అన్వేషించండి

Telangana: జీఎస్టీ కుంభకోణం కేసులో కీలక పరిణామం.. మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ కు సిఐడి నోటీసులు.?

Former Cs Somesh Kumar: జీఎస్టీ కుంభకోణం కేసులో సిఐడి అధికారులు దూకుడు పెంచుతున్నారు. కేసులో కీలకంగా మారిన సోమేష్ కుమార్ తోపాటు మరికొందరికి నోటీసులు అందించేందుకు సిఐడి అధికారులు సిద్ధమవుతున్నారు.

Telangana GST Scam Case Updates: జీఎస్టీ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరికి నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు సిద్ధమవుతున్నారు. కొద్ది రోజుల్లోనే వీరికి  నోటీసులు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. మొదట ఈ కేసు దర్యాప్తును హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు చేపట్టారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ కేసును సిఐడి కి అప్పగించింది. సిసిఎస్ నుంచి ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సిఐడి అధికారులకు కీలక సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం మేరకే మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ సహా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్వీస్ టాక్స్ అదనపు కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామ ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఫ్లియాంటో టెక్నాలజీస్ కంపెనీ నిర్వాహకులకు నోటీసులు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 

ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చినట్టు గుర్తించిన సిఐడి 

స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూపు ద్వారా సోమేశ్ కుమార్ సర్వీస్ టాక్స్ అధికారులు విశ్వేశ్వరరావు, శివరామ ప్రసాద్, శోభన్ బాబులకు ఆదేశాలు ఇచ్చినట్లు సిఐడి అధికారులు ఆధారాలను సేకరించినట్లు చెబుతున్నారు. కమర్షియల్ టాక్స్ సెంట్రల్ కంప్యూటర్ వింగ్ జాయింట్ డైరెక్టర్ రవి కనూరి అందించిన ఆడిట్ రిపోర్ట్స్ ఆధారంగా దర్యాప్తును సిఐడి అధికారులు చేపట్టారు. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ సహా 75 కంపెనీలకు లబ్ధి చేసినట్లు ఆధారాలను సేకరించారు. ఈ కుంభకోణంతో ప్రభుత్వ ఖజానాకు సుమారు 1000 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు సిఐడి అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సిఐడి దర్యాప్తు ముమ్మరం అయితే కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ కేసును సిఐడి అధికారులు ప్రత్యేకంగా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసుపై సీరియస్ గానే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు ఈ కేసు విషయంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లేలా చేశారని ప్రభుత్వం భావించిన నేపథ్యంలోనే దీనిపై విచారణ చేపట్టింది. వీలైనంత వేగంగా విచారణ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో సిఐడి అధికారులు దూకుడు పెంచారు. కొద్దిరోజుల్లోనే నోటీసులు అందించి వారిని విచారించేందుకు సిఐడి అధికారులు సిద్ధమవుతున్నారు. సదరు అధికారులను విచారించిన తర్వాత కీలక అంశాలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు.

Also Read: పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా వెల్లడి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Pakistan Passenger Train Hijacked: పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
Rajamouli: ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
Robots Into SLBC Tunnel: రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Khammam Crime News: సర్వే, సోదాల పేరు చెప్పుకొని వచ్చేవాళ్లతో జాగ్రత్త- ఖమ్మంలో ఏం జరిగింది అంటే?
సర్వే, సోదాల పేరు చెప్పుకొని వచ్చేవాళ్లతో జాగ్రత్త- ఖమ్మంలో ఏం జరిగింది అంటే?
Embed widget