అన్వేషించండి

KTR News: పాత బస్తీలో మెట్రో పక్కా కాస్త ఆలస్యం అంతే... టీపీసీసీ, టీబీజేపీ కేసీఆర్ భిక్ష... మంత్రి కేటీఆర్ కామెంట్స్

అభివృద్ధి విషయంలో కొత్త, పాత నగరాలని వివక్ష లేదని మంత్రి కేటీఆర్ శాసనసభలో తెలిపారు. పాత బస్తీలో మెట్రో రైలు వస్తుందన్నారు. కరోనా వల్ల కాస్త ఆలస్యమైందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో ఏ ప్రాంతంపై వివక్ష లేదని మంత్రి కేటీఆర్ శాసనసభలో తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీకి ఏడేళ్లలో రూ.14,897 కోట్లు ఖర్చు చేశామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గత ప్రభుత్వాలు రూ.3,934 కోట్లే ఖర్చు చేసిందని గుర్తుచేశారు. పాతబస్తీలో పెద్ద ఎత్తున రోడ్ల అభివృద్ధి జరుగుతోందన్న ఆయన.. అక్కడ కచ్చితంగా మెట్రో రైలు వస్తుందన్నారు. కరోనా పరిస్థితుల వల్ల పాతబస్తీకి మెట్రో రైలు కొంత ఆలస్యమైందని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్‌ రెండో దశ పనుల కోసం నిధులు కేటాయిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్టుకు మరో రూ. 100 కోట్లు కేటాయిస్తామని శాసనసభలో మంత్రి సమాధానం ఇచ్చారు. సెవెన్‌ టోంబ్స్‌, గోల్కొండ కోటను ప్రపంచ వారసత్వ హోదా తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని స్పష్టం చేశారు. మీర్‌ఆలం చెరువును దుర్గం చెరువులా అభివృద్ధి చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. సచివాలయంలో మసీదు, గుడి, చర్చి నిర్మాణాలు చేపడతామన్నారు. 

Also Read:  రిపబ్లిక్ సినిమా చూసిన రేవంత్ రెడ్డి, సీతక్క.. వారి స్పందన ఏంటంటే..

అభివృద్ధిలో కొత్త, పాత నగరాలని తేడా లేదు

తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్యక్రమం తీసుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఏ వివక్ష లేకుండా అమలు చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. ములుగును జిల్లా కేంద్రంగా చేస్తానని 2018 ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అనంతరం ఆ హామీ నెరవేర్చామని తెలిపారు. తర్వాత ములుగును జిల్లాగా ప్రకటించామని తెలిపారు. ఏ వివక్ష లేకుండా అభివృద్ధిని చేస్తున్నామని స్పష్టంచేశారు. స్వాతంత్య్రం వచ్చాక పాతబస్తీలో ఏ ప్రభుత్వం చేపట్టని స్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేపట్టిందన్నారు. చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్టుకు మరో వంద కోట్లైనా ఇచ్చేందుకు సిద్ధంమన్నారు. అభివృద్ధిలో పాత, కొత్త నగరాలని తేడా లేదన్నారు. ఎంఎంటీఎస్‌ రెండో దశ పనుల కోసం నిధులిస్తామని అసెంబ్లీలో కేటీఆర్ ప్రకటించారు. సచివాలయంలో మసీదు, గుడి, చర్చిలకు ఒకేసారి శంకుస్థాపన చేయనున్నట్లు స్పష్టం చేశారు. 

Also Read: ప‌ద్మశ్రీ అవార్డుల కోసం పేర్లు పంపాలా? వ‌ద్దా? కేంద్రంతో గలాటనే.. అసెంబ్లీలో కేసీఆర్

తిన్నది అరక్క పాదయాత్రలు

సీఎం కేసీఆర్‌ పాలన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బీజేపీ నేత బండి సంజయ్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. బండి సంజయ్ తిన్నది అరక్క పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. మతం ముసుగులో తెలంగాణను నాశనం చేసే ప్రతయ్నం చేస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియోతో మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్లలో 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీయే పాలించిందన్నారు. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. ఫ్లోరైడ్‌తో నల్గొండ అతలాకుతలం అయితే కాంగ్రెస్ ఏంచేసిందన్నారు. తెలంగాణ మొదటి ద్రోహి రేవంత్ రెడ్డి అన్న కేటీఆర్ జంగ్ లేదు బొంగు లేదు జంగ్ సైరన్ లేదని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్‌ రెడ్డి, మాణిక్కం ఠాగూర్‌కి రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నాడని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారని కేటీఆర్ స్పష్టంచేశారు. 

Also Read: రాంగ్‌ రూట్‌లో కేటీఆర్‌ కారు.. ఆపేసిన ట్రాఫిక్ పోలీస్.. చివరికి ఏమైందంటే..

ఆ పదవులు కేసీఆర్ పెట్టిన భిక్ష

టీపీసీసీ, తెలంగాణ బీజేపీ కేసీఆర్ పెట్టిన భిక్ష అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అలాంటి పెద్ద మనిషిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి నీరు ఇచ్చే పథకాన్ని కేంద్రం మెచ్చుకుందని కేటీఆర్ తెలిపారు. ఎవరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్న కేటీఆర్... సీఎం కేసీఆర్ దళిత బంధుని రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని చెప్పారని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

Also Read: మంత్రి కేటీఆర్ కారుకు చలాన్ వేసిన ట్రాఫిక్ సిబ్బంది... మంత్రి ఏంచేశారో తెలుసా..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
Revanth Master Plan: ప్రత్యర్థులను బాధితులను చేయని రేవంత్ రాజకీయం - అరెస్టులు లేకపోవడం వెనుక వ్యూహం ఇదే!
ప్రత్యర్థులను బాధితులను చేయని రేవంత్ రాజకీయం - అరెస్టులు లేకపోవడం వెనుక వ్యూహం ఇదే!
Harish Rao vs Revanth Reddy: హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్
హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Telangana News: భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు.. హైరైజ్ బిల్డింగ్స్‌ సహా టీడీఆర్‌తో అదనపు వెసులుబాట్లు
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
Bihar CM: బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
బిహార్ కొత్త సీఎంగా తెరపైకి నిశాంత్ కుమార్! నితీష్ కుమార్ సోదరుడి డిమాండ్.. ఇంతకీ ఎవరతను
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
భారత్‌లో కొత్త Skoda Kushaq Facelift లాంచింగ్.. క్రెటా, డస్టర్‌లకు గట్టి పోటీ తప్పదు
భారత్‌లో కొత్త Skoda Kushaq Facelift లాంచింగ్.. క్రెటా, డస్టర్‌లకు గట్టి పోటీ తప్పదు
Embed widget