అన్వేషించండి

KCR On Rains: ప్రతిపక్షాల విమర్శలకు సీఎంవో కౌంటర్- నిర్లక్ష్యం మాటే లేదని ప్రకటన

వానలు వరదల్లో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా నిత్యం ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నట్టు సీఎంవో తెలిపింది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాల్లో సీఎం పాల్గొనట్టు పేర్కొంది

తెలంగాణలో వరదలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది. ఎక్కడా అలసత్వం లేకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రజల ఆస్తులు, ప్రాణాలు కాపాడుతున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది.  

భారీ వానలు వరదల్లో ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చేసేందుకు నిత్యం ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నట్టు సీఎంవో తెలిపింది. ప్రగతి భవన్ వేదికగా పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాల్లో సీఎం కేసిఆర్ పాల్గొంటున్నారని పేర్కొంది. సమావేశాల్లో తీసుకుంటున్న నిర్ణయాలతో తక్షణమే అమలవుతున్నాయో లేదో నిరంతరం పరిశీలిస్తున్నట్టు పేర్కొంది.  

వరదలను ముందస్తుగా అంచనావేసి దార్శనికతతో నిర్ణయాలు సీఎం కేసీఆర్ తీసుకుంటున్నారని వెల్లడించింది. సీఎం ఆదేశాలతో ఎప్పటికప్పుడు ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పనుల్లో నిమగ్నమైన ఉందని తెలిపింది. ప్రజాసంక్షేమం పట్ల బాధ్యత ఉన్న సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణతో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన్నారు. 

ప్రకృతి విపత్తు వల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూడాలనే పట్టుదలతో  యంత్రాంగమంతా పని చేస్తోందని పేర్కొంది సీఎంవో. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి సహా ఇరిగేషన్, రోడ్లు భవనాలు, విద్యుత్తు, వైద్యం, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నతాధికారులతో రాత్రి పగలు నిరంతర పర్యవేక్షిస్తోందని వెల్లడించింది. వారితోపాటు సీఎం కేసిఆర్ కూడా జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నట్టు తెలిపింది. 

ఊహించని రీతిలో తలెత్తిన భారీ వానలు వరదల కారణంగా ఇబ్బండి పడుతున్న ప్రజల్లో భరోసా నింపేందుకు యంత్రాంగమంతా కృతనిశ్చయంతో ఉన్నారని... సహాయ చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని తెలిపింది. సమస్యాత్మక ప్రాంతాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి పరిస్థితులు చక్కబెట్టేలా సీఎం ఆదేశాలిస్తున్నారని వెల్లడించింది. యంత్రాంగమంతా సీఎం కేసీఆర్ విజ్ఞప్తితో స్వీయ నియంత్రణ పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఫలితంగానే  ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని చాలా వరకు కట్టడి చేసినట్టు ప్రకటించింది. 

నాలుగు రోజుల నుంచి సీఎం కేసీఆర్ స్వయంగా ప్రతి జిల్లా యంత్రాంగంతో మాట్లాడుతూ ఆదేశాలు ఇస్తున్నారని... ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్త తీసుకున్నట్టు సీఎంవో ప్రకటించింది. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికార అధికారులతో స్వయంగా మాట్లాడిన సీఎం అవసరమైన ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు, రెస్క్యూ టీంలు, హెలికాప్టర్లు సిద్దం చేసినట్టు తెలిపింది. 

సీఎం కేసిఆర్ ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయని.. విద్యుత్తు, రోడ్లు, తాగునీరు వైద్యానికి నిత్యావసర వస్తువులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది సీఎంవో. వానలు, వరదల కారణంగా ఎక్కడా అధిక ధరలకు వస్తువులు అమ్మకుండా వేరే సమస్యల్లేకుండా జాగ్రత్త పడినట్టు అధికారులను అప్రమత్తం చేసినట్టు ప్రకటించింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Embed widget