అన్వేషించండి

Telangana : పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా వెల్లడి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే?

Polytechnics Lecturers DV: తెలంగాణలో పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. వీరికి సెప్టెంబరు 20 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.

TGPSC Polytechnics Lecturers Merit List: తెలంగాణలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో అర్హత సాధించి, 1:2 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ ఆగస్టు 7న ప్రకటించింది. దివ్యాంగ అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో ఎంపిక చేసింది. మొత్తం 490 మంది అభ్యర్థులు మెరిట్ జాబితాకు ఎంపికయ్యారు. సబ్జెక్టుల వారీగా చూస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్-84, లెటర్ ప్రెస్ (ప్రింటింగ్ టెక్నాలజీ)-10, ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్-08, కెమిస్ట్రీ-15, ఫిజిక్స్-10, మెటలర్జి-10, ఫార్మసీ-08, ప్యాకేజింగ్ టెక్నాలజీ-06, ఫుట్‌వేర్ టెక్నాలజీ-05, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్-02, టెన్నరీ-02, టెక్స్‌టైల్ టెక్నాలజీ-02, జియోలజీ-02, బయోమెడికల్ ఇంజినీరింగ్-06, కెమికల్ ఇంజినీరింగ్-02, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-47, ఆటోమొబైల్ ఇంజినీరింగ్-28, మెకానికల్ ఇంజినీరింగ్-74, సివిల్ ఇంజినీరింగ్-169 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

సెప్టెంబరు 20 నుంచి ధ్రువపత్రాల పరిశీలన..   
ఎంపికైన అభ్యర్థులకు సబ్జెక్టులవారీగా సెప్టెంబరు 20 నుంచి 26 వరకు టీజీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా, పరిశీలన షెడ్యూలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు సెప్టెంబరు 19 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి లెవల్ (9ఎ)- రూ.56,100- 1,77,500, లెవల్-10- రూ.57,700-1,82,400 మధ్య జీతాలు చెల్లిస్తారు. 

అభ్యర్థుల ఎంపిక జాబితా-ధ్రువపత్రాల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

ధ్రువపత్రాల పరిశీలనకు అవసరమయ్యే డాక్యుమెంట్లు..
1) వెబ్‌సైట్‌లో సూచించిన ప్రకారం చెక్ లిస్ట్ (1 సెట్) ఉండాలి.
2) దరఖాస్తు సమయంలో సమర్పించి అప్లికేషన్ ఫామ్ (పీడీఎఫ్) ప్రింట్ కాపీ  
3) పరీక్ష హాల్‌టికెట్
4) పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి మార్కుల మెమో. 
5) 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు లేదా ప్రైవేట్/ఓపెన్ స్కూల్‌లో చదివిన అభ్యర్థులైతే రెసిడెన్స్/స్థానికత సర్టిఫికేట్ ఉండాలి. 
6) డిగ్రీ లేదా పీజీ ప్రొవిజినల్/ కాన్వొకేషన్ సర్టిఫికేట్, మార్కుల మెమో. 
7) ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ (అందులో తల్లిదండ్రుత పేర్లు తప్పనిసరిగా ఉండాలి).
8) బీసీ వర్గానికి చెందినవారైతే నాన్-క్రీమిలేయర్ సర్టిఫికేట్ ఉండాలి. ఇతర బీసీ సర్టిఫికేట్లు అంగీకరించరు.
9) EWS సర్టిఫికేట్
10) రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులగుతై వయోపరిమితి సడలింపు కోసం సర్వీస్ సర్టిఫికేట్/NCC  ఇన్‌స్ట్రక్టర్/ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికేట్/ సెన్సస్ సర్వీస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. 
11) ఇన్-సర్వీస్ అభ్యర్థులైతే NOC తప్పనిసరి. 
12) గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసిన రెండు సెట్ల అటెస్టేషన్ సర్టిఫికేట్ కాపీలు ఉండాలి. సంబంధింత పత్రాలు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
13) నోటిఫికేషన్‌ సమయంలో పేర్కొన్న అన్ని ఇతర సర్టిఫికేట్లు తీసుకురావాలి.
14) వెబ్ ఆప్షన్ల నమోదుకు 19.09.2024 - 28.09.2024 ప్రత్యేక లింక్ అందుబాటులో ఉండనుంది.
15) ఇటీవల దిగిన 3 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు

తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్  విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. 19 సబ్జెక్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. జనవరి 4 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 4 నుంచి 8 వరకు సబ్జెక్టులవారీగా పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పరీక్షలు నిర్వహించారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1(జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 (అభ్యర్థుల సబ్జెక్టు) పరీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణ కోసం హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, హనుమకొండ, నిజామాబాద్‌లలోని కేంద్రాల్లో నిర్వహించారు. పరీక్ష ఫలితాలకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 19న కమిషన్ విడుదల చేసింది. తాజాగా 1:2 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను, సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూలును కమిషన్ విడుదల చేసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget