్తున్నాను. కేవలం మంత్రుల నియోజకవర్గాలకే నిధులు పోతున్నాయి. నా నియోజకవర్గానికి నిధుల కోసం నేను మంత్రులు, సీఎం చుట్టూ తిరగాలా? మునుగోడు ప్రజలకు న్యాయం చేయలేకపోతే పదవి వల్ల ప్రయోజనం ఏముందని’ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు.

రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన అంశాలివే.. 

మంత్రుల నియోజకవర్గాల్లో మాత్రమే బిల్లులు వస్తున్నాయని, మిగిలిన నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు.

ప్రభుత్వం అంటే కేవలం మంత్రులు మాత్రమే కాదని, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం పట్ల సమాన బాధ్యత ఉండాలని ఆయన గుర్తు చేశారు.

నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ప్రతిసారీ మంత్రులు లేదా ముఖ్యమంత్రి చుట్టూ తిరగాలా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

మునుగోడు ప్రజలకు సాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందితే, ఒక శాసన సభ్యునిగా తన పదవిలో కొనసాగడం వ్యర్థమని రాజగోపాల్ రెడ్డి భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
LPG Cylinder Price Hike: మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సామాన్యులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధర.. నేడు హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Embed widget