అన్వేషించండి

Telangana Investments: టెస్లాను తలదన్నే కార్ల కంపెనీ తెలంగాణలో.. ప్రదర్శనకు సూపర్ SUV, అదిరిపోయే డిజైన్‌తో..

ట్రిటాన్‌ సంస్థ మేనేజ్ మెంట్ హైదరాబాద్‌లో తొలిసారిగా ట్రిటాన్‌ హెచ్‌ మోడల్‌ ఎస్‌యూవీను ప్రదర్శనకు ఉంచింది. ఈ కార్యక్రమంలో జయేష్‌ రంజన్‌, ట్రిటాన్‌ సంస్థ వ్యవస్థాపకుడు హిమాన్షు పటేల్‌ పాల్గొన్నారు.

తెలంగాణలో మరో అంతర్జాతీయ స్థాయి ఆటోమొబైల్ పరిశ్రమ అడుగుపెట్టనుంది. అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ట్రిటాన్‌ తెలంగాణలోని తన రెండో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో దూసుకుపోతున్న టెస్లా కంపెనీకి ట్రిటాన్‌ ఎలక్ట్రిక్‌ కార్లు టెస్లాకు గట్టిపోటీ ఇవ్వనున్నాయి. అయితే, గతంలోనే ట్రిటాన్‌ తొలి ఉత్పత్తి కర్మాగారాన్ని మహారాష్ట్రలోని పుణెలో ఏర్పాటుచేయగా.. రెండో కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనున్నారు.

ఇందులో భాగంగా ట్రిటాన్‌ సంస్థ మేనేజ్ మెంట్ హైదరాబాద్‌లో తొలిసారిగా ట్రిటాన్‌ హెచ్‌ మోడల్‌ ఎస్‌యూవీను ప్రదర్శనకు ఉంచింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, ట్రిటాన్‌ సంస్థ వ్యవస్థాపకుడు హిమాన్షు పటేల్‌, మాన్సుర్‌ తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను జయేష్ రంజన్ ట్వీట్ చేశారు. ట్రిటాన్‌ తన రెండో ఉత్పత్తి కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసి కంపెనీ మరొక కీలక రాయిని చేరుకుందని జయేష్‌ రంజన్‌ తెలిపారు. 

ట్రిటాన్‌ తెలంగాణలో తన రెండో కర్మాగారాన్ని నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మానుఫ్యాక్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌-NIMZ) జహీరాబాద్‌ వద్ద ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ట్రిటాన్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం జరాసంగం మండలంలోని యెల్‌గోయ్ గ్రామం సమీపంలో భూమిని కూడా కేటాయించింది. అక్టోబర్‌ 7న ట్రిటాన్‌ సంస్థ యాజమాన్యం ప్రభుత్వం కేటాయించిన భూమిని సందర్శించింది. ట్రిటాన్‌ ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్‌ కోసం సుమారు రూ.2,100 కోట్లతో పెట్టుబడి పెట్టనున్నారు.

Also Read: కొత్త వృద్ధాప్య పింఛన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్... 57 ఏళ్ల వయసు నిండిన వారు అర్హులు... ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

ట్రిటాన్‌‌ సూపర్‌ ఎస్‌యూవీ ప్రత్యేకతలివే..!
సాధారణ ఎస్‌యూవీల కంటే ట్రిటాన్‌ హెచ్‌‌ఎస్‌యూవీ మోడల్‌ ఎక్కువ స్పేస్‌ను కలిగి ఉంది. ఈ కారు 7 కలర్లలో అందుబాటులోకి రానుంది. కంపెనీ వ్యవస్థాపకుడు హిమాన్షు పటేల్‌ ట్రిటాన్‌ హెచ్‌‌ఎస్‌యూవీ మోడల్‌ను సూపర్‌ ఎస్‌యూవీ అని అభివర్ణించారు. ట్రిటాన్ మోడల్ హెచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 1,500 హర్స్‌పవర్‌ను ఉత్పత్తి  చేస్తోంది. ఈ కారులో 200 kWh బ్యాటరీని అమర్చారు.  ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే గరిష్టంగా 1,120 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. హైపర్‌ ఛార్జింగ్‌ సహాయంతో కేవలం 2 గంటల్లోనే బ్యాటరీలు ఛార్జ్‌ అవుతాయని అన్నారు. అదీ కాక ఈ కారు 96 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.9 సెకండ్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది.

Also Read: నిద్రపోతున్న ఫ్యామిలీపై కూలిన పైకప్పు.. శాశ్వత నిద్రలోకి ఐదుగురు.. సీఎం దిగ్భ్రాంతి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chiranjeevi : డీప్ ఫేక్ ఫోటోస్, వీడియోస్ - మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ ఏంటంటే?
డీప్ ఫేక్ ఫోటోస్, వీడియోస్ - మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ ఏంటంటే?
Montha Cyclone Damage: తెలంగాణ రైతులను దెబ్బకొట్టిన ‘మొంథా’ తుపాను - 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం, పరిహారంపై సాయంత్రానికి ప్రకటన!  
తెలంగాణ రైతులను దెబ్బకొట్టిన ‘మొంథా’ తుపాను - 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం, పరిహారంపై సాయంత్రానికి ప్రకటన!  
Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అద్భుత అవకాశం- ఈ పని చేస్తే పారిశ్రామికవేత్తలుగా మారొచ్చు!
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అద్భుత అవకాశం- ఈ పని చేస్తే పారిశ్రామికవేత్తలుగా మారొచ్చు!
Bihar Assembly Election 2025 : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మేనిఫెస్టో విడుదల! లఖపతి నుంచి 4 నగరాల్లో మెట్రో ఏర్పాటుకు వరకు కీలకాంశాలు ఇవే!
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మేనిఫెస్టో విడుదల! లఖపతి నుంచి 4 నగరాల్లో మెట్రో ఏర్పాటుకు వరకు కీలకాంశాలు ఇవే!
Advertisement

వీడియోలు

Montha Cyclone Effect | ఖమ్మం జిల్లాలో లారీతో సహా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన డ్రైవర్ | ABP Desam
Mumbai Kidnapper Rohit Arya Incident | ఆడిషన్ కి వచ్చిన పిల్లల్ని కిడ్నాప్ చేస్తే...ముంబై పోలీసులు పైకి పంపించారు | ABP Desam
India vs Australia 2025 | Shafali Verma | సెమీస్‌కు ముందు భారత జట్టులో షెఫాలీ
India vs Australia | Womens World Cup 2025 | నేడు ఆస్ట్రేలియాతో భారత్ ఢీ
Rohit Sharma | ICC ODI Rankings | ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chiranjeevi : డీప్ ఫేక్ ఫోటోస్, వీడియోస్ - మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ ఏంటంటే?
డీప్ ఫేక్ ఫోటోస్, వీడియోస్ - మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ ఏంటంటే?
Montha Cyclone Damage: తెలంగాణ రైతులను దెబ్బకొట్టిన ‘మొంథా’ తుపాను - 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం, పరిహారంపై సాయంత్రానికి ప్రకటన!  
తెలంగాణ రైతులను దెబ్బకొట్టిన ‘మొంథా’ తుపాను - 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం, పరిహారంపై సాయంత్రానికి ప్రకటన!  
Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అద్భుత అవకాశం- ఈ పని చేస్తే పారిశ్రామికవేత్తలుగా మారొచ్చు!
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అద్భుత అవకాశం- ఈ పని చేస్తే పారిశ్రామికవేత్తలుగా మారొచ్చు!
Bihar Assembly Election 2025 : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మేనిఫెస్టో విడుదల! లఖపతి నుంచి 4 నగరాల్లో మెట్రో ఏర్పాటుకు వరకు కీలకాంశాలు ఇవే!
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మేనిఫెస్టో విడుదల! లఖపతి నుంచి 4 నగరాల్లో మెట్రో ఏర్పాటుకు వరకు కీలకాంశాలు ఇవే!
Khammam Crime News: ఖమ్మంలో దారుణం - సిపీఎం నేతను గొంతు కోసి చంపిన దుండగులు  
ఖమ్మంలో దారుణం - సిపీఎం నేతను గొంతు కోసి చంపిన దుండగులు  
Jemimah Rodrigues: ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. చిరకాలం గుర్తుండే ఇన్సింగ్స్ ఆడిన చిరుత జెమీమా
ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. ఆసీస్‌ను చిరుతలా వేటాడిన జెమీమా
Mohammad Azharuddin: మొహమ్మద్ అజారుద్దీన్ కంటే ముందు ఈ నలుగురు క్రికెటర్లు మంత్రులు అయ్యారు!
మొహమ్మద్ అజారుద్దీన్ కంటే ముందు ఈ నలుగురు క్రికెటర్లు మంత్రులు అయ్యారు!
Sai Durgha Tej : ఫోకస్ ఓన్లీ ఆన్ 'సంబరాల ఏటిగట్టు' - ఆ రూమర్స్‌కు చెక్ పెట్టేసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్
ఫోకస్ ఓన్లీ ఆన్ 'సంబరాల ఏటిగట్టు' - ఆ రూమర్స్‌కు చెక్ పెట్టేసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్
Embed widget