అన్వేషించండి

KCR in Munugode: మునుగోడుకు సువర్ణావకాశం, నా గుండెల్లో పెట్టుకుంటా - 15 రోజుల్లోనే అన్నీ: కేసీఆర్

కత్తి ఒకరి చేతిలో పెట్టి యుద్ధాన్ని ఇంకొకడ్ని చేయమంటే చేస్తడా? అని కేసీఆర్ ప్రశ్నించారు. కాబట్టి అరాచక పాలన చేస్తున్న బీజేపీకి ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ అన్నారు.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మునుగోడు ప్రజలకు సువర్ణావకాశం వచ్చిందని, ఉప ఎన్నిక తీర్పుతో బీఆర్ఎస్‌కు పునాది రాయి ఇక్కడే పడుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ కార్యకర్తలకు, వామపక్ష పార్టీల కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కత్తి ఒకరి చేతిలో పెట్టి యుద్ధాన్ని ఇంకొకడ్ని చేయమంటే చేస్తడా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. అది సమంజసం కాదని, కాబట్టి అరాచక పాలన చేస్తున్న బీజేపీకి ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ అన్నారు. అన్ని ధరలు పెంచడంతో పాటు తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీకి ఓటు వేస్తే తాము కూడా ఏమీ చేయలేమని అన్నారు. బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. మునుగోడు నియోజకర్గంలోని చండూరు మండలం బంగారిగడ్డ వద్ద టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.

" ఎనిమిదేళ్లలో తెలంగాణ పచ్చబడ్డది. కొద్దిగా తెల్లబడ్డం. మంచిగ చేసుకుంటున్నం. తెలంగాణలాగానే దేశమంతా పాలన అందించేందుకు పుట్టుకొస్తున్నదే బీఆర్ఎస్ పార్టీ. మునుగోడు ప్రజలకు చాలా గొప్ప అవకాశం. చరిత్రలో సువర్ణావకాశం మునుగోడుకే దక్కింది. భారత దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పడానికి పునాది రాయి పెట్టే అవకాశం మునుగోడుకే దక్కింది. తెలంగాణ ఉద్యమానికి ముందు సిద్దిపేటలో 60 ఓట్ల మెజారిటీ సద్దిగట్టి తెలంగాణ పోరాటానికి పంపించిన్రు. ప్రభాకర్ రెడ్డిని గెలిపించే రూపంలో కేసీఆర్‌కు ఎంత పెద్ద సద్దిగడతరో అంత పెద్ద విజయం భారత దేశంలో వస్తది. దేశమే బాగుపడతది. రేపు కేసీఆర్ ఎంత పెద్దగా పెరిగిన బీఆర్ఎస్ పునాదిరాయి మునుగోడే కాబోతుంది. కాబట్టి, మునుగోడును నా గుండెల్లో పెట్టుకుంటా "
-కేసీఆర్

గాడిదలకు గడ్డి వేస్తే.. ఆవులకు పాలు వస్తయా
‘మౌనంగా ఉంటే.. ఆ మౌనమే శాపం అవుతుంది. ఈ వ్యవహారాన్ని ప్రతి విద్యావంతుడు, ప్రతి యువకుడు తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భం. దయచేసి మునుగోడులో విద్యాధికులు, కవులు, కళాకారులు, రచయితలు, అన్నదమ్ముళ్లు, అక్కాచెళ్లెల్లు అందరూ ఆలోచించుకోండి. మీ ఊరికి వెళ్లిన తర్వాత అందరూ చర్చించుకోండి. ఓటు వేసేటప్పుడు దేనికో ఆశపడి, ఎవడో చెప్పిండని మాయమాటకు లొంగపోకండి. ప్రలోభాలకు లొంగితే మంచి జరగదు. మనం పళ్లు తినాలంటే ముళ్ల చెట్లు పెడితే పళ్లు రావు. చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలే. ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి. గాడిదలకు గడ్డేసి.. ఆవులకు పాలు పిండితే పాలు రావు. గడ్డి వేసేటప్పుడే గాడిదకి వేస్తున్నామా? ఆవుకు వేస్తున్నమా? అని ఆలోచన చేయాలి’’


KCR in Munugode: మునుగోడుకు సువర్ణావకాశం, నా గుండెల్లో పెట్టుకుంటా - 15 రోజుల్లోనే అన్నీ: కేసీఆర్

వడ్లు కొనరు కానీ, ఎమ్మెల్యేలను కొనడానికి వస్తున్నరు - కేసీఆర్
తెలంగాణ వడ్లు కొనాలని అడిగితే చేతగాని కేంద్ర ప్రభుత్వం డబ్బు సంచులతో ఎమ్మెల్యేలను కొనేందుకు హైదరాబాద్ వచ్చిందని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. మునుగోడు నియోజకర్గంలోని చండూరు మండలం బంగారిగడ్డ వద్ద టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ‘‘మా పంట కొనాలని వడ్లు కొనాలని అడిగితే స్పందించరు కానీ, రూ.వందల కోట్లు సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనాలని వస్తరా? ఈ బీజేపీకి బుద్ధి చెప్పాలా? వద్దా? మీరంతా ఆలోచించాలి. వీటన్నింటికీ మీరు జవాబు చెప్పకపోతే వాళ్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తరు. మేం చేసేది ఏమీ ఉండదు. గ్యాస్ రేటు పెరిగింది.. పెట్రోల్ రేట్లు పెరిగాయి.. జీఎస్టీ ఎస్తున్నారు అని మనం కొట్లాడాలి. కత్తి ఒకరి చేతిలో పెట్టి యుద్ధాన్ని ఇంకొకడ్ని చేయమంటే చేస్తడా? వారి చేతిలో కత్తి పెడితే.. వాడు మన మెడ కోసేస్తడు. కాబట్టి, కత్తి ఒకడి చేతిలో పెట్టి యుద్ధాన్ని మరొకరిని చేయమంటే సమంజసం కాదు. ప్రజల ఆస్తులు కాపాడే పార్టీలను మీరు గౌరవిస్తే అందరం మంచిగుంటమని గమనించాలి.

మన భారత విద్యుచ్ఛక్తి సంస్థలు ఇన్నేళ్ల నుంచి రూ.లక్షల కోట్లతో ఒక వ్యవస్థలా ఏర్పడ్డాయి. అలాంటి సంస్థలను పేలాలు అమ్మినట్లుగా ప్రైవేటు సంస్థలకు ఇస్తరట. వాడు మళ్లీ మన దగ్గర్నుంచే డబ్బులు ముక్కు పిండి వసూలు చేస్తరు. అలాంటి వ్యవస్థలను ప్రైవేటు కార్పొరేటు గద్దలకు అప్పజెప్తమా? అందరూ ఆలోచించండి.

చర్లగూడెం ప్రాజెక్టును ఆపుతున్నది ఎవరు? ఒక రాష్ట్రం ఏర్పడితే.. ఒక ఊళ్లో ఇద్దరు అన్నదమ్ముళ్లు వేరుపడితే పెద్దలు ఏం చేస్తరు? గిది నీదిరా.. గిది నీదిరా అని పంచుతరు? నీళ్లలో మన వాటా ఇవ్వడానికి బీజేపీ పార్టీకి, ప్రధాని మోదీకి ఎనిమిదేళ్లు చాలలేదా? ఎందుకివ్వవు మోదీ? నోరు పెగలదు.. నోరు తెరవవు. నేను మహామొండి మీకు తెలుసు. మునుగోడులోని ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చే బాధ్యత నాది. ఎక్కడి వరకైనా కొట్లాడి.. తలపెట్టిన ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. వంద పడకల ఆసుపత్రి, చండూరు రెవెన్యూ డివిజన్ అనేవి చాలా చిన్నవి. ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లోనే మీ కోరిక నెరవేరుస్తా’’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Embed widget