అన్వేషించండి

Cab Booking: అలర్ట్! క్యాబ్ బుక్ చేసుకోవాలా? అందులో ఇక ఈ సౌకర్యం దొరకదు, డ్రైవర్ల కొత్త డిమాండ్

Uber, Ola Cabs News: పెట్రోలు, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నా ఈ క్యాబ్ బుకింగ్ సంస్థలు కమీషన్‌ పెంచక పోవడాన్ని డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు.

Cab Bookings: అసలే ఎండాకాలం.. అందరూ చల్లదనం కోసం తపించిపోతుంటారు. ఇక ఈ కాలంలో ప్రయాణాలు మరీ చిరాగ్గా ఉంటాయి. కాబట్టి, వీలైనంతగా అంతా ఏసీ ప్రయాణాలవైపే మొగ్గు చూపుతారు. బస్సు ప్రయాణాలైనా, క్యాబ్‌లైనా ఏసీ ఉంటే అంత త్వరగా అలసట రాదు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాబ్‌లలో వెళ్లాలనుకునే వారికి మాత్రం కాస్త చేదు వార్త. వాటిలో ఇక ఏసీ ఆన్ చేయరట. కావాలనుకుంటే మాత్రం అదనంగా డబ్బు చెల్లించాల్సిందే. ఎందుకంటే క్యాబ్ డ్రైవర్లందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 29 నుంచి ఇది వర్తించనుంది.

ఓలా, ఊబర్ లాంటి సంస్థలకు చెందిన క్యాబ్‌ల్లో ప్రయాణించేవారు ఏసీ కావాలనుకుంటే రూ.50 అదనంగా చెల్లించాల్సిందే. పెట్రోలు, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నా ఈ క్యాబ్ బుకింగ్ సంస్థలు డ్రైవర్లకు ఇచ్చే కమీషన్‌ పెంచక పోవడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఈ ‘నో ఏసీ’ నిర్ణయాన్ని తీసుకుంది. ఇందులో భాగంగా డ్రైవర్లు రైడ్ చేసే సందర్భంలో ఏసీ ఆఫ్ చేస్తున్నారు. ఏసీ కావాలంటే 25 కిలోమీటర్ల వరకూ అదనంగా రూ.25 నుంచి రూ.50 ఇవ్వాలని కోరుతున్నారు. కొందరు డ్రైవర్లు 25- 50 కిలోమీటర్ల మధ్య ప్రయాణానికి రూ.100 ఇవ్వాలని షరతులు పెడుతున్నారు. ప్రయాణికులు కూడా తమ డ్రైవర్ల ఇబ్బందులను అర్థం చేసుకోవాలని కోరుతున్నారు.

ఇంధన ధరల పెరుగుదల వల్లే
రెండేళ్ల కాలంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు బాగా పెరిగాయి. డ్రైవర్లపై అది భారమే. దానికి అనుగుణంగా ఓలా, ఉబర్‌ సంస్థలు డ్రైవర్లకు ఇచ్చే బేస్‌ ఫెయిర్‌ మాత్రం పెంచలేదని వారు ఆరోపిస్తున్నారు. రెండేళ్ల నాటి ధరలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఒక్కో డ్రైవర్‌కు బేస్‌ ఫేర్‌ రూ.12-13 వరకూ ఇస్తున్నారని, పెరిగిన ఇంధన ధరల ప్రకారం రూ.24 నుంచి 25 వరకూ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ధరలు పెంచితే ప్రయాణికులకు ఏసీ ఆన్ చేసేందుకు సిద్ధమని చెబుతున్నారు. క్యాబ్‌లలో ‘నో ఏసీ’ ప్రచార కార్యక్రమం తొలుత కోల్‌కతాలో ప్రారంభమైంది. అనంతరం దిల్లీ, ముంబయి, లఖ్‌నవూలో టాక్సీ డ్రైవర్లు దీన్ని అనుసరించాయి. తాజాగా హైదరాబాద్‌ డ్రైవర్లు దీన్ని ప్రారంభించారు.

నేడు, రేపు సమ్మెకు మద్దతు
మార్చి 28, 29 తేదీల్లో దేశవ్యాప్త కార్మిక సమ్మెకు రాష్ట్రంలోని క్యాబ్‌లు, ఆటోల సంఘాలు మద్దతు పలికాయి. ఈ సోమవారం బంద్‌ పాటిస్తున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్‌ యూనియన్ల జేఏసీ ప్రకటించింది. ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయం ముందు యూనియన్‌ నేతలు, డ్రైవర్లతో ధర్నా నిర్వహిస్తామని, మంగళవారం దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలుపుతామని ప్రకటించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
GodavariPushkaralu 2027: గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు! 2027లో ప్రారంభం, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు
గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు! 2027లో ప్రారంభం, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు
MLAs Disqualification Petitions: దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ - బీఆర్ఎస్ ఆగ్రహం
దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ - బీఆర్ఎస్ ఆగ్రహం
Praneeth Antilia controversy: గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case : 13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget