అన్వేషించండి

KCR: 'అధికారం లేకున్నా ప్రజల కోసం పని చేయాలి' - గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసమన్న కేసీఆర్

Telangana Formation Day: అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసమే పని చేయాలని.. తెలంగాణ పరిరక్షణే ధ్యేయంగా కృషి చేద్దామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

KCR Speech In Formation Day Celebration In Telangana Bhawan: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పని చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో (Telangana Bhawan) నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మనకు మనమే కాదని.. ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు చెప్పుకోవాలని అన్నారు. కొన్ని క్షణాలు చాలా గొప్పగా ఉంటాయన.. కొన్ని క్షణాలు బాధగా ఉంటాయని చెప్పారు. అవి ఊహించుకుంటే ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేలా ఉందని పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణ వాది అని.. ఈ సమయంలో ఆయన్ను స్మరించుకోకుండా ఉండలేమని అన్నారు. '1999లో అంతకు ముందు కాలంలో తెలంగాణ అనుభవించిన బాధ ఊహించుకుంటే ఇప్పుడు దుఃఖం వచ్చే పరిస్థితి ఉంది. యావత్ తెలంగాణ కరువులు, వలసలు, కరెంట్ కోతలు, ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులకు నెలవుగా ఉండేది. సరైన వ్యూహం లేకపోవడం వల్లే 1969 ఉద్యమం విఫలమైంది. 2001లో కాదు. 1999లోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమ రూపాలు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఒళ్లు పులకరిస్తుంది.' అని గులాబీ బాస్ పేర్కొన్నారు.

'స్ట్రీట్ ఫైట్ కాదు.. స్టేట్ ఫైట్'

మన భాష మాట్లాడుతుంటే నవ్వుతారో ఏమో అనుకునే స్థాయి ఆనాడు ఉండేదని కేసీఆర్ అన్నారు. గతంలో తెలంగాణ అనే పదాన్ని పలకవద్దని అప్పటి స్పీకర్ అసెంబ్లీలో అన్నారని.. ఇక్కడి భాష స్వచ్ఛమైన తెలుగు కాదని కొందర హేళన చేశారని గుర్తు చేశారు. 'వలసలు పోతుంటే కనీసం ఆపలేదు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు. స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ అయితే చేస్తా అని వచ్చా. మళ్లీ ఉద్యమం నేను మొదలుపెట్టాను. అనేక పోరాటాల తర్వాత ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. పాతాళంలో ఉన్న తెలంగాణను పైకి తీసుకొచ్చాం. పాటతోనే మొత్తం తెలంగాణ చరిత్ర తెలిసేది. చరణంలోనే మొత్తం తెలవాలి. అందుకే తెలంగాణ పాటతో పుట్టింది.' అని అన్నారు.

'మళ్లీ గెలిచేది బీఆర్ఎస్‌నే'

25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండాది అని కేసీఆర్ అన్నారు. 'బీఆర్ఎస్ మహావృక్షం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక కొంత నైరాశ్యంలో ఉన్నాం. ఆ తర్వాత నేను బస్సు యాత్ర మొదలుపెట్టగానే మళ్లీ అదే గర్జన కనిపించింది. మోకాళ్ల ఎత్తు కూడా లేనోళ్లు ఏదేదో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఖతం అయితది అంటున్నారు. వందకు వంద శాతం మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. రైతు బంధు ఊరికనే ఇవ్వలేదు. స్థిరీకరణ కోసం ఇచ్చాం. చేప పిల్లలు, గొర్రెలు ఇస్తుంటే కూడా అవమానించారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేశాం. ఎన్ని చేసినా కొంత విష గాలి వస్తుంది. ఆ గాలికి జనం కొంత అటు వైపు మొగ్గుచూపారు. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసం. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పని చేయాలి. కరెంట్ విషయంలో ప్రభుత్వం తీరు బాధాకరం. రైతులకు విత్తనాలు గత పదేళ్లలో సక్రమంగా ఇచ్చాం. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు 105 అసెంబ్లీ సీట్లు వస్తాయ్. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ గెలిచాం. నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి విజయం ఖరారైంది. లోక్ సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినా ఇబ్బంది లేదు. నూతన ఉద్యమ పంధా అవివాహకరించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల పరిరక్షణే ధ్యేయంగా పనిచేద్దాం.' అని కేసీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
Telangana Cabinet Coordination Issues: జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలోని ఓ హోటల్‌లో సాంబార్‌లో బల్లి! సీజ్ చేసిన అధికారులు! 
ఆదిలాబాద్ జిల్లాలోని ఓ హోటల్‌లో సాంబార్‌లో బల్లి! సీజ్ చేసిన అధికారులు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Embed widget