అన్వేషించండి

Sigachi Incident : సిగాచి విషాదం: 8 మంది బూడిద, కుటుంబాలకు తీరని శోకం! పరిహారం, నివేదికపై తాజా అప్డేట్!

Sigachi Incident : సిగాచి ప్రమాదంలో కనిపించకుండా పోయిన 8మంది ఆచూకీ లభించడం కష్టమని అధికారులు తేల్చేశారు. కనీసం దహన సంస్కారాలకు ఎముకలు కూడా ఇవ్వలేమని ప్రకటించారు.

Sigachi Incident : తెలంగాణలోని పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనలో అధికారులు కీలక ప్రకటన చేశారు. దుర్ఘటన జరిగినప్పటి నుంచి అదృశ్యమైన వారిని చనిపోయిన జాబితాలో చేర్చారు. వారి కుటుంబాలకు విషయాన్ని చేరవేశారు. వారి ఆనవాళ్లు ప్రమాద స్థలంలో లేకపోవడంతో వారంతా కాలి బూడిదైపోయినట్టు తేల్చారు. 

సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి పది రోజులు అయ్యింది. ఈ దుర్ఘటనలో 44 మంది మరణించారు. కానీ ఇంకో ఎనిమిది మంది ఆచూకి మాత్రం లభించలేదు. వారి కోసం గాలింపు చేపట్టారు. ఫ్యాక్టరీలో అణువణువూ గాలించారు. మృతులకు సంబంధించిన డీఎన్ఏ వివరాలు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(CFSL)లో ఉన్నాయి. ఇన్ని చేసినప్పటికీ రాహుల్, వెంకటేష్, శివాజీ, విజయ్, జస్టిన్, అఖిలేష్, రవి, ఇర్ఫాన్ గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వారిని కూడా చనిపోయిన వారి జాబితాలో చేర్చారు.

బుధవారం అధికారులు ప్రకటించిన వివరాల ప్రకారం చనిపోయిన వారి సంఖ్య 52కి చేరింది. కనిపించకుండా పోయిన 8 మందిని కూడా మృతుల జాబితాలో చేర్చారు. వారికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. వారి బంధువులతో మాట్లాడారు. జూన్ 30న జరిగిన ప్రమాదంలో వారి ఆనవాళ్లు పూర్తిగా నాశమైనట్టు తేల్చారు. కనీసం డీఎన్ఏ టెస్టులకు కూడా ఏమీ మిగల్లేదని కుటుంబ సభ్యులకు చెప్పేశారు. 

సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో కనిపించకుండా పోయిన 8 మంది పూర్తిగా కాలిబుడిదైపోయినట్టు సంగారెడ్డి అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు. ఆయా కుటుంబాలతో మాట్లాడి తక్షణ సాయం కింద 15 లక్షలు అందజేయాలని నిర్ణయించారు. మిగతా ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేస్తామని వారికి వివరించారు. ప్రమాదం గురించి తెలుసుకున్నప్పటి నుంచి బాధిత కుటుంబాలు స్పాట్‌లోనే ఉన్నారు. ఏ క్షణం తమ వారి ఆచూకీ తెలుస్తుందని ఎదురు చూశారు. కానీ వారి ఎముకలు కూడా ఇవ్వలేమని అధికారులు చేతులెత్తేశారు. 

మూడు నెలల తర్వాత అందర్నీ పిలిచి మరణ ధ్రువీకరణ పత్రాలు, ఎక్స్‌గ్రేషియో ఇస్తామని అధికారులు తెలిపారు. విచారణ ఇంకా కొనసాగుతుందని వారికి సంబంధించిన ఎలాంటి సమాచారం దొరికినా కచ్చితంగా తెలియజేస్తామని అన్నారు. సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరుగుతున్న టైంలో 140మందికిపైగా పని చేస్తున్నారు. ప్రమాదం నుంచి 60 మంది సురక్షితంగా బయటపట్టారు. 52 మంది మరణించగా 30 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడులో మరణించిన వారికి ఆ సంస్థ కోటి రూపాయలు పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు పది లక్షల నుంచి 5 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియో ఇస్తామని తెలిపింది. మరోవైపు ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలు, క్షతగాత్రులకు 50వేల పరిహారం తక్షణ సాయం కింద అందజేసింది.   

సిగాచిలో ప్రమాదంపై రకరకాల వాదనలు వినిపించాయి. అందుకే దీనిపై నిజాలు నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది. ఈ కమిటీ ఇప్పటికే ఫ్యాక్టరీలో పర్యటించింది. అక్కడ పని చేసే సిబ్బందితో మాట్లాడుతోంది. క్షతగాత్రులు ఇతరులతో కూడా చర్చిస్తోంది. దీనిపై స్టడీ చేస్తున్న కమిటీ మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వబోతోంది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యల గురించి కూడా సూచనలు సలహాలు ఇవ్వనుందీ కమిటీ 

టాప్ హెడ్ లైన్స్

HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
Gun At Shopping Mall: కూకట్‌పల్లి లులు మాల్‌లో గన్ కలకలం.. యాజమాన్యంపై కేసు నమోదు
కూకట్‌పల్లి లులు మాల్‌లో గన్ కలకలం.. యాజమాన్యంపై కేసు నమోదు
TG TET 2026 Results: తెలంగాణ టెట్ 2026 ఫలితాల విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ టెట్ 2026 ఫలితాల విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Jyothika Munirathnam: 'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
Embed widget