అన్వేషించండి

Nalgonda: బొమ్మలిద్దామని ఎత్తుకుని తీసుకెళ్లిన తల్లి తనకు తెలియకుండానే చిన్నారిని మృత్యు ఒడికి చేర్చింది, ఏం జరిగిందంటే

ఆడుకునేందుకు బొమ్మలిద్దామని తీసికెళ్లిన ఆతల్లి తనకు తెలియకుండానే చిన్నారి మరణానికి కారణమైంది.నల్గొండ జిల్లా నాంపల్లి మండలం ముంపు గ్రామం లక్ష్మణాపురంలో జరిగిందీ ఘటన.

ఈ లోకంలోకి అడుగుపెట్టిన పది నెలలకే ఆ చిన్నారికి ఆయువు తీరిపోయింది. అమ్మ,నాన్న, అక్క, ఆటబొమ్మలు తప్ప ఇంకా మరో ప్రపంచం తెలియదు. కానీ ఆ ఆటబొమ్మలే తన మృత్యువుకి కారణం అవుతాయనుకోలేదు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం ముంపు గ్రామం లక్ష్మణాపురానికి చెందిన బాణావత్‌ గణేశ్‌-దివ్య దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆదివారం సాయంత్రం తమ పది నెలల కుమారుడు భవిత్‌ను ఆడిస్తోన్న తల్లి బొమ్మలిచ్చేందుకు ఎత్తుకుని కిటికీ దగ్గరకు తీసుకెళ్లింది. అయితే ఇంటిగోడలకు ప్లాస్టింగ్ లేకపోవడంతో వాటి మధ్యలో పాము దూరిఉన్న విషయం ఎవ్వరూ గమనించలేదు. కిటీకీ వైపు తిరిగి ఆమె బొమ్మలు తీస్తోంది. ఇంతలోనే తల్లి ఎత్తుకుని ఉన్న చిన్నారి కాలుపై తాచుపాము కాటేసింది. బాబు ఉలికిపాటు గమనించి ఏమైందంటూ అటు తిరిగేసరికి మరోసారి కాటేసింది పాము.

Also Read:తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా

ఏం జరిగిందో అర్థమయ్యేలోగా పదినెలల చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. ఆ తల్లి కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని వెంటనే ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. మార్గమధ్యలోనే భవిత్  చనిపోయాడు. ఆదివారం సాయంత్రం జరిగిందీ ఘటన. అప్పటికే చీకటి పడడంతో పాము బయటకు రాకుండా కాపలాకాసిన గ్రామస్తులు సోమవారం చౌటుప్పల్‌ నుంచి పాములు పట్టే వ్యక్తిని తీసుకొచ్చి దాన్ని పట్టుకున్నారు. అప్పటి వరకూ కేరింతల కొట్టిన చిన్నారి కొద్ది క్షణాల్లో కన్ను మూశాడంటే ఆ ఘటన నుంచి తల్లి ఇప్పట్లో తేరుకోగలదా. ఆమె కన్నీళ్లను ఆపడం ఎవ్వరివల్లా కావడం లేదు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో వానలే.. వానలు.. మరో రెండు రోజులు కూడా.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

సాధారణంగా వానాకాలంలో పాములు సంచారం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ చూసినా గడ్డి, పొదలు పేరుకుపోవడంతో అవి  స్వేచ్ఛగా తిరుగుతాయి. ఏటా వానాకాలంలోనే పాముకాటుకి గురయ్యే వారి సంఖ్య ఎక్కువే. వానలు పడినప్పుడు పుట్టలు, కలుగులు నీటితో నిండడంతో పాములు నీళ్లులేని పొడి ప్రదేశం కోసం వెతుకుతాయి. చిన్న కలుగు కనిపించినా ఆవాసంగా చేసుకోవాలని అనుకుంటాయి. అలాంటి సమయంలో మనుషులు ఎదురయ్యే సరికి కాటేస్తాయి. ఇలా పాము కాటుతో మరణిస్తున్నవారి సంఖ్య ఇండియాలోనే అత్యధికంగా ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు గతంలోనే వెల్లడించాయి.  ప్రధానంగా గ్రామీణప్రాంతాల్లో విషపురుగులు, పాములు అధికంగా సంచరిస్తుంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాటికి బలైపోవాల్సిందే.

Also Read:ఈ రాశులవారు కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూల సమయం…వారు మాత్రం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి..

Also read: ఈ వారం మూడు రాశులవారికి చాలా ప్రత్యేకం.. మిగిలిన రాశుల వారికి ఈ వారం ఎలా ఉందో చూడండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Shambhala Review : 'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Embed widget