అన్వేషించండి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డెంగీ కేసుల కలకలం, పదుల సంఖ్యలో నమోదు!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డెంగీ కలకలం సృష్టిస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జులై ఒక్క నెలలో 25 కేసులు రాగా, ఆగస్టులో 22 వరకు నమోదయ్యాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలను డెంగీ వణికిస్తోంది. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. జూన్ నుంచి పదుల సంఖ్యలో కేసు నమోదు అవుతుండడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా చర్యలకు సిద్ధం అవుతున్నారు. కరీంనగర్ పట్టణంలో అత్యధికంగా ఈ ఏడాదిలో 25 కేసులు నమోదు అయ్యాయి. మానకొండూరులో 22 గంగాధర తిమ్మాపూర్‌లో 13 కేసులు గుర్తించినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ సంవత్సరంలో 116 మందిలో డెంగీ లక్షణాలు కనిపించాయని, అయితే అనధికారికంగా వీరి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు నెలలో కేవలం సగం గడిచే వరకే 22 కేసుల వరకు నమోదు అయ్యాయి. ఈ సంఖ్య జులైలో 25గా ఉంది. జూన్ లో 18 మాత్రమే కేసులు వచ్చాయి. రెండేళ్ల కిందట గమనిస్తే కేవలం ఒకటి రెండు కేసులు మాత్రమే కనిపించేవి. కానీ ఈ సంవత్సరం ఈ స్థాయిలో కేసులు నమోదు అవుతూ ఉండడంతో ఇక తక్షణ చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధం అవుతున్నారు.

అసలు ఎందుకిలా పెరిగిపోతున్నాయి?

ఎన్నడూ లేని విధంగా జూలై నెలలో ఈసారి విపరీతమైన వర్షాలు కురిశాయి. జిల్లా అంతటా పల్లెలు, పట్నాలు తేడా లేకుండా వరద నీరు వ్యాపించింది. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత కూడా నీరు మాత్రమే నిలిచి ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో దోమల సంఖ్య విపరీతంగా పెరిగింది. పల్లెలు పట్టణాల్లో డ్రై డే నిర్వహిస్తూ చేస్తున్నప్పటికీ దోమలను పూర్తి స్థాయిలో నిర్మూలించడం కుదరడం లేదు. ఎప్పటికప్పుడు మురుగు నీరు తొలగించిన కూడా తిరిగి వర్షాలు కురుస్తుండటంతో దోమల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. మరోవైపు పట్టణాల్లో డ్రైనేజీలో నిర్వహణ అధ్వానంగా తయారవడంతో జ్వరాలు అధికంగా నమోదు అవుతున్నాయి. ఇక ఆయిల్ బాల్స్ వదలడం గంబూజియా చేపలు పెంచడం లాంటి చర్యలు చేపట్టడంలో ఆయా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలకు చెందిన అధికారులు విఫలం అవుతున్నారు.

కేవలం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో 350 పడకల సౌకర్యం ఉండగా ప్రతి రోజు ఆరు వందలకు పైగా రోగులు వస్తున్నారు. ఈనెల 15వ తారీఖున ఈ సంఖ్య 647 కాగా 16వ తారీకు ఆరు వందల ఎనిమిది మంది జ్వరం నిర్ధారణ కోసం వచ్చారు. అయితే చాలా వరకు పేషెంట్లు జ్వరానికి కావాల్సిన మందులు తీసుకొని తిరిగి ఇంటి బాట పడుతున్నారు. ఇక ప్రైవేటు ఆసుపత్రిలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ప్రతి ఆస్పత్రిలోనూ జ్వరంతో బాధ పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సాధారణ జ్వరాల కంటే డెంగీతో బాధ పడేవారికి చికిత్స కోసం వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. దీంతో సామాన్యుడి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

డెంగీ లక్షణాలు ఏంటి?

డెంగీ ఫీవర్ ఎడిస్ ఈజిప్టై అనే దోమ కాటు వల్ల వస్తుంది. నిజానికి దీనికి ఎలాంటి చికిత్స లేదు. మలేరియాకు సంబంధించి వాడే మందులనే దీనికి కూడా వాడుతారు. 101 నుంచి 105 డిగ్రీల ఫారన్‌హీట్ జ్వరం హఠాత్తుగా వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, నడుము కింది భాగంలో తీవ్రమైన నొప్పి, కళ్లు తీవ్రంగా నీరసం, తల తిరగడం, ముక్కు నుంచి రక్తస్రావం ఉంటుంది. దోమ కుడితే ఏర్పడే ఎర్రని చుక్కల వంటివి ఏర్పడతాయి. మండటం వంటి లక్షణాలు వస్తాయి. తీవ్రమైన ఒళ్లు నొప్పులు, కడుపులో తిప్పడం, వాంతులు, కుడి ఉదర భాగం పై వైపున నొప్పి వస్తుంది. 

ఉష్ణోగ్రత పెరిగినపుడు  వీలైనంత త్వరగా చికిత్స మొదలు పెట్టాలి. డెంగీతోపాటుగా రక్తస్రావం (డెంగీ హెమరేజిక్ ఫీవర్) లేదా రక్తపోటు అతి తక్కువకు పడిపోవడం, డెంగీ షాక్ సిండ్రోమ్‌లు కనిపిస్తే ప్రాణాంతకమే. ఇలాంటి వారు 5 శాతానికి అటు ఇటుగా ఉంటారు. 95 శాతం మందికి ప్రాణాంతకం కాదు. చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వీలైనంత వరకూ ఈ దోమ కాటు నుండి బయట పడవచ్చు మరోవైపు ఇది ఎక్కువగా పగటి పూట యాక్టివ్ గా  ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు దోమ కాటు నుండి దూరంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
Gadchiroli Viral News: గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
గడ్చిరోలిలో దారుణం! ప్రసవం కోసం 6 కిలోమీటర్లు నడిచి వెళ్లిన గర్భిణీ! బీపీ పెరిగి తల్లీ బిడ్డ మృతి
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Embed widget