అన్వేషించండి

Etela Rajender : కేసీఆర్ అరాచకాన్ని అడ్డుకునే శక్తి బీజేపీకి మాత్రమే ఉంది - ఈటల రాజేందర్

Etela Rajender : నా రాజ్యంలో నేను చెప్పిందే వేదం అన్నట్లు సీఎం కేసీఆర్ తీరు ఉందని ఈటల రాజేందర్ విమర్శించారు.

 Etela Rajender : రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ లను ప్రజలు నమ్మడం లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.  కరీంనగర్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశానికి  హాజరైన ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అధికార పార్టీ అరాచకాన్ని అడ్డుకునే శక్తి ఒక్క బీజేపీకి మాత్రమే ఉందన్నారు.  అందుకు ఉదాహరణ దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఎన్నికలన్నారు. కేవలం కొట్లాడితేనే ప్రజల్లో ఉండలేమని, వారి సమస్యలు కూడా పరిష్కరించే ప్రయత్నం చెయ్యాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందన్నారు. గవర్నర్ ఫోన్ కూడా టాప్ అవుతుంది అనే చెప్పుకొనే పరిస్థితి ఉందని ఆరోపించారు. రాజ్యాంగబద్ధ వ్యవస్థలను కూడా కేసీఆర్ పనిచేయనివ్వడంలేదన్నారు. నా రాజ్యంలో నేను చెప్పిందే వేదం అన్నట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. 

బియ్యం కొనం అని కేంద్రం చెప్పలేదు

కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు కాలేదని ఈటల రాజేందర్ విమర్శించారు. దళిత సీఎం చేయకపోగా దళిత ఉప ముఖ్యమంత్రిని అవమానకరంగా తీసేశారన్నారు. మూడు ఎకరాల భూమి ఇస్తా అని దళితులను మోసం చేశారని ఆరోపించారు. అంతేకాదు ఎప్పుడో ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా లాక్కుని రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దళిత బంధు రాష్ట్రం అంతా ఇస్తా అని హుజూరాబాద్ కి ఇచ్చి మిగతా వారికి ఇవ్వడంలేదన్నారు. గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా వారికి సంకెళ్లు వేసి జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ రాష్ట్రంలో దుర్మార్గ పాలన చేస్తున్నారు. లాభదాయంగా లేవని కేసీఆరే  సింగరేణి గనులు తీసుకోకుండా.. ఇప్పుడు కేంద్రాన్ని విమర్శిస్తున్నారన్నారు. బియ్యం కొనుగోలు చేయమని కేంద్రం ఏనాడూ చెప్పలేదని, ఉప్పుడు బియ్యం మాత్రమే వద్దు అని చెప్పారన్నారు. దాన్ని ఒప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు ధాన్యం కొనలేక ఆ నెపాన్ని కేంద్రం మీద నెడుతున్నారన్నారు. అబద్ధాన్ని కూడా నమ్మించగల మోసకారి కేసీఆర్ అన్నారు. కనీస మద్దతు ధర అమలు చేయకుండా రైతుల ఉసురు తీస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఒక్క రైతు బంధు ఇచ్చి మిగతా సబ్సిడీలు అన్నీ ఎత్తివేశారన్నారు. గుట్టలకు, పుట్టలకు మన చెమట పైసలు పంచిపెడుతూ రాచరికపు ఆలోచనలు చేస్తున్నారన్నారు. 

ప్రజల్లో ఉన్న వారికే టికెట్లు 

"కరీంనగర్ జిల్లా దేన్నైనా భరిస్తుంది కానీ రాచరికాన్ని సహించదు. తిరుగుబాటు బావుటా ఎగురవేసే సత్తా ఉన్న జిల్లా. తెలంగాణ ఉద్యమ బావుటా ఇక్కడ నుంచి ఎగిరింది. మళ్లీ ఆ పార్టీ పతనం ఇక్కడించే మొదలైంది. కేసీఆర్ వైఫల్యాలపై ప్రజా ఉద్యమం చేద్దాం. ఇతర పార్టీ నాయకులను బీజేపీలోకి ఆహ్వానించండి. బీజేపీకి అధికారం వచ్చే అవకాశం ఉంది కాబట్టే నాయకులు మన పార్టీకి వస్తున్నారు. ఎవరు వచ్చినా ప్రజల్లో ఉన్న వారికే ఎమ్మెల్యే టిక్కెట్లు. సర్వేల ఆధారంగానే టిక్కెట్లు ఇస్తారు. కరీంనగర్ జిల్లాలో ఇంకా మనం గేట్లు ఓపెన్ చెయ్యలేదు. ప్రజలు బీజేపీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ బీజేపీ ఏకు మేకు అయ్యిందని భావిస్తున్నారు. బీజేపీ నాయకుల మీద దాడులు చేయండని కేసీఆర్ చెప్తున్నారు. ఏ నిమిషం ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండండి. మనలో మనం కొట్లడుకోడం మంచిది కాదు. మనది ప్రజల పార్టీ. గ్రామపంచాయతీలకు కేంద్రం ఇచ్చే డబ్బులు తప్ప దిక్కులేదు. స్థానిక సంస్థలను కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారు." - ఈటల రాజేందర్ 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలేవీ?: సీఎం రేవంత్ రెడ్డి
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 MI Vs KKR Result Update: ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
MI vs KKR: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ప్రపంచంలోనే తొలి ఫ్రాంచైజీగా అరుదైన ఘనత.
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ప్రపంచంలోనే తొలి ఫ్రాంచైజీగా అరుదైన ఘనత.
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
Dacoit Chichubuddi Song : స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Mangal Gochar 2026: మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
Embed widget