అన్వేషించండి

Old Age Pensions: కొత్త వృద్ధాప్య పింఛన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్... 57 ఏళ్ల వయసు నిండిన వారు అర్హులు... ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

తెలంగాణలో కొత్త వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 57 ఏళ్లు నిండిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.

తెలంగాణలో కొత్త వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన వారి నుంచి పింఛన్ల దరఖాస్తులు తీసుకోనున్నారు. సోమవారం నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. తెలంగాణలో 2019 జులై నుంచి కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ ఆగిపోయింది. టీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆసరా పింఛన్లు రూ. వెయ్యి, వికలాంగులకు ఇచ్చే పింఛన్లను రూ. 2 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తిరిగి రెండోసారి టీఆర్ఎస్ అధికారం చేపట్టాక ఆసరా పింఛన్ ను రూ.2016, వికలాంగుల పింఛను రూ.3016 లకు పెంచింది. కానీ వృద్ధాప్య పింఛన్ల అర్హతను వయసు మాత్రం 65 ఏళ్లుగా నిర్ణయించింది. దీంతో చాలా మందికి పింఛన్ వర్తించకుండా పోయింది.

Also Read: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో జనసేన పార్టీ ఏర్పాటు... మార్పు కోసం దెబ్బలు తినటానికైనా సిద్ధం... జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తుదారుల వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు మించకూదని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తుదారుల పేరిట మెట్ట భూమి 7.5 ఎకరాలు, మాగాణి 5 ఎకరాల లోపు ఉండాలి. కుటుంబంలో ఇప్పటికే ఎవరైనా పింఛను పొందుతుంటే మరొకరు దరఖాస్తుకు అనర్హులని తెలిపింది. అధికారులు వీటన్నింటినీ విచారణ చేసి అర్హులను గుర్తిస్తారు. అనంతరం పింఛను మంజూరవుతుంది. ఈ నెల 31కి 57 ఏళ్లు నిండిన వారంతా కొత్తగా వృద్ధాప్య పింఛను పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం పరిగణిస్తుంది. అర్హులు దగ్గరలోని మీ-సేవ కేంద్రాలకు వెళ్లి ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల తమ వయసు నిర్థారణకు పంచాయతీ, మున్సిపల్‌ జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రాలు లేదా విద్యాసంస్థలు జారీ చేసిన సర్టిఫికేట్స్, ఓటరు గుర్తింపుకార్డులో నమోదైన వయసును ఆధారంగా చూపించవచ్చని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్‌ కార్డు, వయసు నిర్థారణ పత్రంతో పాటు బ్యాంకు పాసు పుస్తకం, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోతో స్వయంగా దరఖాస్తుదారుడు మీ-సేవ కేంద్రానికి వెళ్లి వేలిముద్ర వేయాల్సిఉంటుంది.

Also Read: హైదరాబాద్ ఫార్మా కంపెనీలో రూ. 550 కోట్ల లెక్క చూపని ఆదాయం ! ఐటీ శాఖ కీలక ప్రకటన !

Also Read: వృద్ధాప్య పెన్షన్ వయసు పరిమితి తగ్గింపు.. ఇకనుంచి వీళ్లందరికీ ఆసరా పింఛన్లు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 CSK VS RCB Result Update :చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
Quantum Valley: అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
MS Dhoni Stumping: అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP DesamMyanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP DesamKavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 CSK VS RCB Result Update :చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
Quantum Valley: అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
MS Dhoni Stumping: అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
DA Hike:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
IPL 2025:శిఖర్ ధావన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు అయ్యగారనే నంబర్ వన్
శిఖర్ ధావన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు అయ్యగారనే నంబర్ వన్
TDP Nominated Posts: కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
Earth Quake Updates: భూకంపం దాటికి వణికిపోయిన బ్యాంకాక్ హైరైజ్ భవనాలు - మన దగ్గర అలాంటి పరిస్థితి వస్తే?
భూకంపం దాటికి వణికిపోయిన బ్యాంకాక్ హైరైజ్ భవనాలు - మన దగ్గర అలాంటి పరిస్థితి వస్తే?
Embed widget