అన్వేషించండి

Kishan Reddy: నిర్మల్ లో బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్, పోలీసుల తీరుపై కిషన్ రెడ్డి ఆగ్రహం

Kishan Reddy About Nirmal Master Plan Issue: నిర్మల్ లో వందల ఎకరాల భూమిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన బంధువులకు కట్టబెట్టారని, అందుకు అనుకూలంగానే మాస్టర్ ప్లాన్ రూపొందించారని కిషన్ రెడ్డి ఆరోపించారు.

Kishan Reddys anger over Lathicharge on BJP workers :

నిర్మల్ లో నూతన మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీ ఛార్జ్ చేశారు. అక్కడినుంచి బీజేపీ నాయకులను చెదరగొట్టారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. నిర్మల్ లో వందల ఎకరాల భూమిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన బంధువులకు కట్టబెట్టారని ఆరోపించారు. ఆ భూములకు అనుకూలంగానే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రూపొందించారని విమర్శించారు.

" మాస్టర్ ప్లాన్ లోని లోసుగులను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. శాంతియుతంగా నిరసన తెలిపిన బీజేపీ కార్యకర్తలపై పోలీసు లాఠీ చార్జి చేశారు. నిర్మల్కు వెళ్తున్న బీజేపీ నాయకులు అరెస్టు చేసి ఇక్కడికి తరలించారు కూడా తెలియదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు అనేక అక్రమాలు చేస్తున్నారు" అని కిషన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.

అసలు ఏం జరిగిందంటే....
నిర్మల్ పట్టణ నూతన బృహత్ ప్రణాళిక రద్దు (Nirmal Master Plan Cancel) అంశంపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యం క్షీణించిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదని నేతలు మండిపడ్డారు. నిర్మల్ లో బీజేపీ కార్యకర్తలు చేపట్టిన రాస్తారోకో స్వల్ప ఉద్రిక్తత దారితీసింది. రోడ్డుపై బైఠాయించి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలెక్టర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బీజేపీ కార్యకర్తలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించడంతో లాఠీ చార్జి జరిగింది. 

ఓటమి భయంతోనే బీజెపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతుంది. ఇటువంటి సమయంలో బీజేపీ కార్యకర్తలు నాయకులు సమన్వయం పాటించాలి. రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలవబోతుందని  బీఅర్ ఎస్ నిరాశ, నిస్పృహతో ఇలాంటి కుట్రలు చేస్తుంది. ఆ కుట్రలో బీజేపీ కార్యకర్తలు పడకుండా సమన్వయం పాటించాలి.' అని కిషన్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇచ్చిన జోష్ తెలంగాణ బీజేపీ లో స్పష్టంగా కనిపిస్తుంది. టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ దూకుడు పెంచడానికి బీజేపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పై అన్ని వైపు నుంచి దాడి చేసి ఊపిరాడనివ్వకుండా చేయాలని బీజేపీ అధినాయకత్వం స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం చేయడంతో కిషన్ రెడ్డి సారథ్యంలో బీజేపీ నేతలు రంగంలోకి దిగుతున్నారు.

బీఆర్ఎస్ సర్కార్ కు ఊపిరి ఆడనివ్వని వ్యూహాలతో బీజేపీ అస్త్రాలను సందిస్తుంది. ఇక కేసీఆర్ వ్యతిరేక ప్రచారానికి సోషల్ మీడియాని కూడా జోరుగా వాడుకోవాలని నిర్ణయం తీసుకుంది. ప్రజల్లోకి ఎంత వ్యతిరేకత తీసుకువెళ్లగలిగితే అంత లాభిస్తుంది అన్న భావన వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు వచ్చే ఎన్నికలలో అధికారం కట్టబెట్టడానికి ఏ మాత్రం ఉపయోగపడతాయి అన్నది ఎన్నికల ఫలితాలతో తేలనుంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
KTR Fires On Revanth Reddy:
"యువకులు ఆ*త్మహత్యలు చేసుకుంటున్నారు, జాబ్‌క్యాలెండర్‌ ఏమైంది?" ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget