అన్వేషించండి

Old Age Pensions: కొత్త వృద్ధాప్య పింఛన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్... 57 ఏళ్ల వయసు నిండిన వారు అర్హులు... ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

తెలంగాణలో కొత్త వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 57 ఏళ్లు నిండిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.

తెలంగాణలో కొత్త వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన వారి నుంచి పింఛన్ల దరఖాస్తులు తీసుకోనున్నారు. సోమవారం నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు దరఖాస్తుల స్వీకరించనున్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. తెలంగాణలో 2019 జులై నుంచి కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ ఆగిపోయింది. టీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆసరా పింఛన్లు రూ. వెయ్యి, వికలాంగులకు ఇచ్చే పింఛన్లను రూ. 2 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తిరిగి రెండోసారి టీఆర్ఎస్ అధికారం చేపట్టాక ఆసరా పింఛన్ ను రూ.2016, వికలాంగుల పింఛను రూ.3016 లకు పెంచింది. కానీ వృద్ధాప్య పింఛన్ల అర్హతను వయసు మాత్రం 65 ఏళ్లుగా నిర్ణయించింది. దీంతో చాలా మందికి పింఛన్ వర్తించకుండా పోయింది.

Also Read: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో జనసేన పార్టీ ఏర్పాటు... మార్పు కోసం దెబ్బలు తినటానికైనా సిద్ధం... జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తుదారుల వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు మించకూదని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తుదారుల పేరిట మెట్ట భూమి 7.5 ఎకరాలు, మాగాణి 5 ఎకరాల లోపు ఉండాలి. కుటుంబంలో ఇప్పటికే ఎవరైనా పింఛను పొందుతుంటే మరొకరు దరఖాస్తుకు అనర్హులని తెలిపింది. అధికారులు వీటన్నింటినీ విచారణ చేసి అర్హులను గుర్తిస్తారు. అనంతరం పింఛను మంజూరవుతుంది. ఈ నెల 31కి 57 ఏళ్లు నిండిన వారంతా కొత్తగా వృద్ధాప్య పింఛను పొందేందుకు అర్హులుగా ప్రభుత్వం పరిగణిస్తుంది. అర్హులు దగ్గరలోని మీ-సేవ కేంద్రాలకు వెళ్లి ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల తమ వయసు నిర్థారణకు పంచాయతీ, మున్సిపల్‌ జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రాలు లేదా విద్యాసంస్థలు జారీ చేసిన సర్టిఫికేట్స్, ఓటరు గుర్తింపుకార్డులో నమోదైన వయసును ఆధారంగా చూపించవచ్చని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్‌ కార్డు, వయసు నిర్థారణ పత్రంతో పాటు బ్యాంకు పాసు పుస్తకం, పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోతో స్వయంగా దరఖాస్తుదారుడు మీ-సేవ కేంద్రానికి వెళ్లి వేలిముద్ర వేయాల్సిఉంటుంది.

Also Read: హైదరాబాద్ ఫార్మా కంపెనీలో రూ. 550 కోట్ల లెక్క చూపని ఆదాయం ! ఐటీ శాఖ కీలక ప్రకటన !

Also Read: వృద్ధాప్య పెన్షన్ వయసు పరిమితి తగ్గింపు.. ఇకనుంచి వీళ్లందరికీ ఆసరా పింఛన్లు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TTD Chairman BR Naidu: మహిళతో ఉన్న వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ.. వాళ్ల బాగోతం బయటపెడతానంటూ వార్నింగ్
మహిళతో ఉన్న వీడియోపై బీఆర్ నాయుడు క్లారిటీ.. వాళ్ల బాగోతం బయటపెడతానంటూ వార్నింగ్
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
HPV Vaccine India: దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం- తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Chairman BR Naidu: మహిళతో ఉన్న వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ.. వాళ్ల బాగోతం బయటపెడతానంటూ వార్నింగ్
మహిళతో ఉన్న వీడియోపై బీఆర్ నాయుడు క్లారిటీ.. వాళ్ల బాగోతం బయటపెడతానంటూ వార్నింగ్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
Toxic Romantic Song : టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
టాక్సిక్ ఫస్ట్ సాంగ్ రెడీ - యశ్, కియారా రొమాంటిక్ ట్రాక్ వచ్చేది ఎప్పుడంటే?
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
Chronic Pain : ఆరు నెలలకు మించి నొప్పి ఉంటే జాగ్రత్త.. ఇవే అత్యంత బాధాకరమైన వ్యాధులు
ఆరు నెలలకు మించి నొప్పి ఉంటే జాగ్రత్త.. ఇవే అత్యంత బాధాకరమైన వ్యాధులు
Embed widget